icon icon icon
icon icon icon

Raja Singh: కాంగ్రెస్‌వి మోసపూరిత హామీలు: భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌

రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన వ్యక్తి ప్రధాని నరేంద్రమోదీ అని భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌ (Raja singh) అన్నారు.

Updated : 06 Dec 2023 13:58 IST

హైదరాబాద్‌: రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన వ్యక్తి ప్రధాని నరేంద్రమోదీ అని భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌ (Raja singh) అన్నారు. అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా నాంపల్లిలోని భాజపా(BJP) రాష్ట్ర కార్యాలయంలో ఆయన చిత్రపటం వద్ద భాజపా నేతలు నివాళులర్పించారు. అనంతరం రాజాసింగ్‌ మీడియాతో మాట్లాడారు. 

‘‘అంబేడ్కర్‌ను అన్ని వర్గాల వారు స్మరించుకుంటున్నారు. రాష్ట్రంలో రావణ రాజ్యం అంతమైంది. దళితులను కేసీఆర్‌ మోసం చేశారు. భాజపా ఒత్తిడితోనే అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆయన ఏర్పాటు చేశారు. కేసీఆర్‌ పథకాలను అమలు చేస్తానని రేవంత్‌ చెప్పారు. దళితులను మోసం చేస్తే భాజపా కార్యకర్తలు వదిలిపెట్టరు. కాంగ్రెస్‌ పార్టీ అంబేడ్కర్‌ను ఎప్పుడూ గౌరవించలేదు. ఆరు గ్యారంటీల పేరుతో మోసపూరిత హామీలను కాంగ్రెస్‌ ఇచ్చింది’’ అని రాజాసింగ్‌ అన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img