Komatireddy: రేవంత్కు శుభాకాంక్షలు తెలిపిన కోమటిరెడ్డి
రేవంత్రెడ్డి నేతృత్వంలో తెలంగాణలో ప్రజాస్వామిక, ప్రజానుకూల ప్రభుత్వ పాలన రాబోతోందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి కూడా..
ఈనాడు, హైదరాబాద్: రేవంత్రెడ్డి నేతృత్వంలో తెలంగాణలో ప్రజాస్వామిక, ప్రజానుకూల ప్రభుత్వ పాలన రాబోతోందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న సోదరుడు రేవంత్రెడ్డికి శుభాకాంక్షలని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామిక విధానాలే అమలవుతాయని తెలిపారు. ఉమ్మడి కార్యాచరణ, ఉమ్మడి నిర్ణయాలే పార్టీకి బలమని, ఇవే సిద్ధాంతాలతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని ఎన్నుకుని, అధిష్ఠానానికి తీర్మానం పంపారని ఆయన తెలిపారు. మరోవైపు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి తన ‘ఎక్స్’ ఖాతా వేదికగా.. కాబోయే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.
రేవంత్ను అభినందించిన సీపీఐ నేతలు
సీపీఐ నేతలు నారాయణ, కూనంనేని సాంబశివరావు, చాడ వెంకట్రెడ్డి, పల్లా వెంకట్రెడ్డి, ఈటీ నారాయణ, కలవేణి శంకర్, తక్కెళ్లపల్లి శ్రీనివాసరావులు మంగళవారం ఎల్లా హోటల్కు వెళ్లి రేవంత్రెడ్డిని కలిసి అభినందించారు. రాష్ట్ర అభివృద్ధికి కలిసి పనిచేయాలని నిర్ణయించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు
-
ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్.. వర్షంతో రద్దైతే పరిస్థితేంటి? విజేత ఎవరు?
-
అనంతపురంలో ఎన్ఐఏ అదుపులో సాఫ్ట్వేర్ ఇంజినీర్
-
పిన్నెల్లి ఏ తప్పూ చేయకపోతే ఎందుకు పారిపోయారు?: జూలకంటి బ్రహ్మారెడ్డి
-
లేజర్ బీమ్.. ఖమేనీ కుమారుడి హస్తం: రైసీ మరణంపై ప్రచారంలోకి కుట్రకోణాలు
-
‘కనీసం ఓటు వేయాలని అనిపించలేదా’.. తమ ఎంపీకి భాజపా షోకాజ్ నోటీసులు
-
‘ఫ్యామిలీస్టార్’కు నెగెటివ్ టాక్ ఇలా క్రియేట్ చేశారు: ఆనంద్ దేవరకొండ