Kushboo: సవాల్ విసిరే పాత్రలు చేయాలి
‘‘ఆడవాళ్లకు, మానవ సంబంధాలకు ప్రాధాన్యతనిస్తూ దర్శకుడు కిషోర్ ఈ కథ రాసుకున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్తో పాటు వినోదమూ చక్కగా కుదిరింది.
‘‘కుటుంబ సభ్యులతో కలిసి హాయిగా చూడగలిగే చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుంది’’ అన్నారు నటి ఖుష్బూ. ఆమె.. రాధిక శరత్కుమార్, ఊర్వశీ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాలో శర్వానంద్, రష్మిక నాయకానాయికలుగా నటించారు. తిరుమల కిషోర్ తెరకెక్కించారు. సుధాకర్ చెరుకూరి నిర్మాత. ఈ చిత్రం మార్చి 4న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు ఖుష్బూ.
‘‘ఆడవాళ్లకు, మానవ సంబంధాలకు ప్రాధాన్యతనిస్తూ దర్శకుడు కిషోర్ ఈ కథ రాసుకున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్తో పాటు వినోదమూ చక్కగా కుదిరింది. అందుకే కథ వినగానే కొత్తగా అనిపించి.. ఓకే చెప్పేశా. ఆడవాళ్లంటే ఎక్కువగా గ్లిజరిన్తోనే పని ఉంటుందని అనుకుంటారు. ఈ సినిమాతో ఆ భావన తప్పని తెలుస్తుంది. వాళ్లు ఎందుకు ఆనందంగా ఉండకూడదు అనే కోణంలో ఈ కథ సాగుతుంది’’.
‘‘ఈ చిత్రంలో హీరో పాత్రకు ఐదుగురు తల్లులు ఉంటారు. అయితే దీంట్లో నా పాత్ర ఎలా ఉంటుంది? అన్నది తెరపై చూడాల్సిందే. ఈ పాత్ర చేస్తున్నప్పుడు నేను చాలా ఎంజాయ్ చేశాను. రేపు సినిమా చూస్తూ.. ప్రేక్షకులు అలాగే ఆనందిస్తే చాలు. కిషోర్ లాంటి దర్శకుడితో పనిచేయడం ఏ నటికైనా సౌకర్యంగానే ఉంటుంది. సెట్లో తను టెన్షన్ పడిన సందర్భం ఒక్కసారీ చూడలేదు. శర్వా, రష్మిక.. ఇద్దరూ అద్భుతమైన యాక్టర్స్. శర్వా అయితే ఓ కుటుంబ సభ్యుడిలాగే అందర్నీ బాగా చూసుకునే వాడు’’.
‘‘నటిగా నాకు సవాల్ విసిరే పాత్రలు చేయాలని ఆకలితో ఉన్నా. ప్రస్తుతం తెలుగులో కొన్ని ఆసక్తికరమైన కథలు వింటున్నా. కొత్త దర్శకులు సరికొత్త ఆలోచనలతో వస్తున్నారు. నేనెప్పుడూ స్క్రిప్ట్నే నమ్ముతాను. దర్శకుడు కొత్త, పాత అన్నది పట్టించుకోను. స్క్రిప్ట్ బాగుంటే కొత్త వాళ్లతో చేయడానికైనా సిద్ధమే’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తలదించితే బానిసవి.. ఎత్తినావా నువ్వే బాదుషావి
‘‘తలదించినావా బానిసవి.. ఎత్తినావా బాదుషావి.. తలపొగరే నీ కిరీటమైతే భూతలమంతా నీదేరా’’ అంటూ తను నమ్మిన జీవిత సూత్రాన్ని అందరికీ బోధిస్తున్నాడు పుష్పరాజ్. -
అక్టోబరులో మొదలు!
‘కేజీఎఫ్’, ‘సలార్’ సినిమాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఆయన దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. -
రజనీ బయోపిక్ రానుందా?
సినిమాల్లో తమ అభిమాన హీరోలు చేసే యాక్షన్ హంగామాను చూస్తూ మురిసిపోతుంటారు ప్రేక్షకులు. -
కృష్ణమ్మ.. అందరూ మాట్లాడుకునే చిత్రమవుతుంది
‘‘సత్యదేవ్ అద్భుతమైన నటుడని అందరికీ తెలుసు. అలాంటి నటుడికి ఒక సరైన సినిమా పడితే చాలు ఊహించని స్టార్డమ్ వస్తుంది. -
మనం నవ్వుతుంటే ప్రేక్షకులు భయపడాలి!
‘‘ఆద్యంతం వినోదం పంచుతూనే మంచి సందేశమిచ్చే చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. పెళ్లి వెనకున్న ఓ సమస్యను.. దాని చుట్టూ జరుగుతున్న రూ.కోట్ల వ్యాపారాన్ని.. ఓ స్కామ్ను దీంట్లో వినోదాత్మకంగా చూపించాం. -
ఆ మార్పు నాలో విశ్వాసాన్ని నింపింది
‘ప్రేక్షకుల్లో వచ్చిన ఈ మార్పు నాలో విశ్వాసాన్ని పెంచుతుంది’ అని అంటోంది బాలీవుడ్ నాయిక తాప్సీ. -
సందేశమిచ్చే గాంధీ తాత చెట్టు
ప్రముఖ దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి బండ్రెడ్డి బాలనటిగా తెరకు పరిచయం కానుంది. -
ఇందులో అన్నీ ఉంటాయి
‘‘ప్రేక్షకులకు చాలా తృప్తినిచ్చే సినిమా ‘ప్రసన్న వదనం’. దీన్ని సీటు అంచున కూర్చొని ఆస్వాదిస్తారు. అదిరిపోయిందని చప్పట్లు కొడతారు’’ అన్నారు సుహాస్. -
స్విమ్మింగ్ పూల్లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మన ప్రేమలన్నీ శృంగారం కోసమే: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ నుంచి మరో వీడియో వచ్చేసింది. ప్రేమను ఉద్దేశించి పూరి మాట్లాడారు.