తుని రైలు దహనం వైకాపా కుట్రే
కాపులకు రిజర్వేషన్ ఇవ్వను.. పొండి అని జగన్ అన్నారు. కాపు పెద్దలు, ఎమ్మెల్యేలను అడుగుతున్నా.. రిజర్వేషన్లు ఇవ్వనన్న వ్యక్తికి ఆ పార్టీలో కూర్చొని ఏ ప్రాతిపదికన మద్దతు పలుకుతున్నారు?
ద్వారంపూడి, కరుణాకరరెడ్డి తదితరుల పన్నాగం
కులాల మధ్య చిచ్చుపెడుతున్న జగన్
కిర్లంపూడి సభలో పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
కాపులకు రిజర్వేషన్ ఇవ్వనన్న జగన్కు.. వైకాపా ఎమ్మెల్యేలు ఎందుకు మద్దతిచ్చారు?
రాష్ట్ర పరిధిలో ఉన్న 5% ఈబీసీ రిజర్వేషన్లు ఎందుకు తొలగించారని ప్రశ్న
కాపులకు రిజర్వేషన్ ఇవ్వను.. పొండి అని జగన్ అన్నారు. కాపు పెద్దలు, ఎమ్మెల్యేలను అడుగుతున్నా.. రిజర్వేషన్లు ఇవ్వనన్న వ్యక్తికి ఆ పార్టీలో కూర్చొని ఏ ప్రాతిపదికన మద్దతు పలుకుతున్నారు? రిజర్వేషన్ ఇవ్వకపోవడం ఆయన విధానం అనుకుంటే.. రాష్ట్ర పరిధిలో ఉన్న 5 శాతం ఈబీసీ రిజర్వేషన్లు ఎందుకు తీసేశారు? కనీసం అందులో అర శాతం కూడా పొందేందుకు కాపులకు అర్హత లేదా? మరి వైకాపా ఎమ్మెల్యేలకు కాపులు ఎందుకు ఓట్లేయాలి. వారొస్తే నిలదీయండి.
కిర్లంపూడి సభలో పవన్
ఈనాడు- కాకినాడ, రాజమహేంద్రవరం: కాపు రిజర్వేషన్ ఉద్యమంలో భాగంగా 2014లో తునిలో జరిగిన రైలు దహనం వెనుక వైకాపా కుట్ర ఉందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆరోపించారు. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి తదితర నాయకులంతా కూర్చొని రిజర్వేషన్లు రావని తెలిసినా.. కాపు యువతను ఎగదోశారని దుయ్యబట్టారు. తుని దగ్గర ఉన్న కొబ్బరితోటల్లో కిరాయిమూకలను పెట్టి రైలు తగలబెట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తర్వాత ఆ కేసుల్లో అమాయకులైన యువత నలిగిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ఉద్యమమైనా త్రికరణశుద్ధిగా చేయకపోతే అమాయకులు బలైపోతారనడానికి ఇదే నిదర్శనమన్నారు. మీకు అన్యాయం చేసిన ఈ నాయకులకు మళ్లీ ఓటేస్తారా అని ప్రశ్నించారు. కులాల మధ్య జగన్ చిచ్చు పెడుతున్నారని ప్రజలు గమనించాలని కోరారు. తాను ఆవేశంతో మాట్లాడతాను గానీ విధ్వంసం వైపు నడిపించనన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి, ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలలో ఆదివారం నిర్వహించిన వారాహి విజయభేరి బహిరంగ సభల్లో పవన్ ప్రసంగించారు.
సినిమా నటులు మనుషులు కాదా?
‘కిర్లంపూడిలోని పెద్దలు (ముద్రగడ పద్మనాభాన్ని ఉద్దేశించి).. సినిమా నటులకు ఏం తెలుసని అన్నారు. ఆయన మీద సంపూర్ణ గౌరవం ఉంది. సినిమా నటులు మనుషులు కాదా? వారికి ప్రేమ ఉండదా? సామాజిక బాధ్యత ఉండదా? నేను సినిమాల్లోకి రావాలని అనుకోలేదు.. కుదిరింది అంతే’ అని అన్నారు.
వైకాపాను చిత్తుగా ఓడించండి
‘యువతీ యువకులారా.. మీ భవిష్యత్తును మీరే నిర్మించుకోండి. మీరు సముద్రం లాంటివాళ్లు. సముద్రం ఒకరి కాళ్ల దగ్గర కూర్చుని మొరగదు. మీకు తుపానుకు ఉన్నంత బలం, పర్వతానికి ఉన్నంత శక్తి ఉంది. తుపాను గొంతు చిత్తం అనడం ఎరగదు. పర్వతం ఎవరికీ వంగి సలామ్ చేయదు. మీరందరూ మేమింతే అనుకోకండి. మీరు గొంతెత్తితే.. జగన్ ప్రభుత్వాన్ని ఈడ్చి బంగాళాఖాతంలో పడేసేంత శక్తి మీ దగ్గర ఉంది. వైకాపాను చిత్తుగా ఓడించండి’ అని పవన్ పిలుపునిచ్చారు. ‘ఒక్క అవకాశం అని అధికారంలోకి వచ్చిన జగన్ పాలనలో ఈ ఐదేళ్లలో మీ బతుకులు బాగుపడ్డాయా? వైకాపా ప్రభుత్వాన్ని మార్చాలా.. వద్దా’ అని ప్రజలను ప్రశ్నించారు. ‘అవును మార్చేద్దాం’ అంటూ ప్రజలు నినాదాలు చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుందన్నారు. వారి బంగారు భవిష్యత్తు కోసం కూటమి అసెంబ్లీలో అడుగు పెట్టాలన్నారు. ‘భవన నిర్మాణ కార్మికుల సంక్షేమనిధి నుంచి జగన్ ప్రభుత్వం రూ.450 కోట్లు తీసేసుకుంది. కూటమి అధికారంలోకి రాగానే సంక్షేమనిధి.. భవన నిర్మాణ కార్మికులకు చెందేలా చర్యలు తీసుకుంటా. ఎయిడెడ్ విద్యాలయాలు పునరుద్ధరిస్తాం’ అని హామీ ఇచ్చారు.
జనసేన గొంతు అసెంబ్లీలో వినపడాలి
‘నేను ఎన్నిసార్లు సభలకు వచ్చినా మీరు రోడ్లమీదికి వస్తున్నారు. చప్పట్లు కొడుతున్నారు. కానీ జనసేన గొంతు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోకి వెళ్లి వినిపిస్తే దానికి ఉండే శక్తి వేరు. జనసేన, తెదేపా, భాజపా అభ్యర్థులను గెలిపిస్తే.. అన్ని చేతులూ కలిసి ప్రభుత్వం ఏర్పాటైతే మీ కష్టాలు తీరతాయి. కూటమి అభ్యర్థులను గెలిపించండి’ అని కోరారు. ‘జగన్, మిథున్రెడ్డి, పెద్దిరెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డిల కుటుంబాలు అడ్డగోలుగా దోచేస్తున్నాయి. మాఫియా డాన్ ద్వారంపూడితో పోరాడుతున్నాం. ప్రత్తిపాడు మండలం లంపకలోవ సమీపంలో ఆయన సోదరుడు వీరభద్రారెడ్డి కంపెనీ పెట్టి.. మట్టి, గ్రావెల్ అక్రమంగా తరలించి నిర్మాణం చేపట్టారు. మైనింగ్ సెస్తో కంపెనీ కోసం రోడ్డేసుకున్నారు. వంతాడ మైనింగ్లో అడ్డగోలుగా దోచేస్తున్నారు. లేటరైట్ అని చెప్పి బాక్సైట్ తవ్వేస్తున్నారు. దీన్ని అడ్డుకుంటా’ అని చెప్పారు. జగన్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న యువతను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘మీ అందరికీ లోపల చాలా ఆవేశం ఉంది. ఈ ప్రభుత్వాన్ని తీసి చెత్తబుట్టలో పడేయండి. చలమలశెట్టి సునీల్ లాంటి వైకాపా అభ్యర్థులను ఓడించండి. కాకినాడ లోక్సభ కూటమి అభ్యర్థి తంగెళ్ల ఉదయ్శ్రీనివాస్, ప్రత్తిపాడు, జగ్గంపేట ఎమ్మెల్యే అభ్యర్థులు వరుపుల సత్యప్రభ, జ్యోతుల నెహ్రూలను గెలిపించండి’ అని పిలుపునిచ్చారు.
జగన్కు మోదీ అంటే భయం
‘నేను మోదీ దగ్గరకు వెళ్లి మాట్లాడగలను. సీఎం జగన్ మోదీ దగ్గర భయపడతారు. జగన్ ప్రధాని వద్దకు వెళ్తే నా మీదున్న 39 కేసులు కొట్టేయండి.. ఎమ్మెల్సీ అనంతబాబు కేసు కొట్టేయండి అంటారు. ఇలాంటి క్రిమినల్స్ను మోదీ వెనకేసుకుని వస్తారనుకుంటున్నారా? ఒక్కొక్కర్ని తాటతీసి కింద కూర్చోబెడతారు’ అని పవన్ పేర్కొన్నారు.
కాపుల్ని తాకట్టు పెట్టే స్థాయి ఉంటే ఓడిపోతానా?
‘నేను కిర్లంపూడి వచ్చాను కాబట్టి కాపు రిజర్వేషన్ గురించి మీ ఆలోచన ఏంటని అడుగుతారు. ఆర్థికంగా, సామాజికంగా వెనకబడి ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్ల దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారంతా రిజర్వేషన్ కోరుకుంటారు. నేను కులనాయకుణ్ని కాదు. అందుకే ఇందులో కష్టాలేమున్నాయి? ఏం చేయగలమని ఆలోచిస్తాను. కాపులను తాకట్టు పెట్టేస్తున్నావ్ అని నాయకులు నన్ను విమర్శించారు. ఆ స్థాయి నాకుంటే ఓడిపోతానా? ప్రభుత్వం స్థాపించలేనా? ఆ వర్గంలో నేను పుట్టినా అన్ని వర్గాలనూ గుండెల్లో పెట్టుకున్నాను’ అని పవన్ పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దళిత మహిళ పట్ల వైకాపా అభ్యర్థి దురుసు ప్రవర్తన
గుంటూరు వైకాపా ఎంపీ అభ్యర్థి కిలారు వెంకట రోశయ్య దళిత మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించారు. -
మాచర్లలో ఈవీఎంల ధ్వంసం.. తాడిపత్రిలో రాళ్ల దాడి
పోలింగ్ ప్రక్రియకుల వైకాపా కార్యకర్తలు అడుగడుగునా అడ్డుపడుతున్నారు. పల్నాడు జిల్లా మాచర్లలో ఈవీఎంలను ధ్వంసం చేశారు. దీంతో సిబ్బంది పోలింగ్ నిలిపివేసి.. భయంతో బయటకు వెళ్లిపోయారు. -
ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ స్పందించాలి: చంద్రబాబు
పల్నాడు జిల్లాతోపాటు రాష్ట్రంలో వివిధ చోట్ల చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. -
ఆగని వైకాపా దాడులు.. అరాచకం అంతానికి పోటెత్తిన ఓటర్లు
పోలింగ్ రోజున వైకాపా నేతల తీరుపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఓవైపు పోలింగ్ కొనసాగుతున్నా.. వారి ప్రలోభాల పర్వం మాత్రం ఆగడం లేదు. -
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. ఉదయం 11 గంటల వరకు పోలింగ్ శాతం ఇలా..
తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ సందడి కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు ఏపీలో 23.10 శాతం, తెలంగాణలో 24.31 శాతం పోలింగ్ నమోదైంది. -
క్యూలో రమ్మని చెప్పినందుకు.. ఓటరుపై వైకాపా అభ్యర్థి దాడి
వైకాపా నేతల అరాచకాలకు అంతేలేకుండా పోతోంది. ఓటేసేందుకు క్యూ లైన్లో రావాలని చెప్పినందుకు.. ఓ ఓటరుపై తెనాలి వైకాపా అభ్యర్థి శివకుమార్ చేయి చేసుకున్నారు. -
దాడులపై ఈసీ చర్యలు తీసుకోవాలి: వైఎస్ షర్మిల
కడప పార్లమెంటు పరిధిలో జరుగుతున్న దాడులపై ఈసీ చర్యలు తీసుకోవాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) డిమాండ్ చేశారు. -
భారీ కాన్వాయ్తో గోపిరెడ్డి హల్చల్.. ఎన్నికల నిబంధనల ఉల్లంఘన
నరసరావుపేటలో వైకాపా అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాస్రెడ్డి హల్చల్ చేశారు. భారీ కాన్వాయ్తో పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. -
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. ఉదయం 9 గంటల వరకు పోలింగ్ శాతం ఇలా..
తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ సందడి కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు ఏపీలో 9.05శాతం, తెలంగాణలో 9.51 శాతం పోలింగ్ నమోదైంది. -
అన్నమయ్య జిల్లా దలవాయిలో ఈవీఎంల ధ్వంసం.. నిలిచిన పోలింగ్
పోలింగ్ రోజున వైకాపా నేతల దౌర్జన్యాలు పెచ్చుమీరుతున్నాయి. కట్టుదిట్టమైన భద్రత ఉన్నా బలవంతంగా పోలింగ్ కేంద్రాల్లోకి చొరపడి అరాచకాలకు ఒడిగడుతున్నారు. -
ఏపీలో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న పోలింగ్
తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఏపీలోని మొత్తం 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాలకు, తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. -
వైకాపా నేతల అరాచకాలు.. పలుచోట్ల ఏజెంట్లపై దాడులు
AP Assembly Elections: తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. తెలంగాణలో ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. -
ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్లో పాల్గొనాలి: ప్రధాని మోదీ
AP Assembly Elections: ఏపీ అసెంబ్లీ సహా దేశవ్యాప్తంగా జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు పెద్ద ఎత్తున పాల్గొనాలని ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. -
రౌడీయిజం, గూండాయిజంతో రెచ్చిపోతే ఊరుకునేది లేదు: చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. సతీమణి భువనేశ్వరితో కలిసి ఉండవల్లిలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి... -
పీలేరులో తెదేపా ఏజెంట్ల కిడ్నాప్!
చిత్తూరు జిల్లా పీలేరులో ముగ్గురు ఏజెంట్లను కిడ్నాప్ చేశారంటూ తెదేపా ఈసీకి ఫిర్యాదు చేసింది. వారిని పోలింగ్ కేంద్రాల్లోకి చేరుకోలేని ప్రాంతంలో వదిలారని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లింది. -
పోలింగ్ కేంద్రంలో తెదేపా ఏజెంట్లపై దాడి
పల్నాడు జిల్లా రెంట చింతల మండలం రెంటాలలో ఇద్దరు తెదేపా ఏజెంట్లపై వైకాపా వర్గీయులు దాడి చేశారు. -
చంపేసి, శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?
‘తెదేపాకు ఏజెంట్గా కుర్చుంటావా.. చంపి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు’ అంటూ తెదేపా సానుభూతిపరుడిపై వైకాపా నేతలు దాడికి యత్నించారు. -
తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన సార్వత్రిక ఎన్నికల పోలింగ్
తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఓటు వేసేందుకు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. -
మాకిదే మొదటి ఓటు.. కొనలేదు ఏ నోటు
కూటికి పేదలైనా.. గుణంలో మేటి అనిపించుకున్నారు గుంటూరు కాకుమానువారితోట వాసులు. ‘మా ఓటు అమ్మబడదు’ అని వారి గుడిసెల వద్ద ఇలా ఫ్లెక్సీలు అంటించారు. -
పోలింగ్ కేంద్రాల్లో వైకాపా రంగులా?
తిరుపతిలోని పోలింగ్ కేంద్రాల్లో అధికార పార్టీ రంగులు పోలిన షామియానాలు వేయడంపై కూటమి నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
-
అదే మమ్మల్ని దెబ్బతీసింది.. లేదంటే బెంగళూరును 150కే కట్టడి చేసేవాళ్లం: అక్షర్
-
నీ ఓటు ఎటువైపు పోవాలో నీ చేతుల్లోనే ఉంది.. ఓటు విలువ చెప్పిన హీరోలు
-
గురుద్వారలో మోదీ సేవ.. భక్తులకు స్వయంగా వడ్డించిన ప్రధాని
-
పాత మిత్రుడు కనిపించగానే ధోనీ ఏం చేశాడంటే..!
-
పుతిన్ కీలక నిర్ణయం.. రక్షణ మంత్రిగా షోయిగు తొలగింపు