icon icon icon
icon icon icon

Revanth Reddy: ఖర్గే, కేసీ వేణుగోపాల్‌తో రేవంత్‌ భేటీ

తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి, సీఎల్పీ నేత రేవంత్‌రెడ్డి దిల్లీ పర్యటన కొనసాగుతోంది.

Updated : 06 Dec 2023 12:01 IST

మల్లికార్జున ఖర్గేకు పుష్పగుచ్ఛం అందజేస్తున్న రేవంత్‌

దిల్లీ: తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి, సీఎల్పీ నేత రేవంత్‌రెడ్డి దిల్లీ పర్యటన కొనసాగుతోంది. బుధవారం ఉదయం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కేసీ వేణుగోపాల్‌తో ఆయన భేటీ అయ్యారు. సీఎల్పీ నేతగా తనను ప్రకటించిన నేపథ్యంలో వారిద్దరికీ రేవంత్‌ కృతజ్ఞతలు తెలిపారు. కాసేపట్లో కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీతో ఆయన సమావేశం కానున్నారు. ప్రమాణస్వీకారానికి వారిని ఆహ్వానించనున్నారు. దీంతో పాటు రాష్ట్రంలో మంత్రివర్గ ఏర్పాటు, ఇతర అంశాలపై సోనియా, రాహుల్‌తో రేవంత్‌ చర్చించనున్నారు. 

కేసీ వేణుగోపాల్‌తో..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img