icon icon icon
icon icon icon

Prathipati Pullarao: జగన్‌ ప్రచారంపై ఈసీ తక్షణమే నిషేధం విధించాలి: మాజీ మంత్రి ప్రత్తిపాటి

సీఎం జగన్‌ ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తున్నారని తెదేపా నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. చిలకలూరిపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

Published : 02 May 2024 11:36 IST

చిలకలూరిపేట: సీఎం జగన్‌ ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తున్నారని తెదేపా నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. చిలకలూరిపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘సీఎం జగన్‌ ప్రచారంపై ఈసీ తక్షణం నిషేధం విధించాలి. అబద్ధాలతో విపక్షాలపై ఆయన బురద చల్లుతున్నారు. రాష్ట్రంలో మహిళల్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ను అనరాని మాటలతో దూషిస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్‌లాగే జగన్‌ ప్రచారంపైనా ఈసీ నిషేధం విధించాలి. ఆయన కోడ్‌ ఉల్లంఘనలపై ఈసీకి ఇప్పటికే ఫిర్యాదు చేశాం. స్థాయి దిగజారి వ్యక్తిగత జీవితాలపై కూడా జగన్‌ మాట్లాడుతున్నారు’’ అని ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img