భాజపా పాలనలోనే ముస్లింలకు అత్యంత ఆనందం, భద్రత: ఆర్‌ఎస్‌ఎస్‌

భాజపా పాలనలోనే ముస్లింలు అత్యంత ఆనందంగా, భద్రంగా ఉన్నారని... ఆర్‌ఎస్‌ఎస్‌ ముస్లిం విభాగం ‘ముస్లిం రాష్ట్రీయ మంచ్‌’ పేర్కొంది. కాంగ్రెస్‌, ఎస్పీ, బీఎస్పీలు వారిని కేవలం ఓటు బ్యాంకుగానే

Published : 15 Jan 2022 04:40 IST

దిల్లీ: భాజపా పాలనలోనే ముస్లింలు అత్యంత ఆనందంగా, భద్రంగా ఉన్నారని... ఆర్‌ఎస్‌ఎస్‌ ముస్లిం విభాగం ‘ముస్లిం రాష్ట్రీయ మంచ్‌’ పేర్కొంది. కాంగ్రెస్‌, ఎస్పీ, బీఎస్పీలు వారిని కేవలం ఓటు బ్యాంకుగానే చేశాయని విమర్శించింది. ఆ పార్టీల పాలనలో మైనార్టీలకు పేదరికం, నిరక్షరాస్యత, వెనుకబాటుతనంతో పాటు... ముమ్మారు తలాక్‌ వంటి వేధింపులే మిగిలాయని పేర్కొంది. దేశంలోని ముస్లింల అభ్యున్నతికి కేంద్ర, రాష్ట్రాల్లోని భాజపా ప్రభుత్వాలు అనేక పథకాలను ప్రవేశ పెట్టాయని వివరించింది. శాసనసభ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లోని ముస్లింలు భాజపాకే ఓటు వేయాలని అభ్యర్థించింది. ఈ మేరకు ముస్లిం రాష్ట్రీయ మంచ్‌ ‘నివేదన పత్రాన్ని’ ముద్రించి పంపిణీ చేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని