Anasuya: అందుకే హీరోయిన్ అవకాశాలు కోల్పోయాను: అనసూయ

గతంతో పోలిస్తే ఇప్పుడు తనలో ఎంతో మార్పు వచ్చిందని నటి అనసూయ (Anasuya) అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

Updated : 04 Nov 2023 12:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకుని ఇప్పుడు వరుస సినిమాలతో అలరిస్తున్నారు నటి అనసూయ (Anasuya). తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను ‘అత్తారింటికి దారేది’ సినిమాలోని పాటలో నటించకపోవడానికి గల కారణాన్ని వివరించారు. అలాగే ఒకప్పటి కంటే ఇప్పుడు తనలో ఎంతో మార్పు వచ్చిందన్నారు.

‘‘అత్తారింటికి దారేది’ సినిమాలో ఒక పాటలో అవకాశం వచ్చింది. అందులో ఇంకా చాలా మంది హీరోయిన్స్‌ ఉన్నారని నేను చేయనని చెప్పా. గుంపులో ఒకరిగా నటించడం నాకు నచ్చదు. నాకంటూ ప్రత్యేకత ఉండాలని కోరుకున్నా. అందుకే ఆ పాటకు నో చెప్పా. ఆ అవకాశాన్ని తిరస్కరించినందుకు చాలా మంది నన్ను విమర్శించారు. నేను నో చెప్పడం తప్పు కాదు.. కానీ, నో చెప్పే విధానం తప్పేమో అని నాకు అనిపించింది. మొదటి నుంచి ముక్కుసూటి మనిషిని. అందుకే కొంచెం కఠినంగా చెప్పాను. ఆ పాటలో నటించనందుకు ట్విటర్‌లో పెద్ద వార్‌ జరిగింది. దీంతో త్రివిక్రమ్‌కు సారీ చెప్పాను’’ అని అనసూయ అన్నారు. 

తెలుగు అబ్బాయితో పెళ్లి వార్తలపై స్పందించిన మృణాల్‌.. ఏమన్నారంటే?

‘‘షూటింగ్స్‌లో నా పని నేను చూసుకుని వెళ్తుంటాను. సినిమా అయ్యాక జరిగే పార్టీలకు చాలా దూరంగా ఉంటా. ఈ కారణంగానే హీరోయిన్ అవకాశాలను కూడా కోల్పోయాను. అలా పార్టీలకు వెళ్తేనే అవకాశాలు వస్తాయంటే నేను వాటిని ప్రోత్సహించను.  ఒకప్పుడు ఏదైనా అవకాశం వస్తే.. అందులో నాకే ప్రాధాన్యం ఉండాలనుకున్నా. కానీ, ఇప్పుడు నాలో మార్పు వచ్చింది. ఎలాంటి పాత్రలోనైనా నా నటనతో గుర్తింపు తెచ్చుకోగలనని నమ్మకం కలిగింది’’ అని చెప్పారు. ఇక సోషల్ మీడియా గురించి మాట్లాడుతూ.. ‘‘ప్రతి మహిళా స్వేచ్ఛ కోరుకుంటుంది. నా భర్త నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. సోషల్ మీడియాలో కామెంట్స్‌ పెట్టే వాళ్ల ఇళ్లలో మహిళలను తలచుకుంటే నాకు జాలి వేస్తుంటుంది. విమర్శించేవాళ్లు ఎన్ని అంటున్నా..  నా పోస్ట్‌లు చూసి స్ఫూర్తిపొందే వాళ్లు చాలా మంది ఉంటారు’’ అని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని