భారత దేశమంత స్వచ్ఛమైన సినిమా
సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమిక, తాన్య హోప్ ప్రధాన పాత్రల్లో గురు పవన్ తెరకెక్కించిన చిత్రం ‘ఇదే మా కథ’. జీ మహేశ్ నిర్మించారు. ఈ సినిమా శనివారం విడుదలవుతోంది.
సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమిక, తాన్య హోప్ ప్రధాన పాత్రల్లో గురు పవన్ తెరకెక్కించిన చిత్రం ‘ఇదే మా కథ’. జీ మహేశ్ నిర్మించారు. ఈ సినిమా శనివారం విడుదలవుతోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల హైదరాబాద్లో ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎం.ఎస్.రాజు, బి.గోపాల్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘‘ఓ నలుగురు వ్యక్తుల కథ ఇది. వారి లక్ష్యాలేంటి? వాటిని ఎలా చేరుకున్నారు? ఈ క్రమంలో ఒకరికొకరు ఎలా సహాయ పడ్డారు? అనేది మిగతా కథాంశం. సినిమా ఎంతో అద్భుతంగా వచ్చింది. సుమంత్ను చూస్తే నన్ను నేను చూసుకున్నట్లుంది. లద్దాఖ్లో నీళ్లలో జంప్ చేసి, ఓ యాక్షన్ సీక్వెన్స్ చేశాడు. అంత చలిలో అలా చేయడం చూసి నాకు భయమేసింది. ఈ సినిమా కచ్చితంగా విజయవంతమవుతుంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రం నాకెంతో ప్రత్యేకం. దక్షిణాది నుంచి ఉత్తరాది వరకు అంతా చూపించాం. ఈ ప్రయాణంలో శ్రీకాంత్, భూమిక గారితో పని చేయడం నాకెంతో ఆనందాన్నిచ్చింది. కథను నమ్మి, ఎంతో ధైర్యంతో మహేష్ ఈ చిత్రాన్ని తీశార’’న్నారు హీరో సుమంత్ అశ్విన్. దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘నేను రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కొన్న సమయంలో ఓ కొత్త ప్రపంచంలోకి వెళ్లాను. 5వేల కిలోమీటర్లు జర్నీ చేసుకుంటూ ఈ కథ రాశాను. భారత దేశం ఎంత స్వచ్ఛంగా ఉంటుందో.. మా సినిమా అంతే స్వచ్ఛంగా ఉంటుంది. కథ నమ్మి సినిమా చేయడానికి ముందుకొచ్చిన శ్రీకాంత్, భూమిక, సుమంత్, తాన్యలకు థ్యాంక్స్’’ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తలదించితే బానిసవి.. ఎత్తినావా నువ్వే బాదుషావి
‘‘తలదించినావా బానిసవి.. ఎత్తినావా బాదుషావి.. తలపొగరే నీ కిరీటమైతే భూతలమంతా నీదేరా’’ అంటూ తను నమ్మిన జీవిత సూత్రాన్ని అందరికీ బోధిస్తున్నాడు పుష్పరాజ్. -
అక్టోబరులో మొదలు!
‘కేజీఎఫ్’, ‘సలార్’ సినిమాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఆయన దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. -
రజనీ బయోపిక్ రానుందా?
సినిమాల్లో తమ అభిమాన హీరోలు చేసే యాక్షన్ హంగామాను చూస్తూ మురిసిపోతుంటారు ప్రేక్షకులు. -
కృష్ణమ్మ.. అందరూ మాట్లాడుకునే చిత్రమవుతుంది
‘‘సత్యదేవ్ అద్భుతమైన నటుడని అందరికీ తెలుసు. అలాంటి నటుడికి ఒక సరైన సినిమా పడితే చాలు ఊహించని స్టార్డమ్ వస్తుంది. -
మనం నవ్వుతుంటే ప్రేక్షకులు భయపడాలి!
‘‘ఆద్యంతం వినోదం పంచుతూనే మంచి సందేశమిచ్చే చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. పెళ్లి వెనకున్న ఓ సమస్యను.. దాని చుట్టూ జరుగుతున్న రూ.కోట్ల వ్యాపారాన్ని.. ఓ స్కామ్ను దీంట్లో వినోదాత్మకంగా చూపించాం. -
ఆ మార్పు నాలో విశ్వాసాన్ని నింపింది
‘ప్రేక్షకుల్లో వచ్చిన ఈ మార్పు నాలో విశ్వాసాన్ని పెంచుతుంది’ అని అంటోంది బాలీవుడ్ నాయిక తాప్సీ. -
సందేశమిచ్చే గాంధీ తాత చెట్టు
ప్రముఖ దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి బండ్రెడ్డి బాలనటిగా తెరకు పరిచయం కానుంది. -
ఇందులో అన్నీ ఉంటాయి
‘‘ప్రేక్షకులకు చాలా తృప్తినిచ్చే సినిమా ‘ప్రసన్న వదనం’. దీన్ని సీటు అంచున కూర్చొని ఆస్వాదిస్తారు. అదిరిపోయిందని చప్పట్లు కొడతారు’’ అన్నారు సుహాస్. -
స్విమ్మింగ్ పూల్లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మన ప్రేమలన్నీ శృంగారం కోసమే: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ నుంచి మరో వీడియో వచ్చేసింది. ప్రేమను ఉద్దేశించి పూరి మాట్లాడారు.