Apple: డ్రాగన్ కొరికిన యాపిల్..! రెండు రోజుల్లో రూ.16 లక్షల కోట్లు ఆవిరి..!
డ్రాగన్ సెగకు యాపిల్ వణికిపోయింది. బీజింగ్ ఇటీవల తీసుకొన్న కొన్ని నిర్ణయాలతో వాల్స్ట్రీట్లో యాపిల్ షేర్లు బ్లడ్బాత్ చేశాయి. కొండంత కంపెనీ విలువ ఏకంగా 6శాతం కరిగిపోయింది.
ఇంటర్నెట్డెస్క్: అమెరికా (USA) టెక్ దిగ్గజం యాపిల్(Apple)కు చైనా (China) సెగ గట్టిగానే తాకింది. ఈ సంస్థ షేర్లు కేవలం రెండు రోజుల్లో 200 బిలియన్ డాలర్ల (రూ.16.63 లక్షల కోట్లు) మేరకు విలువ కోల్పోయాయి. ఇది కంపెనీ మొత్తం విలువలో సుమారు ఆరు శాతానికి సమానం. యాపిల్కు ఉన్న అతిపెద్ద మార్కెట్లలో చైనా కూడా ఒకటి. ఆ సంస్థ మొత్తం ఆదాయంలో 18 శాతం ఇక్కడి నుంచే వస్తుంది. దీంతోపాటు యాపిల్ ఫోన్ల ఉత్పత్తి సంస్థ ఫాక్స్కాన్కు చైనాలో అతిపెద్ద తయారీ యూనిట్ ఉంది. వాల్స్ట్రీట్లో అతిపెద్ద మార్కెట్ విలువ ఉన్న కంపెనీల్లో యాపిల్ కూడా ఒకటి. దీని మార్కెట్ విలువ 2.8 ట్రిలియన్ డాలర్లు.
ఇటీవల చైనాలో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ ఆఫీసు పనులకు యాపిల్ ఐఫోన్లు సహా ఇతర ఏ విదేశీ బ్రాండ్ ఫోన్లూ వాడొద్దని సూచించినట్లు వాల్స్ట్రీట్ జర్నల్ బాంబు పేల్చింది. ఇక ప్రభుత్వ ఆధీనంలోని కంపెనీల ఉద్యోగులు కూడా యాపిల్ ఫోన్లను తీసుకురాకూడదని ఆదేశించే అవకాశం ఉందటూ ఆ మర్నాడే బ్లూమ్బెర్గ్ వెల్లడించింది. సెప్టెంబర్ 12న ఐఫోన్-15 విడుదలకు ముందు వచ్చిన ఈ కథనాలు యాపిల్ పెట్టుబడిదారుల్లో భయాల్ని రేకెత్తించాయి. చైనా మాత్రం ఈ కథనాలపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.
బీజింగ్-వాషింగ్టన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితిలో తాజా కథనాలు ఆజ్యం పోశాయి. ఈ ఏడాది అమెరికా తన మిత్రదేశాలైన జపాన్, నెదర్లాండ్స్తో కలిసి చైనాకు చిప్ టెక్నాలజీ ఎగుమతులను నియంత్రించింది. దీనికి ప్రతిగా చైనా నుంచి పశ్చిమ దేశాల సెమీకండెక్టర్ పరిశ్రమకు సరఫరా అయ్యే రెండు కీలక పదార్థాల ఎగుమతులను డ్రాగన్ నిలువరించింది. దీంతో పాటు దేశీయ చిప్ పరిశ్రమను బలోపేతం చేయడానికి ఏకంగా 40 బిలియన్ డాలర్లను బీజింగ్ కేటాయించింది. అంతేకాదు.. ఇటీవల చైనాకు చెందిన హువావే సంస్థ అత్యాధునిక మేట్ 60 ప్రో ఫోన్ను ఆవిష్కరించింది. దీనిలో చైనాకు చెందిన ఎస్ఎంఐసీ తయారు చేసిన 5జీ కిరిన్ 9000ఎస్ ప్రాసెసర్ను వాడింది. ఈ పరిణామం చైనా టెక్నాలజీ పరిశ్రమలో మేలిమలుపుగా నిపుణులు పేర్కొంటున్నారు. ఇది కూడా యాపిల్ షేర్ల పతనానికి కారణమై ఉంటుందని చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐసీఐసీఐ లాభం రూ.11,672 కోట్లు
ఐసీఐసీఐ బ్యాంక్ ఆర్థిక ఫలితాలకు తక్కువ కేటాయింపులు కలిసివచ్చాయి. దీంతో మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఏకీకృత నికర లాభం 18.5 శాతం వృద్ధి చెంది రూ.11,672 కోట్లకు చేరుకుంది. -
ఒకే పాలసీలోనే అన్ని ధీమాలు
అందరికీ బీమా పాలసీలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్డీఏఐ) ఒక ప్రామాణిక పాలసీ ‘బీమా విస్తార్’ను అందుబాటులోకి తీసుకురానుంది. -
హైదరాబాద్లో కార్యాలయాల అద్దె లావాదేవీలు పెరిగాయ్
కార్పొరేట్ల నుంచి గిరాకీ స్థిరంగా ఉండటంతో ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో కార్యాలయాల అద్దె లావాదేవీలు 13 శాతం వృద్ధితో 1.34 కోట్ల చదరపు అడుగులకు చేరిందని స్థిరాస్తి సేవలను అందించే వెస్టియన్ తెలిపింది. -
మ్యూచువల్ ఫండ్ కొత్త పథకాల్లోకి రూ.66,364 కోట్లు
గత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు(ఏఎంసీ) 185 కొత్త పథకాలను(ఎన్ఎఫ్ఓ-న్యూ ఫండ్ ఆఫర్) విడుదల చేశాయి. -
వైద్య ఉత్పత్తుల రంగంలో భారత్ కీలకం
వైద్య ఉత్పత్తుల రంగంలో భారతదేశానికి ఎంతో ముఖ్యమైన బాధ్యత ఉన్నట్లు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) కమిషనర్ డాక్టర్ రాబర్ట్ కాలిఫ్ అన్నారు. -
ఆర్బీఎల్ బ్యాంక్ లాభంలో 30% వృద్ధి
జనవరి- మార్చి త్రైమాసికంలో ఆర్బీఎల్ బ్యాంక్ నికర లాభం 30 శాతం పెరిగి రూ.353 కోట్లకు చేరింది. -
యెస్ బ్యాంక్ లాభం రెట్టింపు
జనవరి- మార్చి త్రైమాసికంలో యెస్ బ్యాంక్ నికర లాభం స్టాండలోన్ పద్ధతిలో రూ.452 కోట్లుగా నమోదైంది. -
పూరీ విమానాశ్రయం ప్రాజెక్టు పోటీలో జీఎంఆర్, అదానీ గ్రూపు, ఫెయిర్ఫాక్స్?
ఒడిశా రాష్ట్రంలోని పూరీలో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించి, నిర్వహించే అవకాశం కోసం జీఎంఆర్, అదానీ గ్రూపు, విదేశీ సంస్థ అయిన ఫెయిర్ఫాక్స్ పోటీ పడుతున్నాయి. -
భారత్లో షార్ప్ సెమీ కండక్టర్ల యూనిట్
జపాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం షార్ప్ దేశంలో సెమీకండక్టర్ ఫ్యాబ్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సీకే బిర్లా గ్రూపు కంపెనీ, హెచ్ఐఎల్ లిమిటెడ్, పైపులు- ఫిట్టింగ్స్ వ్యాపారంలోకి విస్తరిస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
Amazon: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. మే 2 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుందని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
కొలువుల ఆశ చూపి కంబోడియాకు..
-
పేటలో ఒకసారి ఓడిన వారికి చోటులేనట్లే!
-
కిమ్ను తలదన్నే జగన్ సర్కారు... కిమ్మనకూడదు జనం నోరు..!
-
భారీ లక్ష్య ఛేదన కోసం మేం పరీక్ష పెట్టుకొన్నాం: హార్దిక్ పాండ్య
-
కాలేయానికి అధిక కొవ్వు ముప్పు.. వర్క్ ఫ్రం హోం తర్వాత పెరిగిన కేసులు