Kiara Advani: తొమ్మిదేళ్లైనా కొత్తగానే ఉంది

‘వసుమతి...వసుమతి’ అంటూ మహేశ్‌బాబు తన వెంట తిరిగేలా చేసిన అందం కియారా అడ్వాణీది. ‘భరత్‌ అనే నేను’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కియార ఆ తర్వాత రామ్‌చరణ్‌తో ‘వినయ విధేయ రామ’లో ‘సీత’గా నటించి మెప్పించింది.

Updated : 15 Jun 2023 14:11 IST

‘వసుమతి...వసుమతి’ అంటూ మహేశ్‌బాబు తన వెంట తిరిగేలా చేసిన అందం కియారా అడ్వాణీ (Kiara Advani)ది. ‘భరత్‌ అనే నేను’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కియార ఆ తర్వాత రామ్‌చరణ్‌తో ‘వినయ విధేయ రామ’లో ‘సీత’గా నటించి మెప్పించింది. ఇప్పుడు మరోసారి ఆయన సరసనే ‘గేమ్‌ ఛేంజర్‌’లో మెరిపించడానికి ముస్తాబవుతోంది. హిందీ సినిమాలతో సినీ ప్రయాణం మొదలుపెట్టిన ఆమె పరిశ్రమకి వచ్చి తొమ్మిదేళ్లు అయిపోయాయి. ఈ సందర్భంగా ఓ లేఖను అభిమానులతో పంచుకుంది కియార. ‘నా ప్రియమైన శ్రేయోభిలాషులకు.....నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ తొమ్మిదేళ్లు నాకు మీ ప్రేమను పంచినందుకు చాలా సంతోషంగా ఉంది. మీ జీవితంలో, మీ కుటుంబంలో నేను ఒక భాగం కావడం ఆనందంగా ఉంది. నా కష్టసుఖాలలో తోడుగా ఉండి, నటిగా ఎదగడానికి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్యూ.... విజయవంతంగా తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్నా కానీ ఇప్పుడే మళ్లీ కొత్త జీవితాన్ని మొదలుపెట్టినట్లు అనిపిస్తుంది. మీ అందరినీ మరింత అలరించడానికి నేను మీ ముందుకు వస్తాను. నటన పరంగా ఇంకా నేర్చుకొని గొప్ప స్థాయికి వెళతాను’’ అని అందులో రాసింది. ప్రస్తుతం ఆమె కార్తీక్‌ ఆర్యన్‌తో నటించిన ‘సత్యప్రేమ్‌ కీ కథ’ చిత్రం నిర్మాణానంతర పనుల్లో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని