వైకాపా ప్రకటనల్లో ప్రభుత్వ లోగో.. గుడ్డిగా అనుమతిచ్చిన ఎంసీఎంసీ
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ఓటర్లు ప్రభావితమయ్యేందుకు ఏ చిన్న అవకాశం ఇవ్వకూడదన్న ఉద్దేశంతో అన్ని జాగ్రత్తలూ తీసుకునే ఎన్నికల సంఘం.. వైకాపా రూపొందించిన ఎన్నికల ప్రచార వీడియో చిత్రాల్లో ప్రభుత్వ లోగో స్పష్టంగా కనిపిస్తున్నా గ్రీన్సిగ్నల్ ఇచ్చేసింది.
ఎన్నికల సంఘం తీరుపై విమర్శలు
ఈనాడు, అమరావతి: ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ఓటర్లు ప్రభావితమయ్యేందుకు ఏ చిన్న అవకాశం ఇవ్వకూడదన్న ఉద్దేశంతో అన్ని జాగ్రత్తలూ తీసుకునే ఎన్నికల సంఘం.. వైకాపా రూపొందించిన ఎన్నికల ప్రచార వీడియో చిత్రాల్లో ప్రభుత్వ లోగో స్పష్టంగా కనిపిస్తున్నా గ్రీన్సిగ్నల్ ఇచ్చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయంలోని మీడియా సర్టిఫికేషన్, పర్యవేక్షణ కమిటీ (ఎంసీఎంసీ)లు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెదేపా, జనసేన కార్యకర్తల్ని తమవైపు తిప్పుకోవడమే లక్ష్యంగా వైకాపా రూపొందించిన కొన్ని ఎన్నికల ప్రచార వీడియో చిత్రాలకు ఎంసీఎంసీ 1712/ఈఎల్ఈసీ,ఏ/ఏ2/2024-41 నంబరుతో అనుమతిచ్చింది. వాటిలో ఒక వీడియోలో జనసేన కార్యకర్త ఆ పార్టీ జెండా పట్టుకుని నిస్పృహగా ఇంటికి వస్తాడు. జెండాని గుమ్మం దగ్గర గోడ చేర్పుగా పెట్టి, ఇంట్లో కూర్చుని గాజు గ్లాసులో టీ తాగుతుంటాడు. ఇంతలో ఆ యువకుడి తల్లి ఒక సంచిలో ఇంట్లోకి సరకులు తెస్తూ ఉంటుంది. దానిపై ముఖ్యమంత్రి జగన్ బొమ్మతో పాటు ప్రభుత్వ లోగో ఉంటుంది. ఇంతలో ఒక వాలంటీరు వచ్చి ఆ ఇంట్లోని పెద్దావిడకు ఒక కవరు అందజేస్తాడు. దానిపై వైఎస్సార్ పింఛను కానుక అని రాసి ఉంటుంది. జగన్ ఫొటో, ప్రభుత్వ లోగో కూడా ఉంటాయి. అవన్నీ చూశాక ఆ యువకుడు చేతిలోని గాజు గ్లాస్ని కింద పడేస్తాడు. జనసేన జెండా కూడా కింద పడిపోతుంది. ఆ యువకుడి ముఖంలో ఒక్కసారిగా సంతోషం వెల్లివిరుస్తుంది. ప్రభుత్వ లోగోతో పంపిణీ చేసిన పథకాల్ని చూశాక ఆ జనసేన కార్యకర్త మనసు మారిపోయి వైకాపాలో చేరాడని చెప్పడం ఈ ప్రకటన ఉద్దేశం. తెదేపా కార్యకర్తల్ని ఉద్దేశించి కూడా అలాంటిదే మరో యాడ్ ఉంది. వాటిని ఐప్యాక్తో పాటు, వైకాపా సామాజిక మాధ్యమ విభాగాలు విస్తృతంగా ప్రచారంలో పెట్టాయి. యూట్యూబ్, ఫేస్బుక్ సహా వివిధ సామాజిక మాధ్యమాల్లోనూ ప్రచారంలో ఉన్నాయి. ప్రభుత్వ లోగో ఉన్న ఈ ప్రచార చిత్రాలకు ఆమోదం తెలిపిన ఎంసీఎంసీ కమిటీపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దళిత మహిళ పట్ల వైకాపా అభ్యర్థి దురుసు ప్రవర్తన
గుంటూరు వైకాపా ఎంపీ అభ్యర్థి కిలారు వెంకట రోశయ్య దళిత మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించారు. -
మాచర్లలో ఈవీఎంల ధ్వంసం.. తాడిపత్రిలో రాళ్ల దాడి
పోలింగ్ ప్రక్రియకుల వైకాపా కార్యకర్తలు అడుగడుగునా అడ్డుపడుతున్నారు. పల్నాడు జిల్లా మాచర్లలో ఈవీఎంలను ధ్వంసం చేశారు. దీంతో సిబ్బంది పోలింగ్ నిలిపివేసి.. భయంతో బయటకు వెళ్లిపోయారు. -
ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ స్పందించాలి: చంద్రబాబు
పల్నాడు జిల్లాతోపాటు రాష్ట్రంలో వివిధ చోట్ల చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. -
ఆగని వైకాపా దాడులు.. అరాచకం అంతానికి పోటెత్తిన ఓటర్లు
పోలింగ్ రోజున వైకాపా నేతల తీరుపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఓవైపు పోలింగ్ కొనసాగుతున్నా.. వారి ప్రలోభాల పర్వం మాత్రం ఆగడం లేదు. -
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. ఉదయం 11 గంటల వరకు పోలింగ్ శాతం ఇలా..
తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ సందడి కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు ఏపీలో 23.10 శాతం, తెలంగాణలో 24.31 శాతం పోలింగ్ నమోదైంది. -
క్యూలో రమ్మని చెప్పినందుకు.. ఓటరుపై వైకాపా అభ్యర్థి దాడి
వైకాపా నేతల అరాచకాలకు అంతేలేకుండా పోతోంది. ఓటేసేందుకు క్యూ లైన్లో రావాలని చెప్పినందుకు.. ఓ ఓటరుపై తెనాలి వైకాపా అభ్యర్థి శివకుమార్ చేయి చేసుకున్నారు. -
దాడులపై ఈసీ చర్యలు తీసుకోవాలి: వైఎస్ షర్మిల
కడప పార్లమెంటు పరిధిలో జరుగుతున్న దాడులపై ఈసీ చర్యలు తీసుకోవాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) డిమాండ్ చేశారు. -
భారీ కాన్వాయ్తో గోపిరెడ్డి హల్చల్.. ఎన్నికల నిబంధనల ఉల్లంఘన
నరసరావుపేటలో వైకాపా అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాస్రెడ్డి హల్చల్ చేశారు. భారీ కాన్వాయ్తో పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. -
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. ఉదయం 9 గంటల వరకు పోలింగ్ శాతం ఇలా..
తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ సందడి కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు ఏపీలో 9.05శాతం, తెలంగాణలో 9.51 శాతం పోలింగ్ నమోదైంది. -
అన్నమయ్య జిల్లా దలవాయిలో ఈవీఎంల ధ్వంసం.. నిలిచిన పోలింగ్
పోలింగ్ రోజున వైకాపా నేతల దౌర్జన్యాలు పెచ్చుమీరుతున్నాయి. కట్టుదిట్టమైన భద్రత ఉన్నా బలవంతంగా పోలింగ్ కేంద్రాల్లోకి చొరపడి అరాచకాలకు ఒడిగడుతున్నారు. -
ఏపీలో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న పోలింగ్
తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఏపీలోని మొత్తం 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాలకు, తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. -
వైకాపా నేతల అరాచకాలు.. పలుచోట్ల ఏజెంట్లపై దాడులు
AP Assembly Elections: తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. తెలంగాణలో ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. -
ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్లో పాల్గొనాలి: ప్రధాని మోదీ
AP Assembly Elections: ఏపీ అసెంబ్లీ సహా దేశవ్యాప్తంగా జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు పెద్ద ఎత్తున పాల్గొనాలని ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. -
రౌడీయిజం, గూండాయిజంతో రెచ్చిపోతే ఊరుకునేది లేదు: చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. సతీమణి భువనేశ్వరితో కలిసి ఉండవల్లిలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి... -
పీలేరులో తెదేపా ఏజెంట్ల కిడ్నాప్!
చిత్తూరు జిల్లా పీలేరులో ముగ్గురు ఏజెంట్లను కిడ్నాప్ చేశారంటూ తెదేపా ఈసీకి ఫిర్యాదు చేసింది. వారిని పోలింగ్ కేంద్రాల్లోకి చేరుకోలేని ప్రాంతంలో వదిలారని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లింది. -
పోలింగ్ కేంద్రంలో తెదేపా ఏజెంట్లపై దాడి
పల్నాడు జిల్లా రెంట చింతల మండలం రెంటాలలో ఇద్దరు తెదేపా ఏజెంట్లపై వైకాపా వర్గీయులు దాడి చేశారు. -
చంపేసి, శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?
‘తెదేపాకు ఏజెంట్గా కుర్చుంటావా.. చంపి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు’ అంటూ తెదేపా సానుభూతిపరుడిపై వైకాపా నేతలు దాడికి యత్నించారు. -
తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన సార్వత్రిక ఎన్నికల పోలింగ్
తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఓటు వేసేందుకు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. -
మాకిదే మొదటి ఓటు.. కొనలేదు ఏ నోటు
కూటికి పేదలైనా.. గుణంలో మేటి అనిపించుకున్నారు గుంటూరు కాకుమానువారితోట వాసులు. ‘మా ఓటు అమ్మబడదు’ అని వారి గుడిసెల వద్ద ఇలా ఫ్లెక్సీలు అంటించారు. -
పోలింగ్ కేంద్రాల్లో వైకాపా రంగులా?
తిరుపతిలోని పోలింగ్ కేంద్రాల్లో అధికార పార్టీ రంగులు పోలిన షామియానాలు వేయడంపై కూటమి నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
-
అదే మమ్మల్ని దెబ్బతీసింది.. లేదంటే బెంగళూరును 150కే కట్టడి చేసేవాళ్లం: అక్షర్
-
నీ ఓటు ఎటువైపు పోవాలో నీ చేతుల్లోనే ఉంది.. ఓటు విలువ చెప్పిన హీరోలు
-
గురుద్వారలో మోదీ సేవ.. భక్తులకు స్వయంగా వడ్డించిన ప్రధాని
-
పాత మిత్రుడు కనిపించగానే ధోనీ ఏం చేశాడంటే..!
-
పుతిన్ కీలక నిర్ణయం.. రక్షణ మంత్రిగా షోయిగు తొలగింపు