పేదల ప్రాణాలతో చెలగాటమాడొద్దు
ఇంటివద్ద పింఛన్లు ఇవ్వకుండా గత నెలలో 32 మంది పింఛనుదారుల్ని ముఖ్యమంత్రి పొట్టన పెట్టుకున్నారని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. రాజకీయ పిచ్చితో పేదల ప్రాణాలతో చెలగాటమాడొద్దని హితవు పలికారు.
ఇప్పటికే 32 మంది పింఛనుదారుల్ని పొట్టన పెట్టుకున్నారు
కర్నూలు జిల్లా కౌతాళం, గూడూరు ప్రజాగళం సభల్లో చంద్రబాబు ధ్వజం
జగన్ మ్యానిఫెస్టోకు సున్నా మార్కులని ఎద్దేవా
రాయలసీమ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని హామీ
ఈనాడు, కర్నూలు: ఇంటివద్ద పింఛన్లు ఇవ్వకుండా గత నెలలో 32 మంది పింఛనుదారుల్ని ముఖ్యమంత్రి పొట్టన పెట్టుకున్నారని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. రాజకీయ పిచ్చితో పేదల ప్రాణాలతో చెలగాటమాడొద్దని హితవు పలికారు. ఇలా ప్రాణాలు పోగొట్టుకున్నవారి ఆత్మలు ముఖ్యమంత్రిని భూస్థాపితం చేస్తాయని హెచ్చరించారు. ఆదివారం ఆయన కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలోని కౌతాళం, కోడుమూరు నియోజకవర్గంలోని గూడూరుల్లో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభల్లో మాట్లాడారు. పింఛన్లను లబ్ధిదారుల ఇంటికి తీసుకెళ్లి అందించాలన్నారు. రూ.200 పింఛన్ను రూ.2వేలకు పెంచింది తానేనన్నారు. తెదేపా అధికారంలోకి రాగానే పింఛన్ను రూ.4 వేలకు పెంచుతామని.. పెంచిన మొత్తాన్ని ఈ ఏప్రిల్ నెల నుంచి ఇస్తామని పునరుద్ఘాటించారు.
జగన్ రాయలసీమ ద్రోహి
సీఎం జగన్ రాయలసీమ ద్రోహి అని, సీమకు కేటాయించిన 102 సాగునీటి ప్రాజెక్టులను రద్దు చేశారని చంద్రబాబు మండిపడ్డారు. ఆర్డీఎస్కు రూ.1,955 కోట్లు ఇస్తే ఖర్చు పెట్టలేదని, వేదవతి ప్రాజెక్టుకు రూ.1,942 కోట్లు ఇస్తే పంప్హౌస్, కాలవ పనులను నిలిపివేశారని ధ్వజమెత్తారు. గుండ్రేవులను కూడా గాలికొదిలేశారన్నారు. ఈ ముఖ్యమంత్రికి నీటి విలువ తెలియదన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
విజన్ లేని సీఎం
ముఖ్యమంత్రికి ఒక విజన్.. ప్రజల్ని ఆర్థికంగా, సామాజికంగా పైకి తీసుకొచ్చే సామర్థ్యం ఉండాలని చంద్రబాబు అన్నారు. జగన్మోహన్రెడ్డికి ప్రజల ఆస్తుల్ని దోచుకోవాలన్న ఆలోచన తప్ప... వారిపై ఎలాంటి ప్రేమా లేదన్నారు. హైదరాబాద్ను మించిన రాజధానిని అమరావతిలో నిర్మించాలనుకుంటే దాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. జగన్రెడ్డి నవరత్నాల పేరుతో నవమోసాలు చేశారని దుయ్యబట్టారు. వైకాపా ఐదేళ్ల పాలనలో ప్రజల జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా అని ప్రశ్నించారు. రాయలసీమలో 52 అసెంబ్లీ సీట్లుంటే... ప్రజలకు అబద్ధాలు చెప్పి, మోసాలు చేసి, ఓట్లు దండుకుని 49 సీట్లు గెలిచి చివరకు ఈ ప్రాంతానికి ఏమీ చేయలేదని విమర్శించారు.
వలసలతో యువతకు పెళ్లిళ్లు కావడం లేదు
కర్నూలు జిల్లా నుంచి భారీగా వలసలు ఉంటున్నాయని, ఒక్క మంత్రాలయం నియోజకవర్గం నుంచే ఉపాధి కోసం ఏటా 80 వేల మంది వలసవెళుతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. సరైన ఉద్యోగాలు లేక, ఉపాధి దొరకక, వలసలు వెళ్తుండటంతో కౌతాళం వంటి ప్రాంతాల్లో పలువురికి పెళ్లిళ్లు కూడా కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే వలసల నియంత్రణకు చర్యలు తీసుకుంటామన్నారు.
జగన్ మ్యానిఫెస్టో అట్టర్ఫ్లాప్
జగన్ మ్యానిఫెస్టోకు ప్రజలు జీరో మార్కులు వేస్తున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఆయన మ్యానిఫెస్టో అట్టర్ఫ్లాప్ అయ్యిందన్నారు. అందులో ఏమీ లేదని... జగన్ చేతులెత్తేశారని పేర్కొన్నారు. బటన్ నొక్కితే ఆదాయం వస్తుందా అని నిలదీశారు. తెదేపా సూపర్ సిక్స్ హామీలను ప్రజలకు వివరించారు. డ్వాక్రా సంఘాలకు రూ.10 లక్షల వడ్డీ లేని రుణాలు ఇస్తామని ప్రకటించారు.
నాసిరకం మద్యంతో ప్రాణాలు తోడేస్తున్నారు
రాష్ట్రంలో రూ.60 మద్యం సీసాను రూ.200కు విక్రయిస్తున్నారని, ఇందులో రూ.140 జగన్ జేబులోకి వెళ్తున్నాయని తెదేపా అధినేత ఆరోపించారు. నాణ్యత లేని, హానికరమైన మద్యంతో సీఎం మహిళల పుస్తెలు తెంచేస్తున్నారని మండిపడ్డారు.
నాణ్యమైన మద్యం కోసం కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాలవారు కర్ణాటక వెళ్తున్నారని చంద్రబాబు చెప్పారు. జగన్ను ఇంటికి పంపితేనే రాష్ట్రానికి రక్షణ ఉంటుందన్నారు. రాష్ట్రాన్ని నిలబెట్టడానికి, ప్రజలకు న్యాయం చేయడానికే తెదేపా, భాజపా, జనసేన కూటమిగా ఏర్పడ్డాయన్నారు. మంత్రాలయం అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి, కోడుమూరు అభ్యర్థి బొగ్గుల దస్తగిరి, కర్నూలు లోక్సభ అభ్యర్థి బస్తిపాటి నాగరాజులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యుద్ధప్రాతిపదికన కాలువల పనులు చేయాలి
రాష్ట్రంలో ఎన్నికల హడావుడి ముగిసిన నేపథ్యంలో ప్రభుత్వం సాగునీటి కాలువల నిర్వహణ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మంగళవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. -
రెట్టింపు మూల్యం చెల్లించుకోవడానికి వైకాపా నాయకులు ‘సిద్ధం’గా ఉండాలి
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై దాడిని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు. -
రాక్షస పాలనకు వ్యతిరేకంగా ఓటేసిన వారికి ధన్యవాదాలు
వైకాపా నాయకులు దాడులు చేసినా ప్రజలు భయపడకుండా ఓటేయడానికి ముందుకు వచ్చారని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య హర్షం వ్యక్తం చేశారు. -
ప్రజాస్వామ్యాన్ని గెలిపించిన ఓటర్లకు కృతజ్ఞతలు
ఎన్నికల మహా యజ్ఞంలో పాల్గొని ప్రజాస్వామ్యాన్ని గెలిపించిన ఓటర్లకు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల మంగళవారం ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. -
తెదేపా బూత్ ఏజెంట్ పంటకు నిప్పు
చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో తెదేపా బూత్ ఏజెంటుగా పనిచేసిన వ్యక్తి పొలానికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. -
ప్రధానికి చంద్రబాబు శుభాకాంక్షలు
ఉత్తరప్రదేశ్లోని వారణాసి లోక్సభ స్థానం నుంచి మూడోసారి పోటీ చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. -
ఓటర్ సుధాకర్పై దాడి ఘటన.. తెనాలి ఎమ్మెల్యే, మరో ఏడుగురిపై కేసు
పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే అయినా నిబంధనలు పాటించాల్సిందేనని చెప్పినందుకు ఓటరు గొట్టుముక్కల సుధాకర్ను తెనాలి వైకాపా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, ఆయన అనుచరులు విచక్షణారహితంగా కొట్టిన ఘటనలో ఎమ్మెల్యే, మరో ఏడుగురిపై 341, 323 రెడ్ విత్ ఐపీసీ 34 సెక్షన్ల కింద కేసు నమోదైంది. -
జగన్ను సాగనంపడానికే అర్ధరాత్రి వరకు ఓట్లేశారు: బుచ్చయ్య చౌదరి
అరాచక, ఆటవిక వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోట్లాది మంది ప్రజలు ఓట్లేసి తీర్పు ఇచ్చారని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. -
మంత్రి బుగ్గనపై ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు
రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గనపై నంద్యాల జిల్లా బేతంచెర్ల పోలీసుస్టేషన్లో ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు నమోదైంది. -
పిన్నెల్లి సోదరుల హౌస్ అరెస్ట్!
మాచర్ల నియోజకవర్గంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిని హౌస్ అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. -
మంత్రి జోగి రమేష్, ఆయన కుమారుడిపై కేసు
కృష్ణా జిల్లా పోరంకిలో పోలింగ్ బూత్ల వద్ద సోమవారం దాడి చేసి భీతావహ వాతావరణం సృష్టించిన ఘటనపై రాష్ట్ర మంత్రి, పెనమలూరు వైకాపా అభ్యర్థి జోగి రమేష్, ఆయన కుమారుడు రాజీవ్లతో పాటు పలువురు వైకాపా నేతలపై పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేశారు. -
పల్నాడు జిల్లాలో 144 సెక్షన్
పోలింగ్ సందర్భంగా పల్నాడు జిల్లాలో చెలరేగిన హింసాత్మక సంఘటనలు రెండోరోజూ కొనసాగడంతో ఈసీ 144 సెక్షన్ అమలుకు ఆదేశించింది. ఈ మేరకు జిల్లా పాలనాధికారి శివశంకర్ పోలీసు శాఖకు ఉత్తర్వులిచ్చారు. -
జమ్మలమడుగులో ఉద్రిక్తత
వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో ఉద్రిక్తత నెలకొంది. ఎన్డీయే కూటమి అసెంబ్లీ అభ్యర్థి ఆదినారాయణరెడ్డి- కడప ఎంపీ అభ్యర్థి భూపేశ్రెడ్డి, వైకాపా అసెంబ్లీ అభ్యర్థి సుధీర్రెడ్డి తమ వర్గీయులతో జమ్మలమడుగు వచ్చేందుకు మంగళవారం ప్రయత్నించారు. -
150కి పైగా స్థానాల్లో కూటమిదే గెలుపు: రఘురామ
ప్రస్తుత ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి భారీ మెజారిటీలతో 150కి పైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని.. పోలింగ్కు జనం పెద్ద ఎత్తున తరలిరావడమే దీనికి నిదర్శనమని నరసాపురం ఎంపీ, తెదేపా ఉండి ఎమ్మెల్యే అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
35 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలి
రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో 35 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని తెదేపా ప్రధానకార్యదర్శి వర్ల రామయ్య కోరారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనాకు పార్టీ తరఫున వినతిపత్రాన్ని మంగళవారం అందించారు. -
రిగ్గింగ్ను అడ్డుకోవాలనే ఏజెంట్గా కూర్చున్నా
‘మా ఊళ్లో ప్రతి ఎన్నికల్లో రిగ్గింగ్ సర్వసాధారణంగా మారింది. దీన్ని అడ్డుకోవాలనే ఏజెంట్గా ఉండాలని నిర్ణయించుకున్నా’ అని సార్వత్రిక ఎన్నికల పోలింగ్ వేళ సోమవారం వైకాపా వర్గీయుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ పల్నాడు జిల్లా రెంటాలకు చెందిన చేరెడ్డి మంజుల తెలిపారు. -
తెదేపా కార్యకర్తపై దాడి
శ్రీకాకుళం జిల్లా పలాసలో వైకాపా అల్లరిమూకలు రెచ్చిపోయాయి. రాష్ట్ర మంత్రి సీదిరి అప్పలరాజు ప్రోద్బలంతో నియోజకవర్గంలో ఎక్కడికక్కడ తెదేపా కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. -
ఓటమికి భయపడే వైకాపా గూండాల దాడులు
ఓటమికి భయపడిన పిరికిపందలే చంద్రగిరి నియోజకవర్గ కూటమి అభ్యర్థి పులివర్తి నానిపై తిరుపతిలో దాడికి పాల్పడ్డారని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. -
రాష్ట్రంలో ఎన్డీయే క్లీన్ స్వీప్
‘‘ఆంధ్రప్రదేశ్లో ఎన్డీయే కూటమి క్లీన్ స్వీప్ చేయబోతోంది. ఎన్నికల ఫలితాలు కూటమికి అనుకూలంగా ఉంటాయని స్పష్టంగా తెలుస్తోంది’’ అని జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ పేర్కొన్నారు. -
పలమనేరు నియోజకవర్గంలో వైకాపా అరాచకం
చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం నెల్లిపట్ల పంచాయతీ బాపలనత్తంలో సోమవారం రాత్రి తెదేపా ఏజెంట్, క్లస్టర్ ఇన్ఛార్జి, కార్యకర్తపై వైకాపా వర్గీయులు రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. -
కొత్తగణేశునిపాడులో వైకాపా శ్రేణుల వీరంగం
పల్నాడు జిల్లా మాచవరం మండలం కొత్తగణేశునిపాడులో వైకాపా శ్రేణులు మంగళవారం వీరంగం సృష్టించాయి. తెదేపా కార్యకర్తల ఇళ్లపై రాళ్లదాడి చేశాయి.
తాజా వార్తలు
-
పిఠాపురంలో పవనోత్సాహం.. అత్యధికంగా పోలింగ్ నమోదు
-
మధ్యవర్తి వంచన.. వలస జీవులు కాలినడకన
-
నిశిరాత్రిలో ఘోరం.. అయిదుగురి సజీవదహనం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (15/05/24)
-
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
-
అమెరికాలో చైనా ‘సైన్యం’.. ట్రంప్ ప్రచారంపై రచ్చ!