Ankitha: అందుకే నటనకు దూరం కావాల్సి వచ్చింది: ‘సింహాద్రి’ హీరోయిన్
సినిమాలకు ఎందుకు దూరంకావాల్సి వచ్చిందో ‘సింహాద్రి’ ఫేమ్ అంకిత ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఎందుకంటే?
ఇంటర్నెట్ డెస్క్: ‘లాహిరి లాహిరి లాహిరిలో’ (Lahiri Lahiri Lahirilo) సినిమాతో తెరంగేట్రం చేసి, ప్రేక్షకులను తొలి ప్రయత్నంలోనే విశేషంగా ఆకట్టుకున్న నటి అంకిత (Ankitha). ఆ తర్వాత ‘ధనలక్ష్మీ.. ఐ లవ్ యూ’, ‘ప్రేమలో పావని కల్యాణ్’ చిత్రాల్లో సందడి చేసి, ‘సింహాద్రి’ (Simhadri)తో ఉర్రూతలూగించారు. ఆ సినిమా ఘన విజయం అందుకోవడంతో ఆమె కెరీర్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోతుందని అంతా అనుకున్నారు. కానీ, అలా జరగలేదు. దానికి గల కారణాన్ని అంకిత ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘‘విజయేంద్రవర్మ’ సినిమాపై నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నా. అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఆ చిత్రం సక్సెస్ అయి ఉంటే నేను ఇండస్ట్రీలో ఉండేదాన్ని’’ అని అభిప్రాయం వ్యక్తం చేశారు. చిత్ర పరిశ్రమలో సక్సెస్ ఉంటేనే కెరీర్ సాగుతుందంటూ నాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు.
వ్యక్తిగత విషయాలనూ ఆమె పంచుకున్నారు. హీరో నవదీప్తో తనకు ఎలాంటి విభేదాల్లేవని స్పష్టం చేశారు. నవదీప్ సరసన నటించిన చిత్రంతోపాటు తమిళంలో మరో సినిమా ఒకే సమయంలో చిత్రీకరణ సాగడంతో ఒత్తిడి ఫీలయ్యానని, ఆ క్రమంలో అసహనానికి లోనవడమే తప్ప ఎలాంటి గొడవ జరగలేదన్నారు. ఆర్తి అగర్వాల్, ఉదయ్ కిరణ్ మంచి తనకు స్నేహితులని తెలిపారు. వారు ఇప్పుడు లేకపోవడం బాధాకరమన్నారు. గతేడాది హీరో అల్లు అర్జున్ (Allu Arjun)ని కలిశానని చెప్పారు. ఎన్టీఆర్తో సోషల్ మీడియా వేదికగా టచ్లో ఉన్నానని, ఆయనతోపాటు తనకు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అంటే అభిమానమన్నారు. మంచి అవకాశం వస్తే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సిద్ధమని తెలిపారు.
ముంబయికి చెందిన అంకితకు వ్యాపారవేత్త విశాల్ జగపతితో 2016లో వివాహమైంది. అనంతరం, వారు న్యూజెర్సీలో స్థిరపడ్డారు. ఈ దంపతులకు ఇద్దరు అబ్బాయిలు. బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ‘విజయేంద్రవర్మ’ 2004లో విడుదలైంది. ఆ తర్వాత ఆమె.. నవదీప్ ‘మనసు మాట వినదు’, గోపీచంద్ ‘రారాజు’ సినిమాల్లో నటించారు. రవితేజ ‘ఖతర్నాక్’లో ఓ గీతంతో అలరించారు. 2009 నుంచి చిత్ర పరిశ్రమకు దూరమయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పిల్లల జీవితాన్ని ఎవరు రిస్క్లో పెట్టమన్నారు: రష్మి
తాండూరులో చిన్నారిపై పెంపుడు కుక్క దాడి చేసిన ఘటనకు సంబంధించి యాంకర్ రష్మిని ఉద్దేశిస్తూ ఎక్స్ వేదికగా పెట్టిన పోస్టులకు ఆమె తిరిగి సమాధానం ఇచ్చారు. -
రూ.కోటి విరాళమిచ్చిన ధనుష్.. దేనికోసమంటే!
హీరో ధనుష్ (Dhanush) రూ.కోటి విరాళం అందించారు. -
హాలీవుడ్ ‘డ్యూన్..’ వెబ్ సిరీస్లో టబు.. ఏపాత్రలో అంటే!
ప్రముఖ నటి టబు హాలీవుడ్ వెబ్ సిరీస్లో కీలకపాత్రలో నటించనున్నారు. -
చరణ్ వల్లే ఆ డిప్రెషన్ నుంచి బయటపడ్డా: ఉపాసన
రామ్ చరణ్ వల్లే ప్రసవానంతర డిప్రెషన్ నుంచి బయటపడినట్లు ఉపాసన తెలిపారు. -
రష్మిక ‘బీచ్’ ఫొటోషూట్.. అదాశర్మ సినిమా ముచ్చట!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఫొటోలు మీకోసం.. -
గత ఎన్నికల్లో మౌనవ్రతం అని చెప్పానేమో..!: చిరంజీవి ఫన్నీ కామెంట్స్
తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సంబంధిత ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. -
నీ ఓటు ఎటువైపు పోవాలో నీ చేతుల్లోనే ఉంది.. ఓటు విలువ చెప్పిన హీరోలు
పలు సినిమాల్లోనూ ఓటు హక్కు ప్రయోజనాన్ని తెలియజేస్తూ వచ్చిన సన్నివేశాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల వేదికగా ట్రెండ్ అవుతున్నాయి. -
నంద్యాల పర్యటనపై క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్
ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకే నంద్యాల వెళ్లానని సినీ నటుడు అల్లు అర్జున్ తెలిపారు. -
క్లీంకారకు ఉపాసన థ్యాంక్స్.. ఒకే ఫ్రేమ్లో అక్కినేని హీరోలు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న విశేషాలివీ.. -
నాకు తప్ప వారందరికీ వివాహమైంది: సోనాక్షి సిన్హా
తాను పాల్గొన్న ఓ కార్యక్రమంలో పెళ్లి ప్రస్తావన రాగా సోనాక్షి సిన్హా స్పందించారు. -
అవును.. వారి స్టైల్ కాపీ చేశా: నెటిజన్ ప్రశ్నపై జాన్వీ కపూర్
తన ఫ్యాషన్ గురించి ఓ నెటిజన్ జాన్వీని ప్రశ్నించగా ఆమె స్పందించారు. -
ఒక్క ఓటేనన్న ఉదాసీనత వద్దు.. మీ ఓటే చరిత్రను మార్చేయొచ్చు!
ప్రతి ఒక్క ఓటు ముఖ్యమైనదే అంటూ ‘సర్కార్’లో ఓటు ప్రాధాన్యం గురించి విజయ్ చెప్పిన డైలాగ్ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. -
‘త్రినయని’ సీరియల్ నటి పవిత్రా జయరాం దుర్మరణం
trinayani serial actress died: బుల్లితెర నటి పవిత్రా జయరాం మహబూబ్నగర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు -
ఒక్క రోజేంటి?.. ఈ జీవితమే అమ్మది: చిరంజీవి
మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు సినీ తారలు సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్లు పెట్టారు. -
ఖుషీ-జాన్వీకపూర్ల ఉత్సాహం.. చీరకట్టులో దివి హొయలు
సోషల్మీడియా వేదికగా సినీతారలు పంచుకున్న తాజా అప్డేట్లు మీకోసం.. -
ఆ సన్నివేశం కోసం నిజంగానే మద్యం తాగాను: రిచా చద్దా
‘హీరామండి’లో ఒక సన్నివేశం కోసం నిజంగానే మద్యం తాగినట్లు రిచా చద్దా తెలిపారు. -
నాకు కాబోయే వాడు ఇలా ఉండాలి: కృతి సనన్
తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో కృతి సనన్ వివరించారు. -
ప్రమోషన్స్లో జాన్వీ కపూర్.. స్టైలిష్ డ్రెస్సులో మానుషి చిల్లర్
సినీ తారలు సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
అందుకే సెల్ఫీ అడిగితే పారిపోతా: ఫహద్ ఫాజిల్
ఎవరైనా సెల్ఫీ అడిగితే తాను పారిపోతానని నటుడు ఫహద్ ఫాజిల్ పేర్కొన్నారు. -
‘హీరామండి’ షూటింగ్లో డిప్రెషన్లోకి వెళ్లా: మనీషా కొయిరాల
‘హిరామండి’ షూటింగ్ సమయంలో డిప్రెషన్లోకి వెళ్లినట్లు మనీషా కొయిరాల తెలిపారు. -
విజయ్ దేవరకొండ-రష్మికల జోడి మరోసారి మెరవనుందా!
విజయ్ దేవరకొండ-రష్మిక జోడి మరోసారి స్క్రీన్పై మెరవనున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
వెజ్ థాలీ ధర పెరిగింది.. నాన్ వెజ్ తగ్గింది.. ఎందుకిలా?
-
స్వాతి మాలీవాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ నేత
-
జగన్ విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి
-
దిల్లీ మద్యం కేసులో ఆప్ను నిందితుల జాబితాలో చేరుస్తాం: ఈడీ
-
సార్వత్రిక ఎన్నికల వేళ.. సరిహద్దులో ‘పాక్’ డ్రోన్ల కలకలం!
-
అదే ఐపీఎల్ను మార్చేసింది..: రవిశాస్త్రి