Jagtial: లిక్కర్‌ వ్యాన్‌ బోల్తా... రూ.50 లక్షల మద్యం రోడ్డు పాలు

కరీంనగర్‌ ప్రధాన రహదారిపై మల్యాల మండలం వీఆర్‌కే ఇంజినీరింగ్‌ కళాశాల వద్ద వాహనాన్ని తప్పించబోయి లిక్కర్‌ వ్యాన్‌ బోల్తా పడింది.

Updated : 13 Mar 2024 20:44 IST

జగిత్యాల గ్రామీణం: కరీంనగర్‌ ప్రధాన రహదారిపై మల్యాల మండలం వీఆర్‌కే ఇంజినీరింగ్‌ కళాశాల వద్ద వాహనాన్ని తప్పించబోయి లిక్కర్‌ వ్యాన్‌ బోల్తా పడింది. దీంతో వాహనంలో ఉన్న మద్యం సీసాలు ధ్వంసమయ్యాయి. దాదాపు రూ.50లక్షల విలువైన మద్యం రోడ్డు పాలైంది. ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని కరీంనగర్‌ ఆసుపత్రికి తరలించారు. కరీంనగర్‌ డిపో నుంచి జగిత్యాలలోని పలు వైన్ షాపులకు లిక్కర్‌ తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. మల్యాల పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని భద్రత కల్పించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని