Raashii Khanna: గోద్రా రైలులోని రహస్యాలు బయటపడేది ఆ రోజే

గోద్రా రైలు దహనకాండ ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్‌’. బాలీవుడ్‌ కథానాయకుడు విక్రాంత్‌ మాస్సే, రాశీ ఖన్నా జంటగా నటిస్తున్నారు.

Updated : 24 Apr 2024 12:02 IST

గోద్రా రైలు దహనకాండ ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్‌’. బాలీవుడ్‌ కథానాయకుడు విక్రాంత్‌ మాస్సే, రాశీ ఖన్నా జంటగా నటిస్తున్నారు. రంజన్‌ చందేల్‌ తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకున్నట్లు తెలిపింది చిత్రబృందం. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని తెలుపుతూ.. సామాజిక మాధ్యమాల వేదికగా ఓ ఫొటోను పంచుకుంది రాశి. ‘‘ఎంతో మంది జీవితాలను తలకిందులుగా చేసిన సంఘటనలోని రహస్యాలను, నిజానిజాల్ని ఆగస్టు 2న విడుదల కాబోతున్న ‘ది సబర్మతీ రిపోర్ట్‌’లో చూడడానికి సిద్ధంగా ఉండండి’’ అని వ్యాఖ్యల్ని జోడించింది. 2002 ఫిబ్రవరి 27న జరిగిన ఈ దుర్ఘటనలో 59మంది ప్రాణాలను కోల్పోయారు. ఇందులో జర్నలిస్ట్‌ సమర్‌ కుమార్‌ పాత్రలో కనిపించనున్నాడు విక్రాంత్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని