Telangana Election Result: ఈసారి అత్యధికంగా అతివలు
రాష్ట్ర అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేల సంఖ్య పెరగనుంది. తొలిసారి రెండంకెల సంఖ్యలో మహిళలు అసెంబ్లీ ఎన్నికల్లో విజయకేతనం ఎగరవేశారు. రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి 34 మంది మహిళలు బరిలో నిలిచారు.
10 మంది విజేతలు
తొలిసారి ఎన్నికైన వారు నలుగురు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేల సంఖ్య పెరగనుంది. తొలిసారి రెండంకెల సంఖ్యలో మహిళలు అసెంబ్లీ ఎన్నికల్లో విజయకేతనం(telangana election results) ఎగరవేశారు. రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి 34 మంది మహిళలు బరిలో నిలిచారు. అత్యధికంగా భాజపా 13 మంది అతివలకు టికెట్లు ఇచ్చింది. కాంగ్రెస్ 12 మందికి, భారాస 8 మందికి, జనసేన ఒకరికి టికెట్లు ఇచ్చాయి. అన్ని పార్టీలు, స్వతంత్రులు కలిపి మొత్తంగా 221 మంది మహిళలు ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. వీరందరిలో 10 మంది గెలుపొందారు. 2014 నుంచి చూస్తే.. 10 మంది నారీమణులు అసెంబ్లీ గడప తొక్కనుండడం ఇదే మొదటిసారి. తాజాగా విజయం సాధించిన మహిళల్లో కాంగ్రెస్ నుంచి ఆరుగురు, భారాస అభ్యర్థులు నలుగురు ఉన్నారు. గెలిచిన 10 మందిలో నలుగురు తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినవారే. వీరిలో ముగ్గురు కాంగ్రెస్ నుంచి, మరొకరు భారాస నుంచి విజయం సాధించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-1.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-6.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-7.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-4.png)
తాజా వార్తలు
-
గోదావరిలో నీరుంది.. కానీ ప్రభుత్వానికి ఇచ్చే మనసు లేదు: కేటీఆర్
-
ఐటీఆర్ దాఖలు గడువు పొడిగింపు లేనట్లేనా?
-
మదనపల్లెలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన సిసోదియా
-
కేరళ, బెంగాల్ గవర్నర్ కార్యాలయాలకు సుప్రీం నోటీసులు
-
జాస్పర్ నగరం సగం భస్మీపటలం..!
-
నిరుద్యోగులూ నిరసనలు వద్దు.. మీ అన్నగా అండగా ఉంటా: సీఎం రేవంత్రెడ్డి