శునకం అనుకరణ.. యజమానికి ₹26వేల బిల్లు!
శునకాలు మనిషికి మంచి స్నేహితులు అని చెబుతుంటారు. నిజమే.. మనుషుల భావాలను, మాటలను శునకాలు చక్కగా అర్థం చేసుకుంటాయి. యజమాని సంతోషంలో ఉంటే.. శునకాలు మరింత హుషారుగా ఉంటాయి.. బాధపడితే అవి కూడా బాధపడుతూనే అమాయక
(ఫొటో: రస్సెల్ జోన్స్ ఫేస్బుక్)
ఇంటర్నెట్ డెస్క్: శునకాలు మనిషికి మంచి స్నేహితులు అని చెబుతుంటారు. నిజమే.. మనుషుల భావాలను, మాటలను శునకాలు చక్కగా అర్థం చేసుకుంటాయి. యజమాని సంతోషంలో ఉంటే.. శునకాలు మరింత హుషారుగా ఉంటాయి.. బాధపడితే అవి కూడా బాధపడుతూనే అమాయక ప్రవర్తనలతో ఓదారుస్తుంటాయి. అలాగే ఓ శునకం తన యజమాని కాలికి దెబ్బ తగిలి బాధపడుతుంటే.. సానుభూతి చూపే క్రమంలో ఆయన్ను అనుకరించే ప్రయత్నం చేసింది. దీంతో యజమానికి రూ. 26వేల ఖర్చు అయింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..?
లండన్లో నివసించే రస్సెల్ జోన్స్కు ఇటీవల కాలికి గాయమైంది. చికిత్సలో భాగంగా వైద్యులు ఆయన కాలుకు కట్టుకట్టారు. దీంతో రస్సెల్ కర్రల సాయంతో కాస్త కుంటుకుంటూ నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పని నిమిత్తం రస్సెల్ బయటకు వెళ్తుంటే.. ఆయన పెంచుకుంటున్న శునకం ‘బిల్’ కూడా వెంట వెళ్లేది. అయితే, తన యజమాని కుంటుతుండటంతో బిల్ కూడా కుంటడం మొదలుపెట్టింది. రస్సెల్ మాత్రం శునకం కాలికి కూడా గాయమైందేమోనని కంగారు పడ్డారు. వెంటనే పశువైద్యుల వద్దకు తీసుకెళ్లి.. ఎక్స్రే, ఇతర పరీక్షలు చేయించాడు. కానీ, వైద్యుల నివేదికలో బిల్ కాలికి ఎలాంటి గాయాలు కాలేదని తేలింది. అప్పుడు అర్థమైంది.. తను కుంటుకుంటూ నడవంతో బిల్ తనని అనుకరించిందని. శునకం చూపించిన సానుభూతికి రస్సెల్ ముగ్ధుడైనా.. దానికి నిర్వహించిన వైద్య పరీక్షలకు 300యూరోలు(రూ.26,533)ఖర్చు అయ్యాయి. ఈ విషయాన్ని రస్సెల్ తన ఫేస్బుక్లో పోస్టు చేస్తూ.. తనను అనుకరిస్తూ కుంటుతున్న శునకం వీడియో జతచేశాడు. దీంతో ఆ వీడియో వైరల్గా మారడమే కాదు.. యజమానిపై శునకం చూపించిన ప్రేమ, సానుభూతికి నెటిజన్లు ఫిదా అయ్యారు.
ఇవీ చదవండి..
పిల్లితో గూఢచర్యం: విఫలయత్నం.. ₹కోట్లు ఖర్చు
శునకాలు కరోనా బాధితుల్ని పసిగట్టగలవా?
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సునీత, వైఎస్ షర్మిల పిటిషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు
కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై శుక్రవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వివేకా హత్య కేసు.. సునీల్ యాదవ్, ఉదయ్కుమార్రెడ్డికి చుక్కెదురు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్న సునీల్ యాదవ్, ఉదయ్కుమార్రెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఎట్టకేలకు శంషాబాద్ విమానాశ్రయంలో చిక్కిన చిరుత
ఎట్టకేలకు శంషాబాద్ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది. ఐదు రోజులుగా చిరుత కోసం అటవీ శాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. -
ఆరున్నరేళ్ల పరుగు.. 50 కోట్ల ప్రయాణికులు
హైదరాబాద్ మెట్రోరైలు 50 కోట్ల ప్రయాణికుల మైలురాయిని చేరుకుంది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
పక్క వారిపై ఆ భావన ఉంటే ఈగోలు అడ్డురావు: శోభితా ధూళిపాళ్ల
-
ఆ ఒక్కడే.. ఐపీఎల్లో నన్ను భయపెట్టిన బ్యాటర్: గౌతమ్ గంభీర్
-
సునీత, వైఎస్ షర్మిల పిటిషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు
-
సూచీలకు ‘హెవీ’ స్ట్రోక్.. 700 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రోహిత్ తర్వాత పాండ్యనే కెప్టెన్.. మరింత బాధ్యతగా ఆడాలి: మాజీ క్రికెటర్
-
భారత కంపెనీపై దిల్లీ హైకోర్టుకు టెస్లా.. కారణం ఇదే..