icon icon icon
icon icon icon

MP Laxman: కాంగ్రెస్‌ బూటకపు హామీలతో మోసం చేస్తోంది: ఎంపీ లక్ష్మణ్‌

కాంగ్రెస్‌ పార్టీ పెయిడ్‌ సర్వేలతో ప్రజలను మోసం చేస్తోందని భాజపా ఎంపీ లక్ష్మణ్‌ అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

Published : 28 Nov 2023 12:46 IST

హైదరాబాద్: కాంగ్రెస్‌ పార్టీ పెయిడ్‌ సర్వేలతో ప్రజలను మోసం చేస్తోందని భాజపా ఎంపీ లక్ష్మణ్‌ అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ బూటకపు హామీలతో మోసం చేస్తోందని విమర్శించారు. కౌలు రైతులకు రైతు భరోసా అనేది సాధ్యం కాదని చెప్పారు. సాధ్యం కాదని తెలిసీ రైతుభరోసా ఇస్తామని చెప్పి ప్రజలను కాంగ్రెస్‌ మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

‘‘రాష్ట్ర ప్రజలు భాజపా పాలనను కోరుకుంటున్నారు. తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్‌ పార్టీకి ఎప్పుడూ 60 సీట్లు రాలేదు. గతంలోనూ ఉమ్మడి రాష్ట్రంలో కోస్తాంధ్ర, రాయలసీమ సీట్లతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది’’ అని లక్ష్మణ్‌ అన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img