Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. తిరుమల కాలిబాటలో చిరుత, ఎలుగు సంచారంపై వదంతులొద్దు: తితిదే
తిరుమల కాలిబాటలో చిరుత, ఎలుగు సంచారంపై తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) ఓ ప్రకటన విడుదల చేసింది. చిరుత, ఎలుగుబంటి సంచారంపై కెమెరాలతో పర్యవేక్షిన్నట్లు తితిదే అటవీశాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు. కాలిబాట భక్తులకు అటవీ అధికారులు సూచనలు చేస్తున్నారని చెప్పారు. వన్యప్రాణుల సంచారం ఎక్కువగా ఉన్న చోట రెస్క్యూ బృందాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. ‘గని’ ఫ్లాప్.. అదే మేము చేసిన పెద్ద తప్పు: వరుణ్ తేజ్
తన గత చిత్రం ‘గని’ (Ghani) పరాజయంపై తొలిసారి మీడియాతో మాట్లాడారు నటుడు వరుణ్ తేజ్ (Varun Tej). ఆ సినిమా ఫ్లాప్కు కారణమేమిటో తమకు తెలుసన్నారు. ‘‘గని’ నా ఫస్ట్ ఫ్లాప్ కాదు. దానికి ముందు కూడా కొన్ని ఫ్లాప్లు ఉన్నాయి. సక్సెస్ కంటే ఫెయిల్యూర్ వల్లే ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందని నేను నమ్ముతుంటా. ‘మిస్టర్’ ఫ్లాప్ అయ్యాక.. ఎక్కడ తప్పు జరిగిందో అర్థం చేసుకుని దాన్ని ఫిక్స్ చేసుకున్నా. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. చంద్రబాబును కలిసిన యార్లగడ్డ వెంకట్రావు
తెదేపా అధినేత చంద్రబాబుతో గన్నవరం నేత యార్లగడ్డ వెంకట్రావు భేటీ అయ్యారు. వైకాపాను వీడి తెదేపాలో చేరనున్నట్లు ఇటీవల ప్రకటించిన యార్లగడ్డ.. నేడు చంద్రబాబును కలిశారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. 19 ఏళ్లు అమెరికాలో ఉన్నప్పటి సంగతులు.. ఆ తర్వాత రాజకీయాలపై ఆసక్తితో స్వదేశానికి రావడం తదితర విషయాలను చంద్రబాబుకు వివరించినట్లు యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. కలిసి పనిచేద్దామని ఆయన చెప్పారన్నారు. త్వరలోనే తెదేపాలో చేరుతానని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. రాహుల్కు ధన్యవాదాలు తెలిపిన కేంద్ర మంత్రి.. ఎందుకంటే?
కాంగ్రెస్ (Congress) పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్ (Ladakh)లోని లేహ్ (Leh) పర్యటనలో భాగంగా శనివారం పాంగాంగ్ సరస్సుకు బైక్ రైడ్ చేపట్టారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆయన సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. అయితే, రాహుల్ బైక్ యాత్రపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju) స్పందించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. గండిపోచమ్మ ఆలయంలోకి గోదావరి వరద
అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం వద్ద గోదావరి నీటిమట్టం మళ్లీ పెరుగుతోంది. గండిపోచమ్మ ఆలయం మండపంలోకి వరద నీరు చేరింది. దీంతో దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. గత నెలలోనూ భారీగా వర్షాలు కురవడంతో గండి పోచమ్మ ఆలయంలోకి గోదావరి వరద చేరుకున్న విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. మధ్యప్రదేశ్లోనూ అలాంటి ఘటనలు జరగొచ్చు.. భాజపాపై దిగ్విజయ్ తీవ్ర ఆరోపణలు!
అసెంబ్లీ ఎన్నికల ముందు మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లో నుహ్ తరహా అల్లర్లు జరిగే అవకాశం ఉందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ (Digvijaya Singh) ఆరోపించారు. త్వరలో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో భాజపా ఓటమి ఖాయమని ఆ పార్టీ నేతలకు అర్థమైందని అన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొట్టే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. ఒక్క రోజులో.. ఒకే జిల్లాలో నలుగురు రైతన్నల ఆత్మహత్యలా?: చంద్రబాబు
ఏపీలో రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్లినా రైతుల కష్టాలు, సమస్యలు కనిపిస్తున్నాయన్నారు. శనివారం ఒక్కరోజే ఉమ్మడి కర్నూలు జిల్లాలో నలుగురు రైతులు బలవన్మరణాలకు పాల్పడటంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క రోజులో, ఒకే జిల్లాలో నలుగురు రైతన్నలు ప్రాణాలు తీసుకున్నారంటే రాష్ట్రంలో అన్నదాతల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. అందుకే.. అన్అకాడమీ నన్ను తొలగించింది: ఉపాధ్యాయుడు
చదువుకున్న వారికే ఓటువేయాలని విద్యార్థులకు చెప్పిన ఉపాధ్యాయుడిపై ఇటీవల ప్రముఖ ఎడ్టెక్ సంస్థ అన్అకాడమీ(Unacademy) వేటు వేసింది. తమ వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకోవడానికి తరగతి గది సరైంది కాదంటూ ఆయన్ను తొలగించడానికి గల కారణాన్ని వివరించింది. దీనిపై ఉపాధ్యాయుడు కరణ్ సంగ్వాన్ ( Karan Sangwan) శనివారం స్పందించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. వరుస రోజుల్లో మ్యాచ్లు నిర్వహిస్తే సెక్యూరిటీ కష్టమే.. HYD పోలీసుల ఆందోళన!
భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2023) జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అన్ని జట్లూ సిద్ధమవుతున్నాయి. కొన్ని టీమ్లు తమ ప్రాథమిక జట్లనూ ప్రకటించాయి. ఐసీసీ, బీసీసీఐ (BCCI) కూడా మ్యాచ్ల రీషెడ్యూల్ను ఖరారు చేసేశాయి. ఉప్పల్ వేదికగా మూడు వరల్డ్ కప్ మ్యాచ్లు జరగనున్నాయి. ఇందులో భారత్ ఆడే మ్యాచ్లు లేవు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. పాక్లో బాంబుపేలుడు.. 11 మంది కార్మికుల మృతి
పాకిస్థాన్(pakistan)లో బాంబు పేలుడు చోటుచేసుకుంది. వజీరిస్థాన్(Waziristan)లోని గుల్మిర్కోట్ ప్రాంతంలో ఓ వ్యాన్ వద్ద పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 11 మంది కార్మికులు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. శనివారం రాత్రి ఉత్తర వజీరిస్థాన్లోని షావల్ ప్రాంతం నుంచి కార్మికులు వ్యాన్లో దక్షిణ వజీరిస్థాన్ ప్రాంతానికి వెళ్తుండగా గుల్మిర్కోట్ ప్రాంతంలో ల్యాండ్మైన్ పేలి ఈ ఘటన చోటుచేసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ
కార్పొరేషన్ల పరిధిలో రోడ్డు డివైడర్లపై ఉండే ఫ్లెక్సీలను తక్షణమే తొలగించాలని ఏపీ పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. -
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
జీవో 317 వల్ల నష్టపోయిన ఉద్యోగులను గుర్తించి వారి వివరాలను వీలైనంత త్వరగా ఇవ్వాలని అధికారులను మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది. -
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. -
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
ఎల్ఆర్ఎస్ అమలు కోసం కొత్త జిల్లాల వారీగా బృందాలు ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. -
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో విచారణ కొనసాగుతోందని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మదనపల్లెలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో భూ కబ్జాలకు సంబంధించిన బాధితుల నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా అర్జీలు స్వీకరించారు. -
నిరుద్యోగులూ నిరసనలు వద్దు.. మీ అన్నగా అండగా ఉంటా: సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగ సమస్యే అత్యంత కీలకంగా మారిందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. -
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న వీరేంద్ర కుమార్ను మంత్రి నారా లోకేశ్ కాపాడారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బీమా సొమ్ము.. జీవితకాలం లేటు!
గుంటూరు నగర శివారులో పని చేసిన ప్రధానోపాధ్యాయుడొకరు రెండేళ్ల క్రితం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. తనకు రావాల్సిన ప్రభుత్వ జీవిత బీమా (ఏపీజీఎల్ఐ) సొమ్ము కోసం ఏడాదిన్నర క్రితం దరఖాస్తు చేసుకున్నారు -
విమాన గోపురం.. సువర్ణశోభితం
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన ఉండే విమాన గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు మరో కీలక అడుగుపడింది. దీనికి సంబంధించిన అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం నేడు ఇక్కడకు రానుంది. -
విశాఖ ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ
‘విశాఖపట్నం ప్రకృతి అందాలకు నిలయం. ఇక్కడ కొండలు, గుట్టలు, నదులు, సముద్రం అన్నీ భగవత్ ప్రసాదాలే. -
అసలే పేదరికం.. ఆపై వైకల్యం
విధి వక్రించి ప్రమాదానికి గురయ్యాడు.. ప్రాణాలతో బయటపడినా చికిత్స కోసం అప్పులు చేయాల్సి వచ్చింది.. వైకల్యం బారిన పడటంతో పని చేయలేని స్థితి. -
అంధ బాలికపై అమానుషం.. వెల్లువెత్తిన నిరసన
అంధ బాలికపై అమానుషం ఘటనలో నిందితుడిని మలక్పేట ఠాణా పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
-
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!