Road Accidents: రహదారులు రక్తసిక్తం.. గంటకు 19 మంది బలి!
దేశంలో ప్రతి గంటకు 53 రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా.. వీటిలో గంటకు 19 మంది చొప్పున ప్రాణాలు కోల్పోతున్నట్లు తాజా నివేదిక వెల్లడించింది.
దిల్లీ: దేశవ్యాప్తంగా ఏటా రోడ్డు ప్రమాదాలు (Road Accidents) పెరుగుతూనే ఉన్నాయి. గతేడాదిలోనే 4.6లక్షల ప్రమాదాలు చోటుచేసుకున్నట్లు తాజా నివేదిక వెల్లడించింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య 12శాతం పెరగడం ఆందోళనకర విషయం. మొత్తంగా దేశంలో ప్రతి గంటకు 53 రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా.. వీటిలో గంటకు 19 మంది చొప్పున ప్రాణాలు కోల్పోతున్నట్లు తాజా నివేదిక తెలిపింది.
‘భారత్లో రోడ్డు ప్రమాదాలు-2022’ సంబంధించి కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ (MoRTH) తాజా నివేదిక విడుదల చేసింది. 2022లో అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 4,61,312 ప్రమాదాలు చోటుచేసుకోగా.. అందులో 1,68,491 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 4,43,366 మంది గాయాలపాలయ్యారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ప్రమాదాలు 11.9శాతం పెరగగా.. మరణాలు 9.4శాతం పెరిగాయి. గాయపడిన వారి సంఖ్య 15.3శాతం పెరిగింది.
- 2021లో 1.53లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోగా.. 2022లో ఈ సంఖ్య 1.68లక్షలకు పెరిగింది.
- రోడ్డు ప్రమాదాలకు అతివేగమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. నమోదైన మొత్తం ప్రమాదాల్లో 71.2శాతం మరణాలు అతివేగం వల్లే చోటుచేసుకోగా.. రాంగ్ సైడ్లో ప్రయాణం వల్ల జరిగిన ప్రమాదాల్లో 5.4శాతం మంది మరణించారు.
- మొత్తం రోడ్డు ప్రమాదాల్లో జాతీయ రహదారుల్లో 32.9శాతం, రాష్ట్ర రహదారుల్లో 23.1శాతం, మరో 43.9శాతం ప్రమాదాలు ఇతర రహదారులపై జరిగాయి.
- బైక్ సంబంధిత ప్రమాదాలు తొలిస్థానంలో నిలిచాయి. కార్లు, జీపులు, టాక్సీ ప్రమాదాలు రెండోస్థానంలో ఉన్నాయి.
- రోడ్డు ప్రమాదాలు అధికంగా తమిళనాడులో (64 వేలు), తర్వాత మధ్యప్రదేశ్లో చోటుచేసుకున్నాయి. ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య మాత్రం ఉత్తర్ప్రదేశ్లో అధికంగా ఉంది.
- 67శాతం ప్రమాదాలు నేరుగా ఉన్న రోడ్లపైనే జరిగాయి. మూలమలుపులు, గుంతులు, వంపుల రోడ్లలో కలిపి మొత్తం 13.8శాతం ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.
- రోడ్డు ప్రమాద మరణాల్లో వెనకనుంచి వచ్చి ఢీకొట్టిన ఘటనల్లోనే అధికంగా (19.5) ఉన్నాయి. ఢీకొట్టి వెళ్లిపోవడం (Hit and Run) 18.1శాతం, తలకు గాయాలు (Head on Collission) 15.7శాతంగా ఉన్నాయి.
- ఈ ప్రమాదాల్లో 18-45 ఏళ్ల వయసున్న వారే అధికంగా బాధితులుగా మారుతున్నారు. 2022లో ప్రమాదాల్లో 66.5శాతం బాధితులు వీరే.
- ఇదిలాఉంటే, దేశంలో ఏటా సంభవిస్తోన్న రోడ్డు ప్రమాదాలు, వీటిలో మరణాల సంఖ్యను 2024 నాటికి సగానికి తగ్గించాలని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ లక్ష్యాన్ని నిర్దేశించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రైవేటు ఆస్తిని సమాజ ఉమ్మడి వనరుగా నిర్ణయిస్తే భవిష్యత్తుకు ఇంకేమీ మిగలదు
వ్యక్తుల ప్రైవేటు ఆస్తులను సమాజ ఉమ్మడి ఆర్థిక వనరులుగా పరిగణించడం చట్టబద్ధమేనా అనే న్యాయపరమైన అంశంపై తీర్పును సుప్రీంకోర్టు బుధవారం రిజర్వు చేసింది. -
వడగళ్లతో దెబ్బతిన్న రెక్కలు..విమానానికి తప్పిన ప్రమాదం
ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుంచి 170 మందితో బుధవారం మధ్నాహ్నం 1.45 గంటలకు దిల్లీకు ప్రయాణమైన విస్తారా ఎయిర్లైన్స్కు చెందిన విమానం టేకాఫ్ అయిన 10 నిమిషాలకే ప్రమాదానికి గురైంది. -
దిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం
దేశ రాజధాని ప్రాంతంలోని సుమారు 150 పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం బుధవారం తీవ్ర కలకలం రేపింది. -
10 దేశాల రాజకీయ పార్టీల ప్రతినిధులతో నడ్డా భేటీ
సార్వత్రిక ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు భాజపా ఆహ్వానంపై 10 దేశాల నుంచి 18 పార్టీల ప్రతినిధులు భారత్కు విచ్చేశారు. -
అలాగైతే హంతకులూ ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ప్రారంభిస్తారు!
అరెస్టైన రాజకీయ నాయకులకు వర్చువల్ విధానంలో ఎన్నికల ప్రచారం నిర్వహించుకునే అవకాశం కల్పించాలన్న వినతిపై దిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కొవిషీల్డ్ సురక్షితమైందే.. ఆందోళన వద్దు
తమ కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ సురక్షితమైందేనని ఆస్ట్రాజెనకా కంపెనీ పునరుద్ఘాటించింది. తమ టీకా తీసుకున్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. -
శని, ఆదివారాలూ మాకు తీరిక ఉండదు
సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు సెలవులు సుదీర్ఘంగా తీసుకుంటారంటూ చేసే విమర్శలపై అత్యున్నత న్యాయస్థానం ఘాటుగా స్పందించింది. -
‘స్మార్ట్’ అస్త్ర ప్రయోగం విజయవంతం!
సూపర్సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టోర్పిడో (స్మార్ట్) అనే ఆయుధ వ్యవస్థను భారత్ బుధవారం విజయవంతంగా పరీక్షించింది. -
డీప్ ఫేక్ వీడియోలపై వెంటనే చర్యలుండాలి
సార్వత్రిక ఎన్నికల వేళ డీప్ ఫేక్ వీడియోలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఇలాంటివి వెలుగు చూసిన వెంటనే జాప్యంలేకుండా వాటి వ్యాప్తిని అరికట్టేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాదుల బృందం దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. -
ఉష్ణోగ్రతలు గరిష్ఠ‘మే’! : ఐఎండీ
దేశంలోని పలు ప్రాంతాల్లో మే నెల సాధారణం కంటే ఎక్కువగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది. -
యాప్ ఆధారిత పెట్టుబడి పథకాలు.. దేశవ్యాప్తంగా సీబీఐ సోదాలు
క్రిప్టోకరెన్సీ మైనింగ్ యంత్రాల అద్దెలపై పెట్టుబడుల పేరుతో మోసపూరిత పథకాల ద్వారా ప్రజల్ని ఒక యాప్ మోసగిస్తోందనే ఆరోపణలమీద దేశంలో 30 చోట్ల సీబీఐ బలగాలు సోదాలు నిర్వహించాయి. -
సూరత్ ఏకగ్రీవ ఎన్నికపై అత్యవసర విచారణకు హైకోర్టు నిరాకరణ
సూరత్ లోక్సభ స్థానం నుంచి భాజపా అభ్యర్థి ముకేశ్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) పై అత్యవసర విచారణ జరిపేందుకు గుజరాత్ హైకోర్టు నిరాకరించింది. -
కొవిషీల్డ్పై వైద్య నిపుణుల కమిటీని ఏర్పాటు చేయండి
ఆస్ట్రాజెనకా కరోనా టీకాపై తాజా దుమారం నేపథ్యంలో కొవిషీల్డ్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలు, ముప్పు కారకాల అవకాశాలను పరిశీలించేందుకు వైద్య నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలంటూ బుధవారం సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. -
అయోధ్య రాముని సేవలో రాష్ట్రపతి
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అయోధ్య రాముడిని దర్శించుకున్నారు. బాలరాముడి ముందు మోకరిల్లి నమస్కరిస్తున్న చిత్రాలను ఆమె ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు.