గన్నవరం.. మా కొద్దీ రౌడీరాజకీయం!
‘‘ఐదేళ్లలో ఏం జరిగింది సార్. ఎప్పుడూ ఏవో గొడవలు. కొద్దిపాటి వివాదాలను కూడా పెద్దవి చేస్తున్నారు.
భూ వివాదాలు, పంచాయితీలతో పెత్తనం
కొండలు, గుట్టల్లో అడ్డగోలుగా దోపిడీ
నిత్యం అల్లర్లతో విసిగిపోతున్న జనం
అమరావతిని పాడుబెట్టడంపై జనాగ్రహం
ప్రశాంత వాతావరణానికే ప్రజాశీస్సులు
ఈనాడు ప్రత్యేక ప్రతినిధి
‘‘ఐదేళ్లలో ఏం జరిగింది సార్. ఎప్పుడూ ఏవో గొడవలు. కొద్దిపాటి వివాదాలను కూడా పెద్దవి చేస్తున్నారు. రెండ్రోజుల క్రితం ఇక్కడి ప్రజాప్రతినిధి ‘వాణ్ని కొట్టి రండిరా తర్వాత చూసుకుందామని రెచ్చగొట్టారు. ఇంకెన్నాళ్లు ఈ రౌడీయిజం మధ్య బతకాలి? పక్క రాష్ట్రాలు అభివృద్ధితో పోటీ పడుతుంటే మనం పాతికేళ్లు వెనక్కిపోయామనిపిస్తోంది’’
బుద్దవరంలోని ఓ ప్రైవేటు ఉద్యోగి ఆందోళన
‘‘నా సంపాదనలో సగం అద్దెకే పోతోంది. సొంతిల్లు ఇస్తామంటే చాలా ఆనందించాం. మాకు కేసరపల్లి పొలాల్లో జగనన్న కాలనీలు మొదలుపెట్టారు. అక్కడ తాగునీరు లేదు. రహదారులు సరిగ్గాలేవు. పంట పొలాల మధ్య కాలువ గట్ల మీద అక్కడకు వెళ్లడం అంత తేలికకాదు. సొంతిల్లు కోసమని ఇంట్లో బంగారం అమ్మేశాను. అప్పులు చేశాను. దీని బదులు పట్టాభూమి ఇస్తే సరిపోయేది. ఇన్ని ఇబ్బందులు పడలేక ఆ ఇల్లు వద్దనుకున్నాం’’
గన్నవరంలోని ఒక కార్మికుడి ఆవేదన
‘‘అమరావతి రాజధాని ప్రకటనతో గన్నవరం కళకళలాడింది. భూముల ధరలు పెరిగాయి. కొత్త కంపెనీలు, పరిశ్రమలు వచ్చాయి. పెద్ద నగరంగా మారుతుందని ఎంతో ఆశపడ్డాం. ఇప్పుడున్న పరిస్థితి చూస్తే బాధగా ఉంది. ప్రతిపక్ష నేతగా జగన్ ఇక్కడే రాజధాని అని, తర్వాత మాట మార్చటం అన్యాయం. ఆయన మడమ తిప్పడని అనుకున్నాం. పారిశ్రామికవాడల ఏర్పాటుతో లక్షల ఉద్యోగాలు వచ్చేవి. వైకాపా ప్రభుత్వం వచ్చాక అవన్నీ మాయం చేసి మాకు బాగా బుద్ధి చెప్పారు’’
పురుషోత్తపట్నంలోని విశ్రాంత ఉద్యోగి అభిప్రాయం
‘‘విజయవాడ పరిసర ప్రాంతంలో కొత్త పరిశ్రమ ఏర్పాటు చేసి ఇక్కడ యువతకు ఉపాధి కల్పించాలని ఆశపడ్డా. గత ప్రభుత్వం మా సంకల్పంపై నమ్మకం ఉంచి ప్రోత్సహించి అనుమతులిచ్చింది. కంపెనీకి పునాది వేద్దామనుకునే లోపు ఎన్నికల కోడ్ వచ్చింది. ఆ తరువాత వచ్చిన వైకాపా ప్రభుత్వం మా ఆశయాన్ని రాజకీయాలతో ముడిపెట్టి అనుమతులు రద్దుచేసింది. సొంతూళ్లో మాకే ఇంతటి పరాభవం ఎదురైతే పొరుగు రాష్ట్రాల నుంచి పారిశ్రామికవేత్తలు ఇక్కడకు ఏ ధైర్యంతో రాగలరు?’’
విజయవాడకు చెందిన ఓ పారిశ్రామికవేత్త ప్రశ్న
కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో ఐదేళ్లుగా నిత్యం గొడవలు, ఆందోళనలు, దౌర్జన్యాలతో విసుగెత్తిన జనం ప్రశాంత వాతావరణాన్ని కోరుకుంటున్నారు. పరిశ్రమల రాకతో ఈ ప్రాంతం మళ్లీ కళకళలాడాలనుకుంటున్నారు. అక్రమాలు, భూ ఆక్రమణలతో చెలరేగే వారికి ఓటుతో బుద్ధి చెబుతామంటున్నారు. తాజా ఎన్నికల్లో తెదేపా తరఫున యార్లగడ్డ వెంకట్రావు, వైకాపా నుంచి వల్లభనేని వంశీ పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో తెదేపా నుంచి గెలిచిన వంశీ వైకాపాలో చేరారు. ఆ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిన యార్లగడ్డ వెంకట్రావు ఈసారి తెదేపా నుంచి బరిలో నిలిచారు. నియోజకవర్గంలో ఇద్దరికీ బలమైన సామాజికవర్గం, కేడర్ ఉండటంతో పోటీ రసవత్తరంగా మారింది. ‘ఈనాడు ప్రత్యేక ప్రతినిధి’ రెండ్రోజుల పాటు ఈ నియోజకవర్గంలోని బుద్దవరం, కేసరపల్లి, పురుషోత్తపట్నం, బావులపాడు, ఎనికేపాడు, గన్నవరం తదితర ప్రాంతాల్లోని వివిధ వర్గాల ప్రజలతో మాట్లాడినపుడు తాము ఎన్నుకోబోయే నాయకుడిపై వారిలో స్పష్టత కనిపించింది. అమరావతిని పాడుబెట్టడంపై ప్రతి ఐదుగురిలో నలుగురు ఆగ్రహం వ్యక్తంచేశారు. నేతల మాట తీరు, రౌడీయిజం పోకడలను పూర్తిగా వ్యతిరేకించారు.
నోటిదురుసుతో జనం దూరం..
‘రాజకీయ జీవితాన్ని ఇచ్చిన కుటుంబాన్ని తూలనాడడం, తండ్రి లాంటి చంద్రబాబుపై నోరు పారేసుకొని వంశీ జనానికి దూరమయ్యారని.. తన అనుచరులతో తెదేపా కార్యాలయానికి నిప్పంటించి ఇమేజ్ పోగొట్టుకున్నారని’ ఉంగుటూరు మండలానికి చెందిన మాజీ సర్పంచి ఒకరు వివరించారు. గతంలో ఎన్నడూ లేనంతగా గ్రామాల్లో కక్షలు పెరిగేందుకు ఆయనే కారణమని ఆందోళన వ్యక్తంచేశారు. 2019లో వైకాపా గాలిలోనూ తెదేపా శ్రేణుల అండదండలతో వంశీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కొంతకాలానికే వైకాపా కండువా కప్పుకున్న ఆయన తెదేపా అధినేత చంద్రబాబు, ఆయన కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేకెత్తించాయి. ఇన్నేళ్లు ఆయన్ను అభిమానించిన పార్టీ శ్రేణులతోపాటు సామాన్య ప్రజల్లోనూ మొదలైన వ్యతిరేకత క్రమంగా పెరుగుతూ వచ్చింది. నియోజకవర్గంలో ప్రశ్నించే వారిపై దాడి చేసేంతగా అనుచరులను రెచ్చగొట్టేవారని గన్నవరంలో ఆటో డ్రైవర్ ఒకరు తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో వ్యతిరేకంగా పోస్టు పెట్టాడని తన తమ్ముడిని బెదిరించారని ఆవేదన వెలిబుచ్చారు.
పల్లెల్లో ప్రైవేటు పెత్తనం
నాలుగేళ్ల కాలంలో కొండలు, గుట్టలు అడ్డంగా దోచుకున్నారు. మండల కేంద్రాలు, ప్రధాన గ్రామాల్లో నలుగురైదుగురు చొప్పున అనుచరులను ఏర్పాటు చేసి భూ వివాదాలు, ప్రైవేటు పంచాయితీలతో తమపై పెత్తనం చేయడాన్ని సామాన్యులు భరించలేకపోతున్నారు. వివాదాస్పద భూములను గుర్తించి పరిష్కరిస్తామంటూ అధికార పార్టీ నాయకులే దళారుల అవతారం ఎత్తి దోచుకుంటున్నారని బావులపాడుకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు వివరించారు. తమ మండలంలో ఒక రైతుకు చెందిన భూమి అడంగల్ మార్చి ఒక నాయకుడు రూ. 10 లక్షలు తీసుకున్నాడని ఆయన తెలిపారు. తెదేపా ప్రభుత్వంలో రవాణా ఖర్చులకు 1,800 వెచ్చిస్తే ట్రాక్టర్ ఇసుక దొరికేది. రూ. ప్రస్తుతం ట్రాక్టర్ ఇసుక ధర రూ. 5,000 ఉందని తెంపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు రైతులు తెలిపారు. రెండేళ్ల క్రితం గ్రామంలో కలుషిత నీటి వల్ల అతిసార లక్షణాలతో 8 మంది మరణించారు. దీంతో అధికారులు తాగునీటి కోసం రూ. 30 లక్షలకు పైగా వెచ్చించి పైపులు వేయించారు. అంత హడావుడి చేసిన యంత్రాంగం వాటి ద్వారా నీళ్లు ఇవ్వడమే లేదని గ్రామానికి చెందిన ఒక మహిళ వివరించారు. బావులపాడు, గన్నవరం, విజయవాడ రూరల్లోని పలు ప్రాంతాల్లో తాగునీటి సమస్య వెంటాడుతోంది.
పరిశ్రమలకు రాజకీయరంగు.. ఐటీ కంపెనీలకు షరతులు
వైకాపా అధికారం చేపట్టాక కొత్త సంస్థల ఏర్పాటు ఎలా ఉన్నా ముందుకొచ్చిన ఔత్సాహికులు పారిపోయేలా చేశారు. సొంతూరిపై మమకారంతో ఆసక్తి చూపిన పారిశ్రామికవేత్తలను భయపెట్టారంటూ గన్నవరంలో ఇంజినీరింగ్ ఆఖరి సంవత్సరం చదువుతున్న నలుగురు విద్యార్థులు ఆవేదన వెలిబుచ్చారు. 2014లో రాష్ట్రం ఏర్పాటు, అమరావతి రాజధాని ప్రకటనతో గన్నవరం విమానాశ్రయానికి తాకిడి పెరిగింది. విజయవాడకు సమీపంలో ఉండడంతో పరిశ్రమల ఏర్పాటుకు ఈ ప్రాంతం అనువైనదిగా గుర్తించారు. భారీగా రాయితీలు ఇస్తామని తెదేపా ప్రభుత్వం ప్రకటించడంతో పారిశ్రామికవేత్తలు ఉత్సాహపడ్డారు. సొంత ప్రాంతంలో స్థానికులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆరాటపడ్డారు. మేధా టవర్స్ 01, 02 ఏర్పాటుతో ఈ ప్రాంతం మరో గచ్చిబౌలిగా మారుతుందని భావించారు. ఈ టవర్స్లో స్థానం కోసం ఐటీ కంపెనీలు పోటీపడ్డాయి. వైకాపా అధికారంలోకి వచ్చాక టవర్ 02 నిర్మాణం అటకెక్కింది. షరతులు భరించలేక కొత్త కంపెనీలు ముఖం చాటేశాయి. అలాగే బావులపాడు మండలం మల్లపల్లిలో పారిశ్రామికవాడకు 1,360 ఎకరాలు కేటాయించారు. తక్కువ ధరకు భూములు అందించారు. దేశవిదేశాల నుంచి ఎంతోమంది ముందుకు రావడంతో పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దారు. అశోక్ లేల్యాండ్ యూనిట్ పూర్తిచేశారు. ఎలక్ట్రికల్ బస్సుల తయారు చేయాలనుకున్నారు. వైకాపా ప్రభుత్వం పారిశ్రామికవాడలకు రాజకీయరంగు పులిమింది. అక్కడ భూముల ధరలను అమాంతం పెంచేసి మౌలిక సౌకర్యాల కల్పనను నిర్లక్ష్యం చేసింది. ఆంక్షలు, హద్దులతో కొత్త యూనిట్లు రాకపోగా, కొన్ని యూనిట్ల లైసెన్స్లను రద్దు చేసింది. తెదేపా హయాంలో వీరపనినేనిగూడెం వద్ద పారిశ్రామికవాడ ఏర్పాటైంది. 78 ఎకరాల విస్తీర్ణంలో 40 మంది ఔత్సాహికులు పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చారు. బుల్లెట్ప్రూఫ్ వాహనాల తయారీ యూనిట్ సహా కొన్ని పరిశ్రమలు కార్యరూపం దాల్చాయి. వైకాపా పగ్గాలు చేపట్టగానే, కేటాయించిన స్థలాల్లో యూనిట్లు ఏర్పాటు చేయలేకపోయారంటూ లైసెన్స్లు రద్దు చేసింది. కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మరికొందరు వివాదాల్లో తలదూర్చలేక తప్పుకున్నారని ఆ ప్రాంతానికి చెందిన ఒక సర్పంచి తెలిపారు. ఐదేళ్ల క్రితం ఎకరా భూమి రూ.కోటి ధర పలికిందని ఈ ప్రభుత్వం వచ్చాక స్థలాల ధరలు తగ్గాయని వివరించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారానంటూ చెప్పిన వంశీ ఈ పారిశ్రామికవాడల సమస్యలు తీర్చుతారని భావించామని.. దౌర్జన్యాలు, మట్టి, ఇసుక దోపిడీతో చెలరేగుతారని ఊహించలేకపోయామని ఆవేదన వెలిబుచ్చారు. కొద్దిరోజుల క్రితమే ఇక్కడ రహదారుల నిర్మాణం చేపట్టడం గమనార్హం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘రిగ్గింగ్ను అడ్డుకోవాలనే ఏజెంట్గా కూర్చున్నా’
‘మా ఊళ్లో ప్రతి ఎన్నికల్లో రిగ్గింగ్ సర్వసాధారణంగా మారింది. దీన్ని అడ్డుకోవాలనే ఏజెంట్గా ఉండాలని నిర్ణయించుకున్నా’ అని సార్వత్రిక ఎన్నికల పోలింగ్ వేళ సోమవారం వైకాపా వర్గీయుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ పల్నాడు జిల్లా రెంటాలకు చెందిన చేరెడ్డి మంజుల తెలిపారు. -
పల్నాడు జిల్లాలో 144 సెక్షన్
పోలింగ్ సందర్భంగా పల్నాడు జిల్లాలో చెలరేగిన హింసాత్మక సంఘటనలు రెండోరోజూ కొనసాగడంతో ఈసీ 144 సెక్షన్ అమలుకు ఆదేశించింది. ఈ మేరకు జిల్లా పాలనాధికారి శివశంకర్ పోలీసు శాఖకు ఉత్తర్వులిచ్చారు. -
150కి పైగా స్థానాల్లో కూటమిదే గెలుపు: రఘురామ
ప్రస్తుత ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి భారీ మెజారిటీలతో 150కి పైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని.. పోలింగ్కు జనం పెద్ద ఎత్తున తరలిరావడమే దీనికి నిదర్శనమని నరసాపురం ఎంపీ, తెదేపా ఉండి ఎమ్మెల్యే అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
వైకాపా మూకల రక్తదాహం
పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా వైకాపా రాక్షస మూకల రక్తదాహం తీరలేదు. మంగళవారం రెండో రోజూ రాష్ట్రంలో అనేక చోట్ల తీవ్ర స్థాయిలో హింసాకాండకు, విధ్వంసానికి పాల్పడ్డారు. -
నాని లక్ష్యంగా.. సమ్మెటతో వైకాపా మూకల వీరంగం
తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళ విశ్వవిద్యాలయం ఆవరణలో వైకాపా నాయకులు మారణాయుధాలతో రెచ్చిపోయారు. ఇక్కడ ఈవీఎంలను భద్రపర్చిన స్ట్రాంగ్రూమ్లను పరిశీలించేందుకు మంగళవారం మధ్యాహ్నం 3.15 గంటల సమయంలో వచ్చిన చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం చేశారు. -
తాడిపత్రిలో పెద్దారెడ్డి అరాచకం
అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎన్నికల ముందు అన్నట్లుగానే విధ్వంసకాండను సృష్టించారు. మంగళవారం తాడిపత్రిని యుద్ధభూమిగా మార్చారు. -
ఎమ్మెల్యే పిన్నెల్లి విధ్వంసకాండ
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం కారంపూడిలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన అనుచరులతో విధ్వంసం సృష్టించారు. తన కారుపై ఎవరో రాయి వేశారనే నెపంతో తెదేపా కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. -
ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ 82.37%
ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో పోస్టల్ బ్యాలట్తో కలిపి 82.37% మేర పోలింగ్ నమోదైనట్లు ప్రాథమిక అంచనా. రాష్ట్ర చరిత్రలో ఇంత భారీ ఎత్తున ఓటింగ్ జరగడం ఇదే తొలిసారి. -
యుద్ధప్రాతిపదికన కాలువల పనులు చేయాలి
రాష్ట్రంలో ఎన్నికల హడావుడి ముగిసిన నేపథ్యంలో ప్రభుత్వం సాగునీటి కాలువల నిర్వహణ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మంగళవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. -
రాక్షస పాలనకు వ్యతిరేకంగా ఓటేసిన వారికి ధన్యవాదాలు
వైకాపా నాయకులు దాడులు చేసినా ప్రజలు భయపడకుండా ఓటేయడానికి ముందుకు వచ్చారని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య హర్షం వ్యక్తం చేశారు. -
ప్రజాస్వామ్యాన్ని గెలిపించిన ఓటర్లకు కృతజ్ఞతలు
ఎన్నికల మహా యజ్ఞంలో పాల్గొని ప్రజాస్వామ్యాన్ని గెలిపించిన ఓటర్లకు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల మంగళవారం ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. -
తెదేపా బూత్ ఏజెంట్ పంటకు నిప్పు
చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో తెదేపా బూత్ ఏజెంటుగా పనిచేసిన వ్యక్తి పొలానికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. -
ప్రధానికి చంద్రబాబు శుభాకాంక్షలు
ఉత్తరప్రదేశ్లోని వారణాసి లోక్సభ స్థానం నుంచి మూడోసారి పోటీ చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. -
ఓటర్ సుధాకర్పై దాడి ఘటన.. తెనాలి ఎమ్మెల్యే, మరో ఏడుగురిపై కేసు
పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే అయినా నిబంధనలు పాటించాల్సిందేనని చెప్పినందుకు ఓటరు గొట్టుముక్కల సుధాకర్ను తెనాలి వైకాపా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, ఆయన అనుచరులు విచక్షణారహితంగా కొట్టిన ఘటనలో ఎమ్మెల్యే, మరో ఏడుగురిపై 341, 323 రెడ్ విత్ ఐపీసీ 34 సెక్షన్ల కింద కేసు నమోదైంది. -
జగన్ను సాగనంపడానికే అర్ధరాత్రి వరకు ఓట్లేశారు: బుచ్చయ్య చౌదరి
అరాచక, ఆటవిక వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోట్లాది మంది ప్రజలు ఓట్లేసి తీర్పు ఇచ్చారని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. -
మంత్రి బుగ్గనపై ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు
రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గనపై నంద్యాల జిల్లా బేతంచెర్ల పోలీసుస్టేషన్లో ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు నమోదైంది. -
పిన్నెల్లి సోదరుల హౌస్ అరెస్ట్!
మాచర్ల నియోజకవర్గంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిని హౌస్ అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. -
మంత్రి జోగి రమేష్, ఆయన కుమారుడిపై కేసు
కృష్ణా జిల్లా పోరంకిలో పోలింగ్ బూత్ల వద్ద సోమవారం దాడి చేసి భీతావహ వాతావరణం సృష్టించిన ఘటనపై రాష్ట్ర మంత్రి, పెనమలూరు వైకాపా అభ్యర్థి జోగి రమేష్, ఆయన కుమారుడు రాజీవ్లతో పాటు పలువురు వైకాపా నేతలపై పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేశారు. -
జమ్మలమడుగులో ఉద్రిక్తత
వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో ఉద్రిక్తత నెలకొంది. ఎన్డీయే కూటమి అసెంబ్లీ అభ్యర్థి ఆదినారాయణరెడ్డి- కడప ఎంపీ అభ్యర్థి భూపేశ్రెడ్డి, వైకాపా అసెంబ్లీ అభ్యర్థి సుధీర్రెడ్డి తమ వర్గీయులతో జమ్మలమడుగు వచ్చేందుకు మంగళవారం ప్రయత్నించారు. -
35 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలి
రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో 35 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని తెదేపా ప్రధానకార్యదర్శి వర్ల రామయ్య కోరారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనాకు పార్టీ తరఫున వినతిపత్రాన్ని మంగళవారం అందించారు. -
తెదేపా కార్యకర్తపై దాడి
శ్రీకాకుళం జిల్లా పలాసలో వైకాపా అల్లరిమూకలు రెచ్చిపోయాయి. రాష్ట్ర మంత్రి సీదిరి అప్పలరాజు ప్రోద్బలంతో నియోజకవర్గంలో ఎక్కడికక్కడ తెదేపా కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు.
తాజా వార్తలు
-
ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పు.. వైకాపా నేతల దుశ్చర్య
-
యశోదాలో ఉద్యోగుల వేతనాల పేరిట రూ.3.26 కోట్లు స్వాహా
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,250 ఎగువన నిఫ్టీ
-
నార్కోటిక్ అంటాడు.. నమ్మితే ముంచేస్తాడు
-
కోర్టులో ఎన్నికల ఫలితాలు తేల్చుకునేవారు..మాకు హితబోధలా: వెస్టర్న్ మీడియాపై జైశంకర్ ఫైర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM