icon icon icon
icon icon icon

Modi: అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా దూకుడు.. ఈ సాయంత్రం కార్యకర్తలతో మోదీ మీటింగ్‌

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భాజపా దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ(Modi) కార్యకర్తలతో మాట్లాడనున్నారు. 

Published : 03 Dec 2023 14:43 IST

దిల్లీ: మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లో భాజపా ఆధిక్యంలో కొనసాగుతూ.. ఆధిక్యంలో మ్యాజిక్‌ ఫిగర్‌ను దాటింది. సాయంత్రానికల్లా స్పష్టమైన గణాంకాలు రానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ(Modi) భాజపా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ రోజు సాయంత్రం దిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం జరగనుంది.

ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)లో కాంగ్రెస్‌ పార్టీకి మొగ్గు ఉంటుందని,  మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh), రాజస్థాన్‌ (Rajasthan)లో కమలం వికసిస్తుందని ఎగ్జిట్ పోల్స్‌ అంచనాలు వెలువడ్డాయి. ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం అంచనాలు తారుమారయ్యాయి. మూడు రాష్ట్రాల్లో భాజపానే అధికారాన్ని ఏర్పాటు చేయనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img