Gangs of godavari: పాట క్లాస్‌.. సినిమా మాస్‌

విష్వక్‌సేన్‌ కథానాయకుడిగా...  కృష్ణచైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’. నేహాశెట్టి కథానాయిక. అంజలి కీలక పాత్ర పోషిస్తున్నారు.

Updated : 17 Aug 2023 14:25 IST

విష్వక్‌సేన్‌ కథానాయకుడిగా...  కృష్ణచైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’. నేహాశెట్టి కథానాయిక. అంజలి కీలక పాత్ర పోషిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డిసెంబర్‌ 8న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలోని ‘సుట్టంలా సూసి...’ అంటూ సాగే పాటని విడుదల చేశారు. యువన్‌ శంకర్‌ రాజా స్వరకల్పనలోని ఈ పాటని శ్రీహర్ష ఈమని రచించగా, అనురాగ్‌ కులకర్ణి ఆలపించారు. పాట విడుదల సందర్భంగా విష్వక్‌సేన్‌ మాట్లాడుతూ ‘‘ఊర మాస్‌ సినిమా చేయాలనే కోరిక ఎప్పట్నుంచో ఉండేది. తొలిసారి లుంగీ కట్టి ఈ సినిమాలో కనిపిస్తా. ఈ పాట సాఫ్ట్‌గా క్లాస్‌గా వినిపిస్తున్నా... సినిమా మాత్రం మాస్‌గా ఉంటుంది. యువన్‌ శంకర్‌ రాజాకి నేను పెద్ద అభిమానిని. ఆయనతో కలిసి పనిచేయాలనే కల ఈ సినిమాతో నెరవేరింది’’ అన్నారు. నేహాశెట్టి మాట్లాడుతూ ‘‘సితార సంస్థలో ‘డీజే టిల్లు’ చేశా. ఈ సినిమాతో మరో అవకాశం దక్కింది. విష్వక్‌సేన్‌, యువన్‌, కృష్ణచైతన్య కలయికలో సినిమా చేయడం మరింత ప్రత్యేకం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్రబృందం పాల్గొంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని