రూ.10 కోట్ల విలువైన కుక్కర్ కూపన్ల పట్టివేత
ఎన్నికల నోటిఫికేషన్కు ముందే వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులకు తాయిలాలు ఎరవేసిన వైకాపా.. ప్రస్తుతం ఓటర్లకు నేరుగా బహుమతులు పంచేందుకు సిద్ధమైంది.
సీ విజిల్ యాప్లో ఫిర్యాదుతో వెలుగులోకి
విజయవాడ నేరవార్తలు, న్యూస్టుడే: ఎన్నికల నోటిఫికేషన్కు ముందే వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులకు తాయిలాలు ఎరవేసిన వైకాపా.. ప్రస్తుతం ఓటర్లకు నేరుగా బహుమతులు పంచేందుకు సిద్ధమైంది. కుక్కర్ల పంపిణీకి పార్టీ గుర్తుతో కూపన్లు ముద్రిస్తూ, సీ విజిల్ యాప్నకు అందిన ఫిర్యాదుతో దొరికిపోయింది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అజిత్సింగ్నగర్లోని లక్కీ క్వాలిటీ ప్రింటర్స్లో పెద్దమొత్తంలో కుక్కర్లు ప్యాకింగ్ చేసి ఉన్నాయని ఆదివారం మధ్యాహ్నం సీ విజిల్ యాప్లో ఫిర్యాదు వచ్చింది. ఫ్లైయింగ్ స్క్వాడ్-9 అధికారి డి.రవిచంద్ర సూర్యకుమార్ సిబ్బందితో వెళ్లి తనిఖీలు చేపట్టారు. ఎక్కడా వస్తువులు కనిపించలేదు. కానీ ప్రెషర్ కుక్కర్, ఫ్యాన్ గుర్తున్న షీట్లు 5,250 దొరికాయి. ఒక్కో షీట్లో 24 కూపన్లున్నాయి. దీనిపై రవిచంద్ర పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేశారు.
కూపన్లు ఇక్కడ.. కుక్కర్లు ఎక్కడ?
పోలీసులు తనిఖీ చేయగా మొత్తం 1,26,000 కూపన్లు దొరికాయి. కుక్కర్లు దొరక్కపోవడంతో వాటిని రహస్య ప్రదేశంలో దాచారా? లేక దుకాణాల గోదాముల్లో నిల్వ చేశారా అన్న కోణాల్లో పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఓటర్లు ఈ కూపన్లను పట్టుకెళ్లి కుక్కర్లు తెచ్చుకునేలా ప్రణాళిక వేసినట్లు తెలుస్తోంది. ఇటీవల వాలంటీర్లకు వైకాపా నాయకులు ఒక్కోటి రూ.800 విలువ చేసే కుక్కర్లు పంచారు. తాజా కూపన్లలోనూ అలాంటి చిత్రాలే ముద్రించారు. ఈ లెక్కన 1.26 లక్షల కుక్కర్ల వ్యయం రూ.10 కోట్లపైనే ఉంటుంది. అంతమొత్తంలో వస్తువులను దుకాణాల్లో ఉంచడం అసాధ్యమని, అవి ఎక్కడ దాచారో తేల్చాల్సి ఉందని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల అధికారిణితో చెవిరెడ్డి దురుసు ప్రవర్తన
ఒంగోలు వైకాపా ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఎన్నికల అధికారిణితో దురుసుగా ప్రవర్తించారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం వీరభద్రాపురంలో సాయంత్రం 6 గంటల తర్వాత ఓటర్లు వరుసల్లో ఉన్నారు. -
ఓటేస్తూ సెల్ఫోన్తో ఫొటోలు.. ఎన్నికల సంఘం ఆదేశాలు బేఖాతర్
పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ఫోన్లు తీసుకెళ్లడం, ఓటింగ్ ప్రక్రియను ఫొటోలు తీయడం నిబంధనలకు విరుద్ధమని ఎన్నికల సంఘం పలుమార్లు స్పష్టం చేసింది. -
విశాఖలో టోకెన్లు తీసుకొని నగదు పంపిణీ
ఓ వైపు పోలింగ్ జరుగుతుండగా.. మరో వైపు వైకాపా నాయకులు టోకెన్లు ఉన్న వారికి డబ్బులు ఇచ్చేందుకు చేసిన ప్రయత్నం విశాఖలో రసాభాసగా మారింది. -
కొత్త ఈవీఎంలతో ఓటింగ్లో కొంత జాప్యం
ఈ ఎన్నికల్లో కొత్త ఈవీఎంలు వినియోగించడంతో ఓటింగ్ ప్రక్రియ కొంత జాప్యమైంది. ఓటు వేసిన తర్వాత ఎర్ర రంగు బల్బు వెలగడం, బీప్ శబ్దం రావడానికీ కొంత ఆలస్యమైంది. -
ఏం చేశారని ఓటేయాలి?
ఏళ్లు గడుస్తున్నా తమ డిమాండ్లను ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదంటూ రాష్ట్రంలో పలుచోట్ల ఓటర్లు పోలింగ్ను బహిష్కరించారు. అధికారులు జోక్యం చేసుకుని సర్దిచెప్పడంతో ఆందోళనలను విరమించి ఓటు హక్కు వినియోగిచుకున్నారు. -
నేనొస్తా.. మీ సంగతి తేలుస్తా..!
‘రేయ్.. నీలాంటోళ్ల సంగతి చూస్తా. నేనొస్తా.. మీ అందరి సంగతి తేలుస్తా’ అంటూ కాకినాడ నగర వైకాపా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి ప్రతిపక్ష నాయకులను హెచ్చరించారు. -
మీ ఓటు మేమే వేస్తాం
పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలో అత్యంత సమస్యాత్మక గ్రామమైన ఉప్పలపాడులో ఓటింగ్ ప్రక్రియ అపహాస్యమైంది. ఇరుపార్టీల నాయకులు ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పి ఓటర్లను ఇళ్లకే పరిమితం చేయడం చర్చనీయాంశమైంది. -
గన్నవరంలో వంశీ అనుచరుల వీరంగం
కృష్ణా జిల్లా గన్నవరంలో వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్ అనుచరులు రెచ్చిపోయారు. విజయవాడ రూరల్ మండలం నున్న, గన్నవరం మండలం సూరంపల్లి, ఉంగుటూరు మండలం తేలప్రోలులో ఉద్దేశపూర్వకంగా తెదేపా అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుపై దాడికి యత్నించారు. -
అదనుకు జారుకున్న వైకాపా నేతలు
జనసేనాని పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంపై వైకాపా మొదటి నుంచీ ప్రత్యేక దృష్టిపెట్టింది. ఊరికో నాయకుడికి బాధ్యత అప్పగించింది. -
పల్నాడులో వైకాపా అరాచకం
పల్నాడు జిల్లాలో వైకాపా శ్రేణులు రెచ్చిపోయాయి. తెదేపా కార్యకర్తలపై రాళ్లు, కర్రలతో దాడి చేయడంతో ఆగకుండా పెట్రోల్ బాంబులు విసిరి, ఆస్తులు తగలబెట్టాయి. -
చీకట్లను చీల్చుకుంటూ.. చైతన్యం చాటుకుంటూ..
రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాల్లో సోమవారం రాత్రి 10 గంటలు దాటినా పోలింగ్ కొనసాగింది. మధ్యాహ్నం మండే ఎండలోనూ వరుసలో నిలబడి తమ వంతు రాకపోవడంతో.. -
ఓటెత్తిన ‘ప్రజా’స్వామ్యం
రాష్ట్ర ప్రజలు ఓటెత్తారు. ప్రజాస్వామ్య స్ఫూర్తి చాటిచెప్పారు. గంటలకొద్దీ క్యూలైన్లలో నిలబడి మరీ వజ్రాయుధం లాంటి ఓటుహక్కును వినియోగించుకున్నారు. వృద్ధులు, మహిళలు, యువత.. ఇలా అన్ని వర్గాలవారు చాలా ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొన్నారు. -
ఎన్నికల వేళ వైకాపా విధ్వంసకాండ
ఏజెంట్లను భయపెట్టారు.. కూర్చుంటే తలకాయలే ఉండవని హూంకరించారు.. సాయంత్రం తిరిగి ఇళ్లకూ వెళ్లరని హెచ్చరించారు.. రేపటి నుంచి ఊళ్లలో తిరగలేరని బెదిరించారు. పోలీసులు ఉన్నా బెదరకుండా కిరాతకంగా వ్యవహరించారు. -
ప్రజా చైతన్యంపై పిడిగుద్దులు
ఎమ్మెల్యే అయినా, ఇంకెవరైనా కూడా పోలింగ్ కేంద్రంలో తప్పనిసరిగా నిబంధనలు పాటించాల్సిందే. అంతే తప్ప, ఇష్టారాజ్యంగా లోపలకు వెళ్తామంటే కుదరదు. అలా పౌరస్పృహతో.. నిబంధనలు పాటించాలని తెనాలి వైకాపా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ను అడగడమే ఆ ఓటరు తప్పయిపోయింది. -
మాచర్లలో రక్తం పారాల్సిందే..!
ఆటవిక పాలనను మించిన అరాచకాలకు మాచర్ల నియోజకవర్గ ప్రజలు చరమగీతం పాడేందుకు సిద్ధమైన వేళ.. అరాచకశక్తులు మరింతగా పేట్రేగిపోయాయి. ఐదేళ్లుగా నమ్ముకున్న దాడులు, బెదిరింపులు, హెచ్చరికలు, హింసనే ఎన్నికల రోజున ఆఖరి అస్త్రంగా ప్రయోగించారు. -
ఎక్కడా రీపోలింగ్ అవసరం లేదు
రాష్ట్రంలో చెదురుమదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. ఎక్కడా రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం ఉండబోదన్నారు. -
దళితులపై వైకాపా ఎంపీ అభ్యర్థి రోశయ్య దౌర్జన్యం
సొంత పార్టీకి చెందిన దళిత మహిళలపై గుంటూరు వైకాపా ఎంపీ అభ్యర్థి, పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకటరోశయ్య దౌర్జన్యానికి దిగారు. స్థానికుల కథనం ప్రకారం.. -
దర్శిలో రెచ్చిపోయిన వైకాపా మూకలు
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ వేళ వైకాపా నాయకుల అరాచకాలు శృతి మించాయి. ఓటమి భయంతో తెదేపా శ్రేణులపై దాడులకు తెగబడ్డారు. ప్రకాశం జిల్లా దర్శి మండలం బొట్లపాలెంలో ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి వచ్చిన తెదేపా కార్యకర్తపై దాడి చేశారు. -
రుద్రవరంలో పరస్పర రాళ్ల దాడులు
నంద్యాల జిల్లా రుద్రవరంలో తెదేపా, వైకాపా కార్యకర్తల మధ్య చెలరేగిన ఘర్షణ ఉద్రిక్తతలకు దారి తీసింది. గొడవ జరుగుతోందన్న విషయం తెలుసుకున్న వైకాపా ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రరెడ్డి, తెదేపా నాయకుడు భూమా విఖ్యాత్రెడ్డిలు తమ కార్యకర్తలతో రుద్రవరం చేరుకున్నారు. -
తెదేపా వర్గీయులపై వైకాపా దాడి
ప్రకాశం జిల్లా పొదిలి మండలం నందిపాలెం గ్రామం పోలింగ్ బూత్ వద్ద తెదేపా కార్యకర్తలపై వైకాపా నాయకులు దాడిచేశారు. ఓటు వేసేందుకు లైనులో ఉన్న తెదేపా కార్యకర్తలకు వైకాపా నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. -
వైకాపా నాయకుల గూండాగిరి
విజయనగరంలోని చెవిటి-మూగ పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద వైకాపా నాయకులు రెచ్చిపోయారు. ఇక్కడి వైకాపా ఏజెంట్లు సెల్ఫోన్లతో తిరుగుతుండటాన్ని అడ్డుకోవడంతో వైకాపా నాయకులు వారిపై దాడులకు దిగారు.
తాజా వార్తలు
-
ముందుగానే ‘నైరుతి’ జల్లు
-
వేధించారు.. ఓటూ తీసేశారు!.. ఏబీ వెంకటేశ్వరరావుపై వైకాపా ప్రభుత్వ కసి
-
వర్షం వచ్చింది.. కథ ముగిసింది: ప్లేఆఫ్స్ రేసు నుంచి గుజరాత్ ఔట్
-
జూన్ 4న స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తాయ్: అమిత్షా
-
ఓట్ల పండుగకు 42 బస్సుల్లో వచ్చిన యువత
-
ఐరాస వాహనంపై దాడి.. గాజాలో భారతీయుడి మృతి