KTR: హ్యాట్రిక్ కొడతాం..70కి పైగా స్థానాలతో అధికారంలోకి వస్తాం: మంత్రి కేటీఆర్
70కి పైగా స్థానాల్లో విజయం సాధించి హ్యాట్రిక్ కొడతామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
హైదరాబాద్: 70కి పైగా స్థానాల్లో విజయం సాధించి హ్యాట్రిక్ కొడతామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ (KTR)ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ తమకు వ్యతిరేకంగా ఉండటం ఇది తొలిసారి కాదన్నారు. పోలింగ్(Telangana elections)ముగిసిన తర్వాత తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2018 ఎన్నికల్లో భారాసకు 88 సీట్లు వస్తాయని ఏ సర్వే కూడా గుర్తించలేకపోయిందని.. అప్పటి ఫలితాలు ఎలా ఉన్నాయో ప్రజల చూశారని కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం 88కి పైగా స్థానాలు వస్తాయని అంచనా వేసినప్పటికీ కొన్ని కారణాల వల్ల 70కి పైగా స్థానాల్లో భారాస విజయం సాధిస్తుందన్నారు. ఎగ్జిట్ పోల్స్కు అంత శాస్త్రీయత ఉందని తాము అనుకోవట్లేదన్నారు. పోలింగ్ జరుగుతుండగానే ఎగ్జిట్ పోల్స్ సర్వే జరుగుతుందని, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చూసి కార్యకర్తలు ఆందోళన చెందవద్దని సూచించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-1.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-6.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-7.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-4.png)
తాజా వార్తలు
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత