Hyderabad: మళ్లీ భూముల వేలం.. ఈసారి 3 జిల్లాలతో HMDA జాబితా

మరోసారి భూముల ఈ-వేలానికి హెచ్‌ఎండీఏ సిద్ధమైంది. రంగారెడ్డి, మేడ్చల్‌ - మల్కాజ్‌గిరి, సంగారెడ్డి జిల్లాల్లో భూముల విక్రయానికి నోటిఫికేషన్‌ జారీ చేసింది.

Updated : 09 Aug 2023 13:15 IST

హైదరాబాద్: మరోసారి భూముల ఈ-వేలానికి హెచ్‌ఎండీఏ సిద్ధమైంది. రంగారెడ్డి, మేడ్చల్‌ - మల్కాజ్‌గిరి, సంగారెడ్డి జిల్లాల్లో భూముల విక్రయానికి నోటిఫికేషన్‌ జారీ చేసింది. రంగారెడ్డిలోని బైరాగిగూడ, మంచిరేవుల, కోకాపేట, నల్లగండ్ల, బుద్వేల్‌, చందానగర్‌, పీరంచెరువు.. మేడ్చల్‌ - మల్కాజ్‌గిరిలోని బాచుపల్లి, బౌరంపేట, చెంగిచెర్ల, సూరారం.. సంగారెడ్డిలో వెలిమల, నందిగాయ, అమీన్‌పూర్‌, పతిఘనపూర్‌, కిష్టారెడ్డిపేట ప్రాంతాల్లోని భూములను విక్రయించనుంది. 

చదరపు గజానికి కనీస ధర ₹12వేలు, గరిష్ఠ ధర ₹65వేలుగా నిర్ణయించారు. ప్లాట్ల విస్తీర్ణం 302 చదరపు గజాల నుంచి 8,591 చదరపు గజాల వరకు ఉన్నాయి. రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ ఆగస్టు 16 కాగా.. 18 నుంచి ఈవేలం నిర్వహించనున్నారు. పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్‌ https://www.hmda.gov.in/auctions/లో చూడొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు