icon icon icon
icon icon icon

Siddaramaiah: కర్ణాటకలో సమస్య ఉంటే.. తెలంగాణలో ఆందోళనలా?: సిద్ధరామయ్య

కర్ణాటకలో సమస్య ఉంటే తెలంగాణలో రైతులు ఆందోళన చేస్తారా?అని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రశ్నించారు.

Published : 26 Nov 2023 15:50 IST

హైదరాబాద్‌: కర్ణాటకలో సమస్య ఉంటే తెలంగాణలో రైతులు ఆందోళన చేస్తారా? అని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రశ్నించారు. ఇక్కడ నిరసన చేసేవాళ్లు కర్ణాటక  రైతులు కాదని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌ వచ్చిన ఆయన విలేకరులు సమావేశంలో మాట్లాడారు. కర్ణాటక రాష్ట్రానికి వచ్చి చూస్తే.. కాంగ్రెస్‌ పాలన ఏంటో కేసీఆర్‌కు అర్థమవుతుందని తెలిపారు. తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేసి తీరుతామన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ హామీలు అమలవ్వలేదని అసత్యాలు చెబుతున్నారనీ, కర్ణాటకలో అభివృద్ధి గురించి కేసీఆర్‌, కేటీఆర్‌, భాజపా చేస్తున్న ప్రచారాలు అబద్ధమని సిద్ధరామయ్య పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img