Tollywood: పేరు ఊరిస్తోంది
విజయవంతమైన కలయికల్ని పునరావృతం చేయడమన్నది చిత్రసీమలో తరచూ కనిపిస్తూనే ఉంటుంది. ఈ తరహావి ప్రేక్షకుల్లో అంచనాల్ని అమాంతం పెంచేస్తుంటాయి. అంతేకాదు ఇవి మార్కెట్ను బలంగా ప్రభావితం చేస్తుంటాయి.
విజయవంతమైన కలయికల్ని పునరావృతం చేయడమన్నది చిత్రసీమలో తరచూ కనిపిస్తూనే ఉంటుంది. ఈ తరహావి ప్రేక్షకుల్లో అంచనాల్ని అమాంతం పెంచేస్తుంటాయి. అంతేకాదు ఇవి మార్కెట్ను బలంగా ప్రభావితం చేస్తుంటాయి. అయితే ఇప్పుడీ ట్రెండ్ సినిమా పేర్ల విషయంలోనూ కనిపిస్తోంది. హిట్టు కలయికల తరహాలోనే క్లాసిక్ టైటిల్స్ను పునరావృతం చేయడమన్నది సినీప్రియుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. మరి ఇప్పుడలా విజయవంతమైన సినిమా పేర్లతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్న తారలెవరు? వారి చిత్ర విశేషాలేంటి?
సినిమాకి ప్రధాన ప్రచార అస్త్రంగా నిలిచే వాటిలో పేరు కూడా ఒకటి. ఏ చిత్రానికైనా సగం ఆకర్షణ దాని పేరుతోనే వస్తుంది. అందుకే దర్శక నిర్మాతలు ఆ పేరు ఖరారు చేయడం కోసం తెర వెనుక బోలెడంత కసరత్తు చేస్తుంటారు. ఈ క్రమంలోనే సినీ ప్రియుల్ని ఆకర్షించేందుకు విజయవంతమైన సినిమా పేర్లను పునరావృతం చేసి ఊరించే ప్రయత్నం చేస్తుంటారు. నిజానికి ఇలా క్లాసిక్ టైటిల్స్తో అలరించడమన్నది చిత్రసీమకు కొత్తేమీ కాదు. ‘మల్లీశ్వరి’, ‘మిస్సమ్మ’, ‘దేవదాసు’ల నుంచి మొదలు ‘గీతాంజలి’, ‘తొలిప్రేమ’, ‘ఖుషి’ వరకు ఎన్నో విజయవంతమైన చిత్రాల పేర్లను ఈతరం తారలు తమ సినిమాలతో పునరావృతం చేశారు. వీటిలో చాలా చిత్రాలు బాక్సాఫీస్ ముందు సత్తా చాటి ఆ పేరుకున్న గొప్పతనాన్ని నిలబెట్టాయి. ఇప్పుడిదే పంథాలో సినీప్రియుల్ని అలరించేందుకు ఇంకొన్ని సినిమాలు బాక్సాఫీస్ ముందుకు దూసుకొస్తున్నాయి.
- ‘కూలీ’... ఈ పేరుకు తెలుగు చిత్రసీమలోనే కాదు బాలీవుడ్లోనూ మంచి క్రేజ్ ఉంది. ఈ పేరుతో తెలుగులో వెంకటేశ్- రాఘవేంద్రరావు కలయికలో వచ్చిన ‘కూలీ నెం.1’, అమితాబ్ బచ్చన్ - మన్మోహన్ దేశాయ్ల ‘కూలీ’ బాక్సాఫీస్ ముందు భారీ విజయాల్ని అందుకున్నాయి. ఇప్పుడిదే పేరుతో థియేటర్లలో జోరు చూపించేందుకు అగ్ర కథానాయకుడు రజనీకాంత్ సిద్ధమయ్యారు. ఆయన లోకేశ్ కనగరాజ్తో చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్కు ఇదే పేరును ఖరారు చేసిన సంగతి తెలిసిందే. బంగారం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రం రూపొందనుంది. త్వరలో చిత్రీకరణ ప్రారంభించుకోనున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ‘కూలీ’ పేరుతోనే విడుదల కానుంది. నటుడు మోహన్బాబు కెరీర్లో మంచి విజయాన్ని అందుకున్న సినిమాల్లో ‘దొంగ పోలీస్’ ఒకటి. ఇప్పుడదే పేరుతో రవితేజ హీరోగా ఓ కొత్త సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని సమాచారం. తను త్వరలో ‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. వినోదం నిండిన యాక్షన్ కథాంశంతో రూపొందనున్న ఆ సినిమాలో రవితేజ దొంగగా.. కథానాయిక పోలీసుగా కనిపించనున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. అందుకే ఈ కథాంశానికి తగ్గట్లుగానే ‘దొంగ - పోలీస్’ అనే పేరు పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
- ‘తొలిప్రేమ’, ‘ఖుషి’.. పవన్ కల్యాణ్ సినీ కెరీర్లో భారీ విజయాలందుకున్న చిత్రాలివి. ఇప్పటికే ఈ టైటిళ్లతో వరుణ్తేజ్, విజయ్ దేవరకొండ సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పవన్ సినీ జాబితాలోని మరో క్లాసిక్ హిట్ టైటిల్తో ప్రేక్షకుల్ని పలకరించేందుకు నితిన్ సిద్ధమవుతున్నారు. అదే శ్రీరామ్ వేణు తెరకెక్కిస్తున్న ‘తమ్ముడు’. గమ్మత్తైన విషయం ఏంటంటే ఈ రెండింటి మధ్య ఓ పోలిక ఉంది. పవన్ ‘తమ్ముడు’ తరహాలోనే నితిన్ ‘తమ్ముడు’లోనూ క్రీడా నేపథ్య అంశాలకు ప్రాధాన్యం ఉంది. అందులో పవన్ బాక్సర్గా కనిపిస్తే.. ఇందులో నితిన్ ఆర్చరీ ఆటగాడిగా దర్శనమివ్వనున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన విజయవంతమైన వినోదాత్మక చిత్రాల్లో ‘ఆ.. ఒక్కటీ అడక్కు’ ఒకటి. రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన ఈ సినిమా అప్పట్లో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించింది. ఇప్పుడా పేరుతోనే సినీప్రియుల్ని మరోమారు నవ్వించేందుకు ఈవీవీ తనయుడు అల్లరి నరేశ్ సిద్ధమయ్యారు. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని మల్లి అంకం తెరకెక్కించారు. పెళ్లి కాని కుర్రాళ్ల కష్టాల్ని దీంట్లో వినోదాత్మకంగా చూపించినట్లు ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్లను బట్టి అర్థమవుతోంది. మరి ఇది తెరపై ప్రేక్షకుల్ని ఏస్థాయిలో నవ్విస్తుందో తెలియాలంటే మే 3వరకు వేచి చూడక తప్పదు.
- సినిమాల నుంచి కొంతకాలం విరామం తీసుకున్న నారా రోహిత్ ‘ప్రతినిధి 2’తో తిరిగి తెరపైకి వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన వెంకటేశ్ హిట్ సినిమా ‘సుందరకాండ’ టైటిల్తో ఓ సినిమా చేస్తున్నారు. ఇది నారా రోహిత్కు 20వ చిత్రం. దీని ద్వారా వెంకటేశ్ నిమ్మలపూడి అనే కొత్త దర్శకుడు తెరకు పరిచయం కానున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ సెప్టెంబరు 6న థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతం ఈ పేరు ఒరవడిని కొనసాగిస్తున్న తారల జాబితాలో నటి కాజల్ చిత్రం కూడా ఒకటుంది. అదే అఖిల్ డేగల దర్శకత్వంలో ముస్తాబైన ‘సత్యభామ’. గతంలో ఇదే పేరుతో ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు ఓ విజయవంతమైన చిత్రం చేశారు. ఇప్పుడా పేరుతోనే యాక్షన్ విందు రుచి చూపించేందుకు సిద్ధమైంది కాజల్. ఆమె పోలీసు పాత్రలో నటించిన ఈ సినిమా మే 17న థియేటర్లలోకి రానున్నట్లు ఇటీవల ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కియారాకు అరుదైన అవకాశం.. ప్రతిష్ఠాత్మక ఈవెంట్కు ఆహ్వానం
‘భరత్ అనే నేను’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్ నటి కియారా అడ్వాణి. ఆమె అరుదైన అవకాశం దక్కింది. -
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
ముంబయిలోని అటల్ సేతుపై ప్రయాణించిన సినీనటి రష్మిక తన అనుభూతిని షేర్ చేసుకున్నారు. -
బికినీలో అనన్య పాండే.. కాబోయే భర్తతో వరలక్ష్మి ఫొటో
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఫొటోలు మీకోసం.. -
ఓటీటీలోకి ‘షరతులు వర్తిస్తాయి!’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
‘షరతులు వర్తిస్తాయి!’ సినిమా ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. ఏ ఓటీటీలో ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అంటే? -
ప్రేక్షకులు చాలా స్మార్ట్.. ‘పుష్ప’ పాత్రను అలా ఏమీ చూడరు: అల్లు అర్జున్
‘పుష్ప’లో తన పాత్ర గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు అల్లు అర్జున్. -
Double Ismart: ‘డబుల్ ఇస్మార్ట్ రీక్యాప్’ థియేటర్లు దద్దరిల్లాయిలా..!
మే 15వ తేదీన ‘డబుల్ ఇస్మార్ట్’కు సంబంధించిన టీజర్ను విడుదల చేయనున్న నేపథ్యంలో పూరి జగన్నాథ్ ఆసక్తికర వీడియోను పంచుకున్నారు
-
Jabardasth Promo: భూమిపైకి వచ్చిన దేవకన్యలు.. రాఘవకు వచ్చాయి తిప్పలు!
ప్రతి గురువారం బుల్లితెర ప్రేక్షకుల్ని అలరిస్తున్న కామెడీ షో ‘జబర్దస్త్ (Jabardasth)’. మే 16న ప్రసారం కానున్న ఎపిసోడ్ ప్రోమో తాజాగా విడుదలై ఆకట్టుకుంటోంది.
-
పిల్లల జీవితాన్ని ఎవరు రిస్క్లో పెట్టమన్నారు: రష్మి
తాండూరులో చిన్నారిపై పెంపుడు కుక్క దాడి చేసిన ఘటనకు సంబంధించి యాంకర్ రష్మిని ఉద్దేశిస్తూ ఎక్స్ వేదికగా పెట్టిన పోస్టులకు ఆమె తిరిగి సమాధానం ఇచ్చారు. -
Dhee Promo: లవర్ బాయ్గా రెచ్చిపోతానంటున్న ఆది.. ‘ఢీ’లో నవ్వులే నవ్వులు
అదిరిపోయే డ్యాన్స్లతో ప్రతి బుధవారం ప్రేక్షకులకు వినోదం పంచుతున్న షో ‘ఢీ - సెలబ్రిటీ స్పెషల్’. మే 15న ప్రసారం కానున్న ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలై ఆకట్టుకుంటోంది.
-
రూ.కోటి విరాళమిచ్చిన ధనుష్.. దేనికోసమంటే!
హీరో ధనుష్ (Dhanush) రూ.కోటి విరాళం అందించారు. -
హాలీవుడ్ ‘డ్యూన్..’ వెబ్ సిరీస్లో టబు.. ఏపాత్రలో అంటే!
ప్రముఖ నటి టబు హాలీవుడ్ వెబ్ సిరీస్లో కీలకపాత్రలో నటించనున్నారు. -
ఆయన సలహాను పట్టించుకోని సావిత్రి
ప్రముఖ నటి సావిత్రి (Savitri) దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘చిన్నారి పాపలు’. దీనికి ఎలాగైనా ప్రముఖ రచయిత డి.వి.నరసరాజుతో మాటలు రాయించాలని ఆవిడ ప్రయత్నించారు. -
చరణ్ వల్లే ఆ డిప్రెషన్ నుంచి బయటపడ్డా: ఉపాసన
రామ్ చరణ్ వల్లే ప్రసవానంతర డిప్రెషన్ నుంచి బయటపడినట్లు ఉపాసన తెలిపారు. -
ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే.. ఇటు ఫన్.. అటు థ్రిల్
ఈ వారం థియేటర్లో, ఓటీటీల్లో సందడి చేసేందుకు పలు సినిమాలు సిద్ధమయ్యాయి. అవేంటంటే? -
ఓటెత్తిన సినీ లోకం
పౌర విధిని నిర్వర్తించడంలో మేం ముందుంటామని మరోసారి చాటి చెప్పింది సినీలోకం. ఉదయం నుంచే పోలింగ్ స్టేషన్లకు చేరుకుని పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. -
ముగిసిన త్రిష ఐడెంటిటీ
గతేడాది ‘లియో’తో మంచి విజయాన్ని అందుకుంది కథానాయిక త్రిష. పరిశ్రమకి వచ్చి రెండు దశాబ్దాలైనా ఇప్పటికీ తన అందం అభినయంతో మెప్పిస్తున్న ఈ భామ.. ప్రస్తుతం అగ్రహీరోల సరసన నటిస్తూ తీరిక లేకుండా గడుపుతోంది. -
నేనెంటో చెప్పేది నా పనే..!
అందం, అభినయంతో పాటు ‘మెట్గలా’లాంటి ఫ్యాషన్ వేదికలపై మెరుస్తూ.. అంతర్జాతీయంగా తన పరపతి పెంచుకుంటోంది అగ్ర నాయిక అలియా భట్. త్వరలో ‘జిగ్రా’తో అభిమానుల ముందుకొస్తున్న ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పిన ఆసక్తికర విషయాలివి. -
రజనీ పూర్తి చేశారు
కుర్ర హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నారు అగ్ర కథానాయకుడు రజనీకాంత్. ఒకవైపు ఒప్పుకున్న సినిమాల్ని పూర్తి చేస్తూ... మరోవైపు కొత్త చిత్రాల్ని పట్టాలెక్కిస్తూ మెరుపు వేగం ప్రదర్శిస్తున్నారు. -
కేన్స్ చిత్రోత్సవాల్లో కన్నప్ప టీజర్
‘కన్నప్ప’తో థియేటర్లలో సందడి చేయనున్నారు మంచు విష్ణు. ఆయన టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాని ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. మోహన్బాబు నిర్మాత. ప్రస్తుతం ముగింపు దశ చిత్రీకరణలో ఉన్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
టాక్సిక్లోకి మరో అందం?
‘కేజీఎఫ్’ విజయాల తర్వాత కథానాయకుడు యశ్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’. గీతూ మోహన్దాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో నయనతార ఓ ప్రధాన పాత్ర పోషించనున్నట్లు ఇప్పటికే వార్తలొచ్చాయి. -
అక్షయ్ సరసన అవకాశం ఎవరికి?
ఈ ఏడాది అరడజనుకు పైగా చిత్రాలతో బిజీగా గడుపుతున్నారు బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్. వరుస సినిమాలను పట్టాలెక్కించిన ఈయన దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించనున్న హారర్ కామెడీ చిత్రంలో నటించేందుకు పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు (Latest News)
-
కీలక మ్యాచ్లో పోరాడి ఓడిన లఖ్నవూ.. ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం
-
రైలు కింద పడి యువతి ఆత్మహత్య
-
రాచరిక చట్టాలపై అసమ్మతి గళం.. నెలల తరబడి నిరాహార దీక్షతో హక్కుల కార్యకర్త మృతి!
-
కియారాకు అరుదైన అవకాశం.. ప్రతిష్ఠాత్మక ఈవెంట్కు ఆహ్వానం
-
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
-
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక