Hyderabad: గుండెపోటుతో పటాన్‌చెరు ఎమ్మెల్యే కుమారుడి మృతి

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పెద్దకుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి (30) గుండెపోటుతో మృతిచెందారు.

Updated : 27 Jul 2023 11:28 IST

పటాన్‌చెరు అర్బన్‌: పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పెద్ద కుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి (30) గుండెపోటుతో మృతిచెందారు. అనారోగ్యంతో గత కొన్ని రోజులుగా కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు గురువారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన మృతి చెందారు. కిడ్నీలు పాడవటంతో విష్ణువర్ధన్‌రెడ్డి ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతుండగానే ఆయనకు కామెర్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో వైద్యులు విష్ణువర్ధన్‌కు డయాలసిస్‌ చేశారు. గత కొద్ది రోజులుగా ఆయన వెంటిలేటర్‌పై ఉన్నారు. ఈ క్రమంలోనే తెల్లవారుజామున గుండెపోటు వచ్చింది. విష్ణువర్ధన్‌ మృతదేహాన్ని గురువారం ఉదయం ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి నివాసానికి తీసుకువచ్చారు. కుమారుడి మృతితో మహిపాల్‌రెడ్డి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని