Vangaveeti Radha: నిరాడంబరంగా వంగవీటి రాధా నిశ్చితార్థం

 తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ నిశ్చితార్థ వేడుక ఆదివారం నరసాపురంలో నిరాడంబరంగా జరిగింది.

Updated : 04 Sep 2023 10:03 IST

నరసాపురం: తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ (రాధా) నిశ్చితార్థ వేడుక నిరాడంబరంగా జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మున్సిపల్‌ మాజీ ఛైర్‌ పర్సన్‌ జక్కం అమ్మానీ, బాబ్జీ దంపతుల ద్వితీయ కుమార్తె పుష్పవల్లితో రాధా నిశ్చితార్థ వేడుక ఆదివారం నరసాపురంలో జరిగింది. ఈ వేడుకకు రెండు కుటుంబాలకు చెందిన ముఖ్యమైన బంధువులు, నరసాపురం ప్రాంతానికి చెందిన కొంతమంది ముఖ్య నాయకులనే మాత్రమే ఆహ్వానించారు.

అక్టోబరు 22వ తేదీ సాయంత్రం 7.59 గంటలకు వీరి వివాహం జరిపించేందుకు ముహూర్తం నిర్ణయించారు. నిశ్చితార్థ వేడుకకు ప్రభుత్వ చీఫ్‌విప్‌ ముదునూరి ప్రసాదరాజు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బరాయుడు, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు, జనసేన పార్టీ నరసాపురం ఇన్‌ఛార్జి బొమ్మిడి నాయకర్‌తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని