icon icon icon
icon icon icon

Harish Rao: కాంగ్రెస్‌ ఫిర్యాదుతోనే రైతుబంధుకు బ్రేక్‌: మంత్రి హరీశ్‌రావు

కాంగ్రెస్‌ నేతలు ఫిర్యాదు చేయడంతోనే ‘రైతుబంధు’కు ఈసీ అనుమతి నిరాకరించిందని తెలంగాణ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు.

Updated : 27 Nov 2023 13:02 IST

జహీరాబాద్‌: కాంగ్రెస్‌ నేతలు ఫిర్యాదు చేయడంతోనే ‘రైతుబంధు’కు ఈసీ అనుమతి నిరాకరించిందని తెలంగాణ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. మహా అయితే డిసెంబర్‌ 3 వరకు రైతుబంధును కాంగ్రెస్‌ నేతలు ఆపగలరని.. ఆ తర్వాత మళ్లీ ఇచ్చేది కేసీఆరేనని చెప్పారు. జహీరాబాద్‌లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో హరీశ్‌ మాట్లాడారు. రైతుబంధుపై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్‌ నేత నిరంజన్‌రెడ్డి ఫిర్యాదు చేశారన్నారు.

‘‘కాంగ్రెస్‌ వాళ్లు రైతులకు ఇవ్వరు.. ఇచ్చిన వాళ్లకు అడ్డుపడుతున్నారు. తెలంగాణ రైతులతో కేసీఆర్‌ది ఓటు బంధం కాదు.. పేగుబంధం. గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పకపోయినా రైతుబంధు ఇచ్చాం. ఓట్ల కోసం కాకుండా రైతులపై ప్రేమతో 11 సార్లు కేసీఆర్‌ ఇచ్చారు. ఎకరాకు రూ.16వేల ఇస్తానని కేసీఆర్ అంటే.. రైతుకు ఏడాదికి రూ.15వేలు ఇస్తామని కాంగ్రెస్‌ చెబుతోంది. కాంగ్రెస్‌ కుట్రలను తిప్పికొట్టాలి. వారికి ఓటుతోనే పోటు పొడవాలి. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే రైతుబంధు నిలిచిపోతుంది. కర్ణాటకలో ఆ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. ఇచ్చిన హామీలను అమలు చేసేది కేసీఆర్‌’’ అని హరీశ్‌రావు అన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img