Rahul Gandhi: రాహుల్కు ధన్యవాదాలు తెలిపిన కేంద్ర మంత్రి.. ఎందుకంటే?
లద్ధాఖ్లో కేంద్ర ప్రభుత్వం నిర్మించిన రహదారులను ప్రమోట్ చేస్తున్నందుకు కాంగ్రెస్ (Congress) పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju) ధన్యవాదాలు తెలిపారు.
దిల్లీ/లద్ధాఖ్: కాంగ్రెస్ (Congress) పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్ (Ladakh)లోని లేహ్ (Leh) పర్యటనలో భాగంగా శనివారం పాంగాంగ్ సరస్సుకు బైక్ రైడ్ చేపట్టారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆయన సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. అయితే, రాహుల్ బైక్ యాత్రపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju) స్పందించారు. లద్ధాఖ్లో కేంద్ర ప్రభుత్వం నిర్మించిన రహదారులను ప్రమోట్ చేస్తున్నందుకు రాహుల్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు కిరణ్ రిజిజు ఓ వీడియోను ఎక్స్ (ట్విటర్)లో షేర్ చేశారు. 2012లో లద్ధాఖ్లో రోడ్లు ఎలా ఉన్నాయి? ప్రస్తుతం అక్కడి రహదారుల పరిస్థితి ఎలా ఉందనేది తెలిపేలా వీడియోను రూపొందించారు.
‘‘ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం లద్ధాఖ్లో నిర్మించిన రహదారులను ప్రమోట్ చేస్తుందన్నందుకు రాహుల్ గాంధీకి ధన్యవాదాలు. కొద్ది రోజుల క్రితం కశ్మీర్ వ్యాలీలో పర్యాటకం ఎలా అభివృద్ధి చెందుతుందో ఆయన చూపించారు (రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను శ్రీనగర్లో ముగించిన సంగతిని గుర్తు చేస్తూ). ప్రస్తుతం మన జాతీయ జెండా శ్రీనగర్లోని లాల్ చౌక్లో శాంతియుతంగా రెపరెపలాడుతోంది’’ అని రిజిజు ట్వీట్లో పేర్కొన్నారు.
పాంగాంగ్ సరస్సు వద్ద రాజీవ్ గాంధీకి నివాళులర్పించిన రాహుల్ గాంధీ
రాహుల్ గాంధీ ఈ నెల 25 వరకు లద్ధాఖ్లో పర్యటించనున్నారు. అంతకు ముందు తన బైక్ పర్యటన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన రాహుల్ ‘‘ప్రపంచంలోనే అత్యంత అందమైన ప్రదేశాల్లో పాంగాంగ్ సరస్సు ఒకటి అని మా నాన్న (రాజీవ్ గాంధీ) చెప్పేవారు’’ అని ట్వీట్ చేశారు. ఆదివారం రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా పాంగాంగ్ నది ఒడ్డున రాహుల్ నివాళి అర్పించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వందల మంది ‘రేవణ్ణ’ బాధితులకు.. ప్రభుత్వం ఆర్థిక సహాయం!
రేవణ్ణ చేతిలో లైంగిక వేధింపులకు గురైన బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. -
ఆ బెత్తం దెబ్బలు ఎప్పటికీ మర్చిపోలేను: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ తన చిన్నప్పుడు పాఠశాలలో బెత్తం దెబ్బలు తిన్నారట. తన బాల్యాన్ని గుర్తుచేసుకున్న ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. -
భారత్కు పెనుశాపంగా నోటి క్యాన్సర్
నోటి క్యాన్సర్ల కారణంగా 2022లో భారత్లో ఉత్పాదకత నష్టం సుమారు 560 కోట్ల డాలర్లుగా ఉందని టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) అధ్యయనం తేల్చింది. -
ప్రజ్వల్ రేవణ్న బాధితులు 500 మంది పైనే?
కర్ణాటకలో కలకలం రేపుతున్న ప్రజ్వల్ రేవణ్న లైగింక వేధింపుల కేసులో ‘సిట్’ దర్యాప్తు దిశగా కీలక అడుగులు వేసింది. ప్రధాన నిందితుడు, హాసన సిటింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్న కోసం ఇప్పటికే లుక్ ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. -
25 కేజీల బంగారంతో పట్టుబడ్డ అఫ్గాన్ దౌత్యవేత్త
భారత్లోని అఫ్గానిస్థాన్ సీనియర్ దౌత్యవేత్త జకియా వార్ధక్ ఇటీవల ముంబయి విమానాశ్రయంలో 25 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు పట్టుబడ్డారు. -
ముందు రాయ్బరేలీలో గెలవండి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మొదట రాయ్బరేలీలో గెలవాలంటూ చెస్ దిగ్గజం కాస్పరోవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. -
ఆగ్రాలో ఆలస్యంగా వచ్చిన టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్
స్కూలుకు ఆలస్యంగా వచ్చిన టీచరును ప్రిన్సిపల్ కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరం
మైనర్లను ఉపయోగించుకుంటూ చేసే అంతర్జాతీయ నేరాలు, ఆన్లైన్ మోసాల సంఖ్య పెరిగిపోతున్న ప్రస్తుత కాలంలో వాటిని అరికట్టడానికి బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరమని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై చంద్రచూడ్ పేర్కొన్నారు. -
వాయుసేన వాహనశ్రేణిపై ఉగ్రవాదుల కాల్పులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రదాడి చోటుచేసుకుంది. శనివారమిక్కడి పూంఛ్ జిల్లాలో భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన వాహన శ్రేణిపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. -
లోక్సభ ఎన్నికల పరిశీలనకు విదేశీ అతిథులు
ప్రస్తుతం భారత్లో జరుగుతున్న లోక్సభ ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఆస్ట్రేలియా, రష్యా, శ్రీలంక, బంగ్లాదేశ్ సహా 23 దేశాలకు చెందిన 75 మంది ఎన్నికల నిర్వహణ సంస్థల ప్రతినిధులు భారత్ చేరుకున్నారు. -
360 మంది అభ్యర్థులపై కేసులు: ఏడీఆర్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా నాలుగో దశలో పోటీచేస్తున్న 1,710 మంది అభ్యర్థుల్లో 360 మంది నేరచరితులని ‘ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం’ (ఏడీఆర్) నివేదిక పేర్కొంది. -
ఉల్లి ఎగుమతులపై ఆంక్షల తొలగింపు
ఉల్లిపాయల ఎగుమతులపై ఆంక్షలను తొలగిస్తూ కేంద్రం శనివారం ఆదేశాలు జారీ చేసింది. -
లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేస్తాం
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఆ రాష్ట్ర పోలీసులు విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. -
నిద్రమత్తులో స్టేషన్ మాస్టర్.. పదేపదే హారన్ మోతతో మెలకువ
రైల్వేస్టేషన్ మాస్టర్ నిద్రమత్తులో జోగడంతో ఆకుపచ్చ సూచిక కోసం ఓ రైలు అరగంటసేపు నిరీక్షించాల్సిన పరిస్థితి తలెత్తింది. -
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
స్కూల్కు ఆలస్యంగా వచ్చినందుకు ప్రిన్సిపల్ ఓ టీచర్ను కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
విధుల్లో ఉన్న స్టేషన్ మాస్టర్ నిద్రపోవడంతో ఓ ఎక్స్ప్రెస్ రైలు అరగంటపాటు నిలిచిపోయిన ఘటన ఉత్తర్ప్రదేశ్లో వెలుగుచూసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారిన ట్రెండ్.. ఎన్నికల వేళా ఐపీఓల సందడి!
-
రోజా కామెంట్స్పై స్పందించిన గెటప్ శ్రీను.. ఏమన్నారంటే?
-
వందల మంది ‘రేవణ్ణ’ బాధితులకు.. ప్రభుత్వం ఆర్థిక సహాయం!
-
బైక్ పార్కింగ్ విషయంలో గొడవ.. తమ్ముడిని చంపిన అన్న
-
ప్రాణాలు కాపాడిన యాపిల్ వాచ్.. సీఈఓ రియాక్షన్ ఇదే..