Kashmir: హిజ్బుల్ కమాండర్ ఇంటిపై ఎన్ఐఏ దాడులు
కశ్మీర్ నుంచి ఉగ్రనిధుల ప్రవాహంపై ఎన్ఐఏ తనిఖీలు చేపట్టింది. ఈ క్రమంలో హిజ్బుల్ కమాండర్ ఇంట్లో సోదాలు చేసింది.
ఇంటర్నెట్డెస్క్: కశ్మీర్(Kashmir)లోని ఉగ్ర నాయకుడి ఇంటిపై జాతీయ దర్యాప్తు సంస్థ దాడులు నిర్వహించింది. హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ ఒమర్ ఘనీపై ఉగ్రకార్యకలాపాలకు సంబంధించిన కేసులో ఎన్ఐఏ దర్యాప్తు చేపట్టింది. తాజాగా కుల్గామ్లోని అతడి ఇంటితో సహా ఐదు చోట్ల ఎన్ఐఏ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఎన్ఐఏ అధికారులతో పాటు సీఆర్పీఎఫ్ దళాలు కూడా పాల్గొన్నాయి.
అంజూ నిర్వాకం.. భర్త బెంచ్కు, సోదరుడు ఇంటికి..!
పాక్ సంస్థల నుంచి కశ్మీర్లోకి ఉగ్రనిధుల పంపిణీ కేసులో గత నెలలో జాతీయ దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేపట్టింది. అప్పట్లో షోపియాన్, పుల్వామా, కుల్గామ్లో దాడులు నిర్వహించింది. కశ్మీర్లోని హిజ్బుల్, జైషే, లష్కరే సంస్థలకు ఈ నిధులు చేరుతున్నట్లు ఎన్ఏఐ అనుమానిస్తోంది. గత కొంతకాలంగా పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన ది రెసిస్టెంట్ ఫ్రంట్, యూఎల్ జేఅండ్కే, ముజాహిద్దీన్ గజ్వా ఉల్ హింద్, కశ్మీర్ టైగర్స్, జమ్మూకశ్మీర్ ఫ్రీడమ్ ఫైటర్స్ వంటి సంస్థలపై జాతీయ దర్యాప్తు సంస్థ దృష్టిపెట్టింది. ఈ క్రమంలో శ్రీనగర్, బుద్గామ్, కుప్వారా, పుల్వామాలోని పలు ప్రాంతాల్లో రెండు రోజుల క్రితం కూడా తనిఖీలు జరిగాయి. ఈ క్రమంలో ఎన్జీవో జేకేసీసీఎస్ కార్యాలయాల్లో సోదాలు జరిగాయి. ఈ సంస్థ సమన్వయకర్త ఖుర్రం పర్వేజ్ను అరెస్టు చేశారు.
అదృశ్యమైన జవాన్ జాడ దొరికింది..
గత నెల 29న ఇంటి నుంచి కారులో బయటకు వెళ్లి.. అదృశ్యమైన ఆర్మీ జవాన్ జావెద్ అహ్మద్ జాడను కుల్గాం పోలీసులు గుర్తించారని నిన్న రాత్రి కశ్మీర్ జోన్ పోలీస్ ట్విటర్ హ్యాండిల్లో ప్రకటించింది. ఈ విషయాన్ని ఏడీజీపీ విజయ్ కుమార్ కూడా ధ్రువీకరించారు. జావెద్ను అదుపులోకి తీసుకొని వైద్య పరీక్షల నిమిత్తం తరలించినట్లు పేర్కొన్నారు. అతడి అదృశ్యం వెనుక ఉన్న కారణాలపై దర్యాప్తు నిర్వహించనున్నారు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకొనే సమయానికి ఒంటిపై గాయాలేమీ లేనట్లు తెలుస్తోంది. కొన్నేళ్లుగా సెలవులపై ఇళ్లకు వచ్చిన జవాన్లను అపహరించి హత్యలు చేస్తున్న ఘటనలు కశ్మీర్లో చోటు చేసుకొంటున్నాయి. దీంతో తాజాగా జావెద్ అదృశ్యం విషయం తెలియగానే భద్రతా దళాలు భారీ ఎత్తున గాలింపు ఆపరేషన్ చేపట్టాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సోరెన్ అభ్యర్థన నిరర్థకమని తేల్చిన సుప్రీం
నగదు అక్రమ చలామణి కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పెట్టుకున్న దరఖాస్తు నిరర్థకమని సుప్రీంకోర్టు శుక్రవారం తేల్చింది. -
అనర్హత వేటు సవాలు పిటిషన్ ఉపసంహరణ
హిమాచల్ప్రదేశ్కు చెందిన ఆరుగురు కాంగ్రెస్ మాజీ శాసనసభ్యులు తమపై పడిన అనర్హత వేటును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను శుక్రవారం ఉపసంహరించుకున్నారు. -
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా
గుజరాత్లోని ఓ కేంద్రంలో నీట్ నిర్వహణలో అక్రమాలు చోటుచేసుకున్నాయి. పంచమహల్ జిల్లాలోని గోధ్రాలో కొందరు అభ్యర్థులు మెరిట్ సాధించేలా ఓ పాఠశాల టీచర్ వారితో అనైతిక ఒప్పందం చేసుకున్నాడు. -
రాష్ట్రపతికి లేఖ రాస్తా
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనందబోస్ లైంగిక వేధింపుల అంశంలో తక్షణం జోక్యం చేసుకోవాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు లేఖ రాయనున్నట్లు బాధితురాలు, రాజ్భవన్ కాంట్రాక్టు ఉద్యోగిని శుక్రవారం తెలిపారు. -
పోలింగ్ శాతాలను 48 గంటల్లో ప్రచురించాలి
ప్రస్తుత లోక్సభ ఎన్నికల ప్రతి విడతలో పోలింగ్ ముగిసిన 48 గంటల్లోనే పోలింగ్ కేంద్రాలవారీ ఓటింగ్ శాతాలను ఎన్నికల సంఘం (ఈసీ) వెబ్సైట్లో ప్రచురించేలా చూడాలని సుప్రీంకోర్టును అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థ కోరింది. -
పాక్ను మన దేశం గౌరవించాలి
లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ నేతలు వరుసగా చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఇటీవల జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత శాం పిట్రోడా వివాదం చల్లారకముందే, ఇప్పుడు మరో కాంగ్రెస్ నేత మణి శంకర్ అయ్యర్ పాకిస్థాన్కు మద్దతుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
ఫిర్యాదుల ఉపసంహరణకు ఒత్తిడి తెస్తున్నారు
సందేశ్ఖాలీ వ్యవహారంపై పశ్చిమ బెంగాల్లో దుమారం కొనసాగుతోంది. ఈ అంశంలో జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) ఛైర్పర్సన్ రేఖా శర్మ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, రాజకీయ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని తృణమూల్ కాంగ్రెస్ తాజాగా ఆరోపించింది. -
కేజ్రీవాల్కు బెయిల్
సార్వత్రిక ఎన్నికలు పతాక స్థాయికి చేరిన వేళ దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు భారీ ఊరట లభించింది. -
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యం వ్యవహారం బయటకు రావడంలో ప్రజావేగుగా నిలిచిన భాజపా నేత దేవరాజే గౌడపై లైంగిక వేధింపుల కేసు నమోదయ్యింది.
తాజా వార్తలు (Latest News)
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!