Cinema News: సంక్షిప్త వార్తలు (2)
‘నీలో స్వరాలకే నేనే సంగీతమై.. నువ్వే వదిలేసిన పాటై సాగేనా...’ అంటూ ఓ జంట ప్రేమ పాట పాడుకుంది. మరి ఆ జంట కథేమిటో తెలియాలంటే ‘18 పేజిస్’ చూడాల్సిందే. నిఖిల్ సిద్ధార్థ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రమిది.
ఏ కన్నుకి ఏ స్వప్నమో...
‘నీలో స్వరాలకే నేనే సంగీతమై.. నువ్వే వదిలేసిన పాటై సాగేనా...’ అంటూ ఓ జంట ప్రేమ పాట పాడుకుంది. మరి ఆ జంట కథేమిటో తెలియాలంటే ‘18 పేజిస్’ (18 Pages) చూడాల్సిందే. నిఖిల్ సిద్ధార్థ (Nikhil), అనుపమ పరమేశ్వరన్ (Anupama parameswaran) జంటగా నటించిన చిత్రమిది. పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్తో కలిసి జీఏ 2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పకులు. డిసెంబరు 23న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలోని ‘నన్నయ్య రాసిన...’ పాటని మంగళవారం విడుదల చేశారు. ‘ఏ కన్నుకి ఏ స్వప్నమో ఏ రెప్పలైన తెలిపేనా... ’ అంటూ సాగుతుంది ఈ పాట. గోపీసుందర్ స్వరకల్పనలో, పృథ్వీచంద్ర, సితార కృష్ణకుమార్ ఆలపించిన ఈ గీతాన్ని శ్రీమణి రచించారు. అగ్ర దర్శకుడు సుకుమార్ రచించిన కథతో రూపొందుతున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: వసంత్, కూర్పు: నవీన్ నూలి, కళ: రమణ వంక, రచన: శ్రీకాంత్ విస్సా.
టీచర్ పోరాటం
ఆమె ఓ టీచర్...ఓ పక్క వృత్తి జీవితాన్ని, మరో పక్క కుటుంబ జీవితాన్ని సంతోషంగా గడిపేస్తుంటుంది. కానీ అనుకోకుండా ఆమె జీవితం ఓ కొత్త మలుపు తీసుకుంటుంది. ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వీడియో ఆన్లైన్ మోసం కారణంగా బయటకు వస్తుంది. దాంతో ఆ టీచర్ సమస్యల్లో చిక్కుకుంటుంది. ఇక తన లైఫ్ ముగిసింది అనుకోకుండా న్యాయం కోసం పోరాడుతుంది? దాని కోసం ఏం చేసింది? చివరికి కథ ఎలా ముగిసింది? అనేది ‘ది టీచర్’ (The Teacher) సినిమాలో చూడాల్సిందే. అందాల తార అమలా పాల్ (Amala Paul) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమిది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలై ఆకట్టుకుంటోంది. వివేక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబరు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?
కథానాయకుడు రామ్ త్వరలో ‘డబుల్ ఇస్మార్ట్’తో ప్రేక్షకుల్ని పలకరించనున్నారు. ఈ సినిమా ప్రస్తుతం ముగింపు దశ చిత్రీకరణలో ఉంది. కానీ, దీని తర్వాత ఆయన చేయనున్న చిత్రమేదన్నది ఇంకా స్పష్టత ఇవ్వలేదు. -
పూజ సరికొత్త ప్రయాణం..
దక్షిణాదితోపాటు.. ఇటు బాలీవుడ్లోనూ ఇప్పటికే తానెంటో నిరూపించుకుంది కథానాయిక పూజా హెగ్డే. గతేడాది ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ చిత్రంతోనే సరిపెట్టుకున్న ఈ భామ.. ఇప్పుడు ఆ లోటును తీర్చడానికి వరుస సినిమాలతో తెరపై సందడి చేయడానికి ముస్తాబవుతోంది. -
తెరపైనా ఫిల్మ్ స్టారే!
‘ఖో గయే హమ్ కహా’తో గతేడాదికి మంచి ముగింపే పలికింది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. ఈ ఏడాది ‘కంట్రోల్’, ‘శంకర’ లాంటి చిత్రాలతో బిజీగా ఉన్న ఈమె మరో చిత్రంలో కీలక పాత్రలో మెరవనుంది. -
ఇద్దరు నాయికలతో..!
వెంకటేశ్ కొత్త చిత్రం కోసం సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. స్క్రిప్ట్ ఇప్పటికే సిద్ధం కాగా... సంగీతం పనులూ ఊపందుకున్నట్టు తెలుస్తోంది. జులైలో సినిమాని పట్టాలెక్కించనున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే పేరు ప్రచారంలో ఉంది. -
తలపడితే వదలడే.. తన పేరు విజయుడే
‘రాయన్’తో థియేటర్లలో సందడి చేయనున్నారు కథానాయకుడు ధనుష్. ఇది ఆయన స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాని ఏషియన్ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పీ సంస్థ తెలుగులో విడుదల చేయనుంది. -
‘డార్లింగ్’ పూర్తయింది
‘డార్లింగ్’ అంటూ ప్రేక్షకుల్ని పలకరించనుంది నభా నటేష్. ఆమె.. ప్రియదర్శి జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అశ్విన్ రామ్ తెరకెక్కిస్తున్నారు. కె.నిరంజన్ రెడ్డి నిర్మాత. అనన్య నాగళ్ల కీలక పాత్ర పోషిస్తోంది. -
మనోహరం... రామనామం
ప్రతి పౌరుడూ రాముడిలా బతకాలని...ధర్మబద్ధంగా మెలగాలని చెప్పే కథతోనే ‘రామ జన్మభూమి’ చిత్రాన్ని తెరకెక్కించినట్టు వి.సముద్ర తెలిపారు. ఆయన దర్శకనిర్మాతగా...జై సిద్ధార్థ్, శ్రీరాధా ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రమిది. -
కేన్స్ చిత్రోత్సవంలో ‘భారత్ పర్వ్’ వేడుక
ఎన్నో ప్రఖ్యాత వేదికలపై ఇప్పటికే మన దేశ గొప్పతనాన్ని చాటి చెప్పింది సినిమా రంగం. ఇప్పుడు తొలిసారి భారతదేశం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘భారత్ పర్వ్’ పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. -
‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మొదలైంది
అజిత్ కథానాయకుడిగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ద్విభాషా చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. అధిక్ రవిచంద్రన్ తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన ఈ సినిమా.. శుక్రవారం నుంచి హైదరాబాద్లో చిత్రీకరణ ప్రారంభించుకుంది. -
కాండ్రకోట రహస్యం
వరుణ్సందేశ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘నింద’. కాండ్రకోట మిస్టరీ... అనేది ఉపశీర్షిక. అనీ, తనికెళ్లభరణి, భద్రం, సూర్య కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాజేశ్ జగన్నాథం స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. -
ప్రమోషన్స్లో జాన్వీ కపూర్.. స్టైలిష్ డ్రెస్సులో మానుషి చిల్లర్
సినీ తారలు సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!