Satyadev: ‘గాడ్సే’.. వచ్చేది ఆరోజే

సత్యదేవ్‌ కథానాయకుడిగా గోపీ గణేష్‌ తెరకెక్కించిన యాక్షన్‌ సినిమా ‘గాడ్సే’. ‘బ్లఫ్‌ మాస్టర్‌’ తర్వాత ఈ ఇద్దరి కలయికలో వస్తున్న రెండో చిత్రమిది. సి.కల్యాణ్‌ నిర్మించారు. ఐశ్వర్య లక్ష్మి కథానాయిక. ఈ సినిమాని మే 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

Updated : 14 Apr 2022 09:16 IST

త్యదేవ్‌ కథానాయకుడిగా గోపీ గణేష్‌ తెరకెక్కించిన యాక్షన్‌ సినిమా ‘గాడ్సే’. ‘బ్లఫ్‌ మాస్టర్‌’ తర్వాత ఈ ఇద్దరి కలయికలో వస్తున్న రెండో చిత్రమిది. సి.కల్యాణ్‌ నిర్మించారు. ఐశ్వర్య లక్ష్మి కథానాయిక. ఈ సినిమాని మే 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సామాజిక మాధ్యమాల వేదికగా ఓ కొత్త పోస్టర్‌ను పంచుకుంది. అందులో సత్యదేవ్‌ రెండు తుపాకులు పట్టుకొని సీరియస్‌గా చూస్తూ ఆసక్తికరంగా కనిపిస్తున్నారు. ‘‘అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే చిత్రమిది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ఇందులో సత్యదేవ్‌ చాలా కొత్తగా కనిపిస్తారు. నిర్మాణానంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి సునీల్‌ కశ్యప్‌ స్వరాలందించారు. ఎస్‌.సురేష్‌ ఛాయా   గ్రాహకుడిగా వ్యవహరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని