తలో పార్టీలో తండ్రీతనయులు.. ఎన్నికల్లో విచిత్ర పరిస్థితి
ఒడిశాలో తండ్రీతనయులు వేర్వేరు పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న విచిత్ర పరిస్థితి నెలకొంది. వారు ఒక పార్టీలో ఉంటే.. కుమారులు ప్రత్యర్థి పార్టీల నుంచి బరిలోకి దిగారు.
ఒక చోట కాంగ్రెస్ నేత ఇద్దరు కుమారుల ఢీ
భువనేశ్వర్: ఒడిశాలో తండ్రీతనయులు వేర్వేరు పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న విచిత్ర పరిస్థితి నెలకొంది. వారు ఒక పార్టీలో ఉంటే.. కుమారులు ప్రత్యర్థి పార్టీల నుంచి బరిలోకి దిగారు. కాంగ్రెస్ నేతలైన సురేశ్ రౌత్రాయ్, చింతామణి ధ్యాన సామంత్రాయ్ తనయులు, భాజపా నేత బిజయ్ మహాపాత్ర్ కుమారుడు ఇలా ప్రత్యర్థి పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు
సురేశ్ రౌత్రాయ్
సీనియర్ కాంగ్రెస్ నేత, జాటణీ ఎమ్మెల్యే సురేశ్ రౌత్రాయ్కు కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసు ఇచ్చింది. ఆయన తన కుమారుడు, భువనేశ్వర్ లోక్సభ స్థానం నుంచి బిజూ జనతాదళ్ (బిజద) తరఫున పోటీ చేస్తున్న మన్మథ రౌత్రాయ్ పక్షాన ప్రచారం చేస్తుండటమే దీనికి కారణం. 80ఏళ్ల సురేశ్ కాంగ్రెస్ తరఫున 6సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. అనంతరం కుమారుడి తరఫున ప్రచారం చేస్తున్నారు. ‘అవును.. నా కుమారుడికి ఓటేయాలని నేను ప్రచారం చేస్తున్నా. ప్రజలు ఏం చేయాలని అడుగుతుంటే నేను అలా చెప్పక తప్పడం లేదు. నాపై ఏఐసీసీ, పీసీసీ ఏం చర్యలు తీసుకున్నా అంగీకరిస్తా. నేను చనిపోయే వరకూ కాంగ్రెస్ వాదిగానే ఉంటా’ అని సురేశ్ రౌత్రాయ్ స్పష్టం చేశారు. తాను విలువలకు కట్టుబడి ఉంటానని తేల్చి చెప్పారు.
చింతామణి ధ్యాన సామంత్రాయ్
గంజాం జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత, ఒడిశా అసెంబ్లీ మాజీ స్పీకర్ చింతామణి ధ్యాన సామంత్రాయ్ పరిస్థితి మరింత విచిత్రంగా ఉంది. ఆయన ఇద్దరు కుమారుల్లో ఒకరు కాంగ్రెస్ నుంచి, మరొకరు భాజపా నుంచి పోటీ చేస్తున్నారు. కుమారులిద్దరు ప్రధాన ప్రత్యర్థులు కావడంతో ఎవరికి ఓటేయాలో ఆయన ప్రజలకు చెప్పలేకపోతున్నారు. తాను ప్రాతినిధ్యం వహించిన చికితీ అసెంబ్లీ నియోజకవర్గంలో చింతామణి చిన్న కుమారుడు మనోరంజన్కు భాజపా టికెటిచ్చింది. పెద్ద కుమారుడు రబీంద్రనాథ్ కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు. అంతకుముందు చింతామణి ఇక్కడి నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ‘మా నాన్న కాలం నుంచి నేను రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్నా. అందుకే కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇచ్చింది. ఈ పోటీ ఇద్దరు సోదరుల మధ్య కాదు. రెండు సిద్ధాంతాల మధ్య జరుగుతోంది’ అని కాంగ్రెస్ అభ్యర్థి రబీంద్రనాథ్ తెలిపారు. 2014లో కాంగ్రెస్ తరఫున, 2019లో భాజపా తరఫున పోటీ చేసిన మనోరంజన్ ఓడిపోయారు. భాజపా మరోసారి ఆయనకు టికెట్ ఇచ్చింది. తాను రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్నందునే పార్టీ తనకు టికెట్ ఇచ్చిందని ఆయన అంటున్నారు. కుటుంబంలో గొడవలు పెట్టేందుకే తన సోదరుడికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చిందని మనోరంజన్ విమర్శించారు. ‘నాకు ఆరోగ్యం బాగాలేదు. నేను ఏ కుమారుడి తరఫునా ప్రచారం చేయడం లేదు. నేను ఎప్పటికీ కాంగ్రెస్ వాదినే. భాజపా సిద్ధాంతాలను వ్యతిరేకిస్తా’ అని 84ఏళ్ల చింతామణి వెల్లడించారు.
బిజయ్ మహాపాత్ర్
కేంద్రపాడా జిల్లాలో సీనియర్ భాజపా నేత, మాజీ మంత్రి, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ను తీవ్రంగా వ్యతిరేకించే బిజయ్ మహాపాత్రదీ అదే పరిస్థితి. ఆయన కుమారుడు అరవింద్ మహాపాత్ర్ బిజూ జనతాదళ్ తరఫున పట్కురా నుంచి పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం బిజయ్ రాజకీయాల్లో క్రియాశీలంగా లేరు. ఇప్పటిదాకా భాజపాలో ఉన్న ఆయన తన కుమారుడికి తప్పనిసరి పరిస్థితుల్లో మద్దతునిస్తున్నారు. రెండు దశాబ్దాలపాటు బిజదను వ్యతిరేకిస్తూ వచ్చిన ఆయన ఈసారి ఆ పార్టీకి ప్రచారం చేయాల్సి రావడం గమనార్హం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కమల వికాసమా.. ద్రవిడ దరహాసమా!
దక్షిణాదిన పాగా వేసేందుకు చురుగ్గా పావులు కదుపుతున్న భాజపా....తమిళనాడులో సంచలన విజయాల నమోదుకు తహతహలాడుతోంది. -
చక్కెర నాడు తీపి.. కుమారకా? చంద్రుడికా..?
Mandya: కర్ణాటకలోని మండ్య పోరు ఈసారి ఆసక్తికరంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఇక్కడ బరిలోకి దిగగా.. ఆయనపై కాంగ్రెస్ నుంచి వెంకటరమణ గౌడ పోటీ చేస్తున్నారు. -
ఈసారైనా అమృతం దక్కేనా?
గత రెండు పర్యాయాలుగా దేశవ్యాప్తంగా మోదీ గాలి వీస్తున్నా.. అక్కడ హస్తానిదే పైచేయి. భాజపా నుంచి హేమాహేమీలు బరిలోకి దిగుతున్నా విజయం కాంగ్రెస్దే. -
దిగువ సభకు పెద్దల పోటీ!
ప్రస్తుతం రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న, ఇటీవలి వరకూ ఆ సభ సభ్యులుగా ఉన్న 10 మంది కేంద్రమంత్రులు ఈసారి లోక్సభ ఎన్నికల బరిలో నిలిచారు. -
నటుల రాజకీయ రణస్థలం.. లోక్సభ ఎన్నికల్లో 20 మందికి పైగా పోటీ
లోక్సభ ఎన్నికల బరిలో సినీ, టీవీ నేపథ్యమున్న నటులు 20 మందికి పైగా వివిధ పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు. ఇందులో ఎక్కువ మంది భాజపా తరఫున రంగంలోకి దిగారు. -
కేరళలో ఇం‘ఢీ’యా
దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్కు బలమున్న స్థానాల్లో కేరళ ఒకటి. ఈ రాష్ట్రంలో లెఫ్ట్, కాంగ్రెస్ల మధ్యే ఎప్పుడూ ప్రధాన పోటీ ఉంటుంది. -
అప్పుడు తాతలు.. ఇప్పుడు మనవళ్లు : దేవెగౌడ కోట ఎవరికో..?
Hassan Poll: ఈ సార్వత్రిక ఎన్నికల్లో మాజీ ప్రధాని దేవెగౌడ కంచుకోట హసన్లో పోరు ఆసక్తికరంగా మారింది. గతంలో ఇదే స్థానం నుంచి పోటీ చేసిన ఇద్దరు ప్రముఖ నేతల మనవళ్లు తాజాగా బరిలో ఉన్నారు. -
డీఎంకేకు గట్టి పోటీ
తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకేకు ఈ లోక్సభ ఎన్నికల్లో కొన్నిచోట్ల గట్టి పోటీయే ఎదురవుతోంది. గెలుపు కోసం ఆ పార్టీ తీవ్రంగా పోరాడాల్సిన పరిస్థితి నెలకొంది. -
ఎడారి రాష్ట్రం ఎవరిపరం?
రాజకోటలకు, ఎడారి ప్రాంతానికి ప్రసిద్ధి చెందిన రాజస్థాన్ ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఎవరికి కోట కట్టనుందనేది ఆసక్తికరంగా మారింది. -
సింధియాలదే ‘గుణ’
సార్వత్రిక ఎన్నికల సమరంలో గ్వాలియర్ రాజ కుటుంబానికి కంచుకోటగా ఉన్న గుణ (మధ్యప్రదేశ్) లోక్సభ స్థానంలో పోటీ ఉత్కంఠ రేపుతోంది. -
ఈశాన్యంలో ‘హిందుత్వ’పై మౌనం
లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 400కుపైగా సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న భాజపా ఆయా ప్రాంతాలను బట్టి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
పశ్చిమ యూపీలో మొగ్గెవరికి?
తొలి విడత పోలింగ్ జరగనున్న పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్లోని రాంపుర్, మొరాదాబాద్, సంభల్తోపాటు మిగిలిన నియోజకవర్గాలపై ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమైంది. -
రాచరికమే అర్హత!
రాజ్యమున్నవారే రాజులు.. అట్టివారే కురు రాజ పరిషత్తులో పాల్గొనుటకు అర్హులు అని భీష్ముడంటే... ఓహో ‘రాచరికమా అర్హతను నిర్ణయించునది’ అని సుయోధనుడు వేసిన ప్రశ్న దానవీరశూర కర్ణ చిత్రం చూసిన వారందరికీ గుర్తుంటుంది.
తాజా వార్తలు
-
130 స్కూళ్లకు బెదిరింపు మెయిల్.. ఎన్నికల వేళ ఉగ్ర కుట్రేనా?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘విస్తారా’కు వడగండ్ల దెబ్బ.. విమానం అత్యవసర ల్యాండింగ్
-
కీర్తి సురేశ్తో ‘ఉప్పు కప్పురంబు’.. సుహాస్ రియాక్షన్ ఏంటంటే?
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?