Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. ఐఫోన్లకు అత్యవసర అప్డేట్.. పెగాసస్ను చొప్పించేందుకు హ్యాకర్ల యత్నం!
యాపిల్ తమ ఐఫోన్ యూజర్లకు అత్యవసర సెక్యూరిటీ అప్డేట్ల (iPhone security updates)ను విడుదల చేసింది. కొంతమంది హ్యాకర్లు ఫోన్లలోకి స్పైవేర్ను చొప్పించేందుకు అవకాశం ఉందని గుర్తించడమే దీనికి కారణం. ఇప్పటి వరకు గుర్తించని కొన్ని లోపాలను ఉపయోగించుకొని హ్యాకర్లు ఐఫోన్లలోకి స్పైవేర్ను ప్రవేశపెట్టేందుకు యత్నించినట్లు తెలిసింది. దీంతో వెంటనే అప్రమత్తమైన యాపిల్ సెక్యూరిటీ అప్డేట్ల (iPhone security updates)ను అందించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. నా భర్తపై వాళ్లిద్దరూ పెట్రోల్ పోసి తగులబెట్టారు: హోంగార్డు భార్య
తన భర్త 17 ఏళ్లుగా నిబద్ధతతో విధులు నిర్వహించారని మృతిచెందిన హోంగార్డు రవీందర్ భార్య సంధ్య అన్నారు. రవీందర్పై ఏఎస్సై నర్సింగ్రావు, కానిస్టేబుల్ చందు పెట్రోల్ పోసి తగులబెట్టారని ఆమె ఆరోపించారు. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. రవీందర్ ఫోన్ను అన్లాక్ చేసి డేటా డిలీట్ చేశారని.. ఇప్పటి వరకూ వాళ్లిద్దరినీ ఎందుకు అరెస్ట్ చేయలేదని సంధ్య నిలదీశారు. తన భర్తతో తాను మాట్లాడిన తర్వాతే చంపేశారని ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. ట్రంప్తో గోల్ఫ్ ఆడిన ధోనీ.. వీడియో వైరల్
టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni) క్రేజ్ మామూలుగా ఉండదు. ప్రపంచవ్యాప్తంగా అతడికి ఎంతోమంది అభిమానులున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)నకు కూడా మహీ అంటే ఇష్టమేనట. అందుకే ధోనీ అమెరికాలోనే ఉన్నాడని తెలుసుకునే అతడిని ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. వీరిద్దరూ కలిసి గోల్ఫ్ (Golf) గేమ్ కూడా ఆడారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. డ్రాగన్ కొరికిన యాపిల్..! రెండు రోజుల్లో రూ.16 లక్షల కోట్లు ఆవిరి..!
అమెరికా (USA) టెక్ దిగ్గజం యాపిల్(Apple)కు చైనా (China) సెగ గట్టిగానే తాకింది. ఈ సంస్థ షేర్లు కేవలం రెండు రోజుల్లో 200 బిలియన్ డాలర్ల (రూ.16.63 లక్షల కోట్లు) మేరకు విలువ కోల్పోయాయి. ఇది కంపెనీ మొత్తం విలువలో సుమారు ఆరు శాతానికి సమానం. యాపిల్కు ఉన్న అతిపెద్ద మార్కెట్లలో చైనా కూడా ఒకటి.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. ప్రపంచానికి షాకిచ్చిన ఉత్తరకొరియా.. న్యూక్లియర్ అటాక్ సబ్మెరైన్ తయారీ
కిమ్జోంగ్ ఉన్ (Kim Jong Un) నేతృత్వంలోని ఉత్తరకొరియా (North Korea) అణు కార్యక్రమాలను ఏమాత్రం ఆపడంలేదు. ఏకంగా ‘టాక్టికల్ న్యూక్లియర్ అటాక్ సబ్మెరైన్’ను తయారు చేసినట్లు నేడు ప్రకటించింది. రెండు రోజుల క్రితం ప్యాంగ్యాంగ్లో జరిగిన ఓ కార్యక్రమంలో కిమ్ స్వయంగా పాల్గొన్నారు. ఓ షిప్ యార్డ్లో సబ్మెరైన్ను పరిశీలిస్తున్న ఫొటోను విడుదల చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. ఇండస్ట్రీలో విషాదం.. ‘జైలర్’ నటుడు కన్నుమూత
సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ తమిళ డైరెక్టర్, నటుడు జి. మారిముత్తు (57) (G Marimuthu) కన్నుమూశారు. శుక్రవారం ఉదయం ఆయన గుండెపోటుతో మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆయన ఇప్పటి వరకూ వందకు పైగా చిత్రాల్లో నటించారు. ఇక చివరగా ఆయన రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన ‘జైలర్’లో కనిపించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. తుపాకీతో కాల్చుకుని హెడ్కానిస్టేబుల్ ఆత్మహత్య
కర్నూలులో హెడ్కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానిక లోకాయుక్త కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సత్యనారాయణ.. బాత్రూమ్లో తుపాకీతో కాల్చుకుని చనిపోయారు. గన్ శబ్దంతో సిబ్బంది వెళ్లి చూసేసరికి హెడ్కానిస్టేబుల్ రక్తపుమడుగులో పడి ఉన్నారు. సత్యనారాయణ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. ఆ దాడికి స్టార్లింక్ సేవలు ఇవ్వం.. మస్క్ నిర్ణయం..!
యుద్ధంతో దద్దరిల్లుతున్న ఉక్రెయిన్(Ukraine)కు స్పేస్ఎక్స్ యజమాని ఎలాన్ మస్క్ (Elon Musk) షాకిచ్చారు. తమకు అత్యవసరంగా స్టార్ లింక్ సేవలను అందించాలని ఉక్రెయిన్ చేసిన విజ్ఞప్తిని శుక్రవారం ఆయన తిరస్కరించారు. ఈ విజ్ఞప్తిని ఆమోదిస్తే యుద్ధానికి పెద్ద కవ్వింపు చర్యగా మారుతుందని.. అప్పుడు సంక్షోభం మరింత తీవ్రమవుతుందని వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. డబ్బు, భూమి కాదు.. ప్రజలే నా ఆస్తి: చంద్రబాబు
పేదవాళ్లను ఆర్థికంగాపైకి తీసుకొచ్చి.. వాళ్లను ధనికులను చేయాలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో నిర్వహించిన ‘మహిళలతో ప్రజావేదిక’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెదేపా అధికారంలోకి వచ్చాక విద్యుత్ ఛార్జీలు పెంచబోమని.. సౌర, పవన విద్యుత్ను తీసుకొస్తామని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. రావణుడు, కంసుడి వల్లే కాలేదు.. సనాతన ధర్మ వివాదంపై యోగి స్పందన
సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) స్పందించారు. ‘‘రావణుడి అహంకారంతో సనాతన ధర్మం అంతం కాలేదు.. కంసుడి గర్జనకు సనాతన ధర్మం చలించలేదు.. బాబర్, ఔరంగజేబుల దురాగతాలకు సనాతన ధర్మం నశించలేదు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. -
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో విచారణ కొనసాగుతోందని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మదనపల్లెలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో భూ కబ్జాలకు సంబంధించిన బాధితుల నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా అర్జీలు స్వీకరించారు. -
నిరుద్యోగులూ నిరసనలు వద్దు.. మీ అన్నగా అండగా ఉంటా: సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగ సమస్యే అత్యంత కీలకంగా మారిందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. -
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న వీరేంద్ర కుమార్ను మంత్రి నారా లోకేశ్ కాపాడారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బీమా సొమ్ము.. జీవితకాలం లేటు!
గుంటూరు నగర శివారులో పని చేసిన ప్రధానోపాధ్యాయుడొకరు రెండేళ్ల క్రితం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. తనకు రావాల్సిన ప్రభుత్వ జీవిత బీమా (ఏపీజీఎల్ఐ) సొమ్ము కోసం ఏడాదిన్నర క్రితం దరఖాస్తు చేసుకున్నారు -
విమాన గోపురం.. సువర్ణశోభితం
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన ఉండే విమాన గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు మరో కీలక అడుగుపడింది. దీనికి సంబంధించిన అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం నేడు ఇక్కడకు రానుంది. -
విశాఖ ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ
‘విశాఖపట్నం ప్రకృతి అందాలకు నిలయం. ఇక్కడ కొండలు, గుట్టలు, నదులు, సముద్రం అన్నీ భగవత్ ప్రసాదాలే. -
అసలే పేదరికం.. ఆపై వైకల్యం
విధి వక్రించి ప్రమాదానికి గురయ్యాడు.. ప్రాణాలతో బయటపడినా చికిత్స కోసం అప్పులు చేయాల్సి వచ్చింది.. వైకల్యం బారిన పడటంతో పని చేయలేని స్థితి. -
అంధ బాలికపై అమానుషం.. వెల్లువెత్తిన నిరసన
అంధ బాలికపై అమానుషం ఘటనలో నిందితుడిని మలక్పేట ఠాణా పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
-
కమీషన్ల కోసమే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారు: ఉత్తమ్
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన