సింధియాలదే ‘గుణ’
సార్వత్రిక ఎన్నికల సమరంలో గ్వాలియర్ రాజ కుటుంబానికి కంచుకోటగా ఉన్న గుణ (మధ్యప్రదేశ్) లోక్సభ స్థానంలో పోటీ ఉత్కంఠ రేపుతోంది.
పార్టీ, గుర్తు మారినా రాజ కుటుంబానిదే గెలుపు
2019లో మాత్రం జ్యోతిరాదిత్య ఓటమి
ఈసారి గెలిచి సత్తా చాటాలని ప్రయత్నం
భోపాల్: సార్వత్రిక ఎన్నికల సమరంలో గ్వాలియర్ రాజ కుటుంబానికి కంచుకోటగా ఉన్న గుణ (మధ్యప్రదేశ్) లోక్సభ స్థానంలో పోటీ ఉత్కంఠ రేపుతోంది. గుణ నుంచి భాజపా తరఫున పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా బరిలో నిలిచారు. 2019లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి అనూహ్యంగా ఓటమిపాలైన ఆయన ఈ ఎన్నికల్లో సత్తా చాటాలనే పట్టుదలతో ఉన్నారు. 2019లో భాజపా అభ్యర్థి, ఒకప్పటి తన వ్యక్తిగత కార్యదర్శి కృష్ణపాల్ సింగ్ యాదవ్ చేతిలో ఓడిపోవడంవల్ల జ్యోతిరాదిత్య ఆత్మస్థైర్యం దెబ్బతిన్నదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అందుకే ఈ ఎన్నికల్లో గెలిచి గుణలో సింధియా రాజ కుటుంబం పట్టును చాటిచెప్పాలని జ్యోతిరాదిత్య పట్టుదలగా ఉన్నారు.
మూడో తరం నేత
53 ఏళ్ల జ్యోతిరాదిత్య భాజపా వ్యవస్థాపకుల్లో ఒకరైన రాజమాత విజయరాజే సింధియా మనవడు. కేంద్ర మాజీ మంత్రి మాధవరావ్ సింధియా కుమారుడు. గుణ లోక్సభ పరిధిలో మొత్తం 8 అసెంబ్లీ నియోజకవర్గాలుంటాయి. గుణలో 18.8లక్షల మంది ఓటర్లున్నారు. ఇక్కడ మూడో విడతలో మే 7న పోలింగ్ జరగనుంది.
2019దాకా వాళ్లదే ఆధిపత్యం
సింధియా కుటుంబం స్వాతంత్య్రానికి పూర్వం గ్వాలియర్ రాజ్యాన్ని పరిపాలించింది. స్వాతంత్య్రం వచ్చాక 1957లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి విజయరాజే సింధియా గెలిచారు. 1967లో ఆమె స్వతంత్ర పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. 1989లో భాజపా తరఫున గెలిచారు. జ్యోతిరాదిత్య తండ్రి మాధవరావ్ సింధియా 1971లో తొలిసారిగా భారతీయ జనసంఘ్ తరఫున పోటీ చేసి గెలిచారు. 1999లో చివరిసారిగా విజయం సాధించారు. 2001లో జరిగిన విమాన ప్రమాదంలో ఆయన మరణించారు. గుణ పార్లమెంటు స్థానం నుంచి విజయరాజే సింధియా 6సార్లు గెలుపొందారు. మాధవరావ్ సింధియా 4 సార్లు విజయం సాధించారు. గుణలోనే కాకుండా గ్వాలియర్లోనూ ఒకసారి విజయరాజే సింధియా గెలుపొందారు. మాధవరావ్ సింధియా 5సార్లు గ్వాలియర్ నుంచి గెలిచారు. ఆయన కాంగ్రెస్తోపాటు మధ్యప్రదేశ్ వికాస్ కాంగ్రెస్ స్థాపించి ఆ పార్టీ తరఫునా విజయం సాధించారు. రాజమాత కుమార్తె, జ్యోతిరాదిత్య మేనత్త యశోధర రాజే గ్వాలియర్ నుంచి రెండు సార్లు గెలిచారు. జ్యోతిరాదిత్య గుణ సీటు నుంచి 2002, 2014 మధ్య నాలుగు సార్లు గెలుపొందారు. 2019లో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2020లో భాజపాలో చేరారు.
రెండుసార్లే ఓటమి
సింధియా కుటుంబంలోని వారు ఇప్పటిదాకా రెండు సార్లే ఓటమి చవిచూశారు. 1984లో వసుంధర రాజే భింద్ లోక్సభ సీటులో ఓడిపోయారు. ఆమె భాజపా తరఫున పోటీ చేశారు. 2019లో కాంగ్రెస్ తరఫున గుణ నుంచి పోటీ చేసిన జ్యోతిరాదిత్య ఓటమి రెండోది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కమల వికాసమా.. ద్రవిడ దరహాసమా!
దక్షిణాదిన పాగా వేసేందుకు చురుగ్గా పావులు కదుపుతున్న భాజపా....తమిళనాడులో సంచలన విజయాల నమోదుకు తహతహలాడుతోంది. -
చక్కెర నాడు తీపి.. కుమారకా? చంద్రుడికా..?
Mandya: కర్ణాటకలోని మండ్య పోరు ఈసారి ఆసక్తికరంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఇక్కడ బరిలోకి దిగగా.. ఆయనపై కాంగ్రెస్ నుంచి వెంకటరమణ గౌడ పోటీ చేస్తున్నారు. -
ఈసారైనా అమృతం దక్కేనా?
గత రెండు పర్యాయాలుగా దేశవ్యాప్తంగా మోదీ గాలి వీస్తున్నా.. అక్కడ హస్తానిదే పైచేయి. భాజపా నుంచి హేమాహేమీలు బరిలోకి దిగుతున్నా విజయం కాంగ్రెస్దే. -
తలో పార్టీలో తండ్రీతనయులు.. ఎన్నికల్లో విచిత్ర పరిస్థితి
ఒడిశాలో తండ్రీతనయులు వేర్వేరు పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న విచిత్ర పరిస్థితి నెలకొంది. వారు ఒక పార్టీలో ఉంటే.. కుమారులు ప్రత్యర్థి పార్టీల నుంచి బరిలోకి దిగారు. -
దిగువ సభకు పెద్దల పోటీ!
ప్రస్తుతం రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న, ఇటీవలి వరకూ ఆ సభ సభ్యులుగా ఉన్న 10 మంది కేంద్రమంత్రులు ఈసారి లోక్సభ ఎన్నికల బరిలో నిలిచారు. -
నటుల రాజకీయ రణస్థలం.. లోక్సభ ఎన్నికల్లో 20 మందికి పైగా పోటీ
లోక్సభ ఎన్నికల బరిలో సినీ, టీవీ నేపథ్యమున్న నటులు 20 మందికి పైగా వివిధ పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు. ఇందులో ఎక్కువ మంది భాజపా తరఫున రంగంలోకి దిగారు. -
కేరళలో ఇం‘ఢీ’యా
దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్కు బలమున్న స్థానాల్లో కేరళ ఒకటి. ఈ రాష్ట్రంలో లెఫ్ట్, కాంగ్రెస్ల మధ్యే ఎప్పుడూ ప్రధాన పోటీ ఉంటుంది. -
అప్పుడు తాతలు.. ఇప్పుడు మనవళ్లు : దేవెగౌడ కోట ఎవరికో..?
Hassan Poll: ఈ సార్వత్రిక ఎన్నికల్లో మాజీ ప్రధాని దేవెగౌడ కంచుకోట హసన్లో పోరు ఆసక్తికరంగా మారింది. గతంలో ఇదే స్థానం నుంచి పోటీ చేసిన ఇద్దరు ప్రముఖ నేతల మనవళ్లు తాజాగా బరిలో ఉన్నారు. -
డీఎంకేకు గట్టి పోటీ
తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకేకు ఈ లోక్సభ ఎన్నికల్లో కొన్నిచోట్ల గట్టి పోటీయే ఎదురవుతోంది. గెలుపు కోసం ఆ పార్టీ తీవ్రంగా పోరాడాల్సిన పరిస్థితి నెలకొంది. -
ఎడారి రాష్ట్రం ఎవరిపరం?
రాజకోటలకు, ఎడారి ప్రాంతానికి ప్రసిద్ధి చెందిన రాజస్థాన్ ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఎవరికి కోట కట్టనుందనేది ఆసక్తికరంగా మారింది. -
ఈశాన్యంలో ‘హిందుత్వ’పై మౌనం
లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 400కుపైగా సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న భాజపా ఆయా ప్రాంతాలను బట్టి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
పశ్చిమ యూపీలో మొగ్గెవరికి?
తొలి విడత పోలింగ్ జరగనున్న పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్లోని రాంపుర్, మొరాదాబాద్, సంభల్తోపాటు మిగిలిన నియోజకవర్గాలపై ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమైంది. -
రాచరికమే అర్హత!
రాజ్యమున్నవారే రాజులు.. అట్టివారే కురు రాజ పరిషత్తులో పాల్గొనుటకు అర్హులు అని భీష్ముడంటే... ఓహో ‘రాచరికమా అర్హతను నిర్ణయించునది’ అని సుయోధనుడు వేసిన ప్రశ్న దానవీరశూర కర్ణ చిత్రం చూసిన వారందరికీ గుర్తుంటుంది.
తాజా వార్తలు
-
టీమ్ఇండియా కొత్త కోచ్ రేసులో స్టీఫెన్ ఫ్లెమింగ్.. సీఎస్కే స్పందనిదే
-
టెలికాం టారిఫ్లు మన దగ్గరే తక్కువ: ఎయిర్టెల్ సీఈఓ
-
స్లొవేకియా ప్రధానిపై కాల్పులు..
-
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఊర్వశి హొయలు.. సక్సెస్ జోష్లో అదితి
-
తెలంగాణలో వర్సిటీల ఉపకులపతుల నియామకానికి ఈసీ అనుమతి
-
మ్యూచువల్ ఫండ్ మదుపర్లకు గుడ్న్యూస్.. కేవైసీ నిబంధనల్లో సడలింపు