Tammareddy Bharadwaja: ఆ విషయం చిరంజీవికి చెబుదామని ప్రయత్నించా కానీ: తమ్మారెడ్డి భరద్వాజ
దర్శక- నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ.. నటుడు చిరంజీవి గురించి మాట్లాడారు. ఓ యూట్యూబ్ ఛానెల్ వేదికగా తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: సహజత్వంతో కూడిన సినిమాలు చేయడం మంచిదనే తన అభిప్రాయాన్ని నటుడు చిరంజీవి (Chiranjeevi)కి నేరుగా చెబుదామని ప్రయత్నించినా ధైర్యం చాలకో, అదే సమయంలో వేరే టాపిక్ గురించి మాట్లాడడం వల్లనో చెప్పలేకపోయానని దర్శక- నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ (Tammareddy Bharadwaja) అన్నారు. ఓ యూట్యూబ్ ఛానెల్ వేదికగా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. చిత్ర పరిశ్రమలో వచ్చిన మార్పులను విశ్లేషిస్తూ చిరంజీవి గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. అప్పట్లో.. చిత్ర పరిశ్రమలోకి వచ్చిన వారికి పని తప్ప మరో ఆలోచన ఉండేది కాదని పేర్కొన్నారు. ఇప్పటికీ సినిమాపై ప్రేమ ఉన్నవాళ్లు ఉన్నా.. దాన్ని వ్యాపారంగా చూసే వాళ్లే ఎక్కువ అని అన్నారు. సినిమా తీయాలనే ఉద్దేశంతో కథ చెప్పమని అడిగితే ఒకప్పటి రచయితలు సూటిగా చెప్పేవారని, ఇప్పటివారిని అడిగితే ‘ఓపెన్ చేస్తే.. టాప్ యాంగిల్ షాట్’ అంటూ ఎలివేషన్లు ఇస్తున్నారని, దర్శకులే రచయితలు కావడం అందుకు ఓ కారణమన్నారు.
‘జైలర్’, ‘ఓ మైగాడ్2’, ‘గదర్2’.. సినీ చరిత్రలో ఇదొక రికార్డు!
‘‘ప్రేక్షకులకు పనికొచ్చే ఏదో ఒక అంశం సినిమా కథలో ఉండేలా చూడాలి. అది కూడా సహజంగా ఉండాలి. అది పక్కనపెట్టి ఏదో చేయాలనుకుంటే సినిమాలు పెద్దగా ఆడడంలేదు. రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ, చిరంజీవి.. ఇలా హీరోలంతా కెరీర్ ప్రారంభంలో మెథడ్ యాక్టింగ్ చేసినట్లు ఉంటుంది. చిరంజీవి నటించిన ‘శుభలేఖ’, ‘స్వయంకృషి’, ‘రుద్రవీణ’, ‘విజేత’లాంటి సినిమాలకు ప్రేక్షకాదరణ దక్కింది. ఆమిర్ఖాన్ నటించిన ‘దంగల్’లాంటి నేచురల్ ఫిల్మ్లో చిరంజీవి నటించినా ప్రేక్షకులు చూస్తారు. ‘భోళాశంకర్’, అంతకు ముందు ‘లూసీఫర్’ రీమేక్లాంటివి చేసి నిరుత్సాహపడడం కంటే నేచురల్ సినిమాలు చేయడం మంచిదనేది నా అభిప్రాయం. ఇదే విషయాన్ని నేరుగా ఆయనతో చెబుదామని ప్రయత్నించినా సాధ్యపడలేదు. మెథడ్ యాక్టింగ్ వల్లే ఆయన మెగాస్టార్ అయ్యారు. ఒకప్పటి సినిమాల్లో ఆయన.. మన కుటుంబంలో ఓ వ్యక్తిగా కనిపించేవారు. ఆ చిరంజీవి కనిపిస్తే మళ్లీ సినిమా ఆడుతుందని నా నమ్మకం’’ అని తమ్మారెడ్డి పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆషికా ‘ఐస్ క్రీమ్ స్టోరీ’.. శ్రద్ధాదాస్ విహార యాత్ర
సినీ తారలు సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ ప్రచారాన్ని ఖండిస్తున్నాం: సినిమా ప్రదర్శనల నిలిపివేతపై టీఎఫ్పీసీ క్లారిటీ
థియేటర్లలో సినిమాల ప్రదర్శనల నిలిపివేతపై జరుగుతున్న ప్రచారాన్ని టీఎఫ్పీసీ ఖండించింది. -
అలాంటి వాడినే పెళ్లి చేసుకుంటా: జాన్వీ కపూర్
తనను పెళ్లి చేసుకోబోయే వాడికి ఉండాల్సిన లక్షణాలను జాన్వీ వెల్లడించారు. ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ సాంగ్ రిలీజ్ ఈవెంట్లో ఆమె మాట్లాడారు. -
‘భారతీయుడు 2’ టీమ్ సర్ప్రైజ్ ఇవ్వనుందా.. వైరలవుతోన్న అప్డేట్స్
‘భారతీయుడు 2’ చిత్రబృందం సర్ప్రైజ్కు ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. -
నా అకౌంట్ హ్యాక్ అవలేదు.. నేనే రూ.3500 కోసం రిక్వెస్ట్ పెట్టా!
Renu Desai: రూ.3500 కావాలంటూ రేణుదేశాయ్ పెట్టిన పోస్ట్ సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. -
గాయంతోనే కేన్స్కు ఐశ్వర్యరాయ్.. వీడియో వైరల్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్కు గాయమైంది. దీంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. -
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఊర్వశి హొయలు.. సక్సెస్ జోష్లో అదితి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఫొటోలు మీకోసం.. -
మీరు అలా అంటుంటే ఆశ్చర్యంగా ఉంది: శివానీ రాజశేఖర్
తనను ఇన్స్టా ఇన్ఫ్లూయెన్సర్ అనడంపై ఆశ్చర్యం వ్యక్తంచేశారు నటి శివానీ రాజశేఖర్. -
ఆ షూటింగ్లో రెండు భుజాలకు ఎన్నో గాయాలయ్యాయి: జాన్వీ కపూర్
‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ షూటింగ్ అనుభవాలను జాన్వీ కపూర్ పంచుకున్నారు. -
అసలైన విజయమంటే అదే.. బర్త్డే రోజు రామ్ ఆసక్తికర పోస్ట్
మనకు నచ్చింది చేయగలగడమే అసలైన విజయమని రామ్ పోతినేని అన్నారు. -
ఇలా చేయడం సరికాదు: ‘సెపరేషన్’ పోస్ట్ ట్రోల్స్పై జీవీ ప్రకాశ్
తనపై కొందరు ట్రోల్స్ చేయడం బాధగా ఉందని సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ పేర్కొన్నారు. -
విమర్శలు వచ్చినా.. ‘యానిమల్’ హిట్కు కారణమిదే: మనోజ్ బాజ్పాయ్
సినిమాలు చూడాలా, లేదా అనే విషయంలో ప్రేక్షకులకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్పాయ్ అన్నారు. -
తప్పుడు వార్తలపై మెహరీన్ అసహనం.. క్షమాపణ చెప్పాలని డిమాండ్
తనపై తప్పుడు వార్తలు ప్రచురించడంపై నటి మెహరీన్ అసహనం వ్యక్తం చేశారు. -
హీరోయిన్లు ఆ విషయంలోనూ పోరాడుతున్నారు: సోనాక్షి సిన్హా
పారితోషికం విషయంలో హీరోయిన్లు పోరాటం చేస్తున్నారని నటి సోనాక్షి సిన్హా అన్నారు. -
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
ముంబయిలోని అటల్ సేతుపై ప్రయాణించిన సినీనటి రష్మిక తన అనుభూతిని షేర్ చేసుకున్నారు. -
బికినీలో అనన్య పాండే.. కాబోయే భర్తతో వరలక్ష్మి ఫొటో
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఫొటోలు మీకోసం.. -
కియారాకు అరుదైన అవకాశం.. ప్రతిష్ఠాత్మక ఈవెంట్కు ఆహ్వానం
‘భరత్ అనే నేను’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్ నటి కియారా అడ్వాణి. ఆమె అరుదైన అవకాశం దక్కింది. -
పిల్లల జీవితాన్ని ఎవరు రిస్క్లో పెట్టమన్నారు: రష్మి
తాండూరులో చిన్నారిపై పెంపుడు కుక్క దాడి చేసిన ఘటనకు సంబంధించి యాంకర్ రష్మిని ఉద్దేశిస్తూ ఎక్స్ వేదికగా పెట్టిన పోస్టులకు ఆమె తిరిగి సమాధానం ఇచ్చారు. -
రూ.కోటి విరాళమిచ్చిన ధనుష్.. దేనికోసమంటే!
హీరో ధనుష్ (Dhanush) రూ.కోటి విరాళం అందించారు. -
హాలీవుడ్ ‘డ్యూన్..’ వెబ్ సిరీస్లో టబు.. ఏపాత్రలో అంటే!
ప్రముఖ నటి టబు హాలీవుడ్ వెబ్ సిరీస్లో కీలకపాత్రలో నటించనున్నారు. -
చరణ్ వల్లే ఆ డిప్రెషన్ నుంచి బయటపడ్డా: ఉపాసన
రామ్ చరణ్ వల్లే ప్రసవానంతర డిప్రెషన్ నుంచి బయటపడినట్లు ఉపాసన తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాల్లో ఛాన్స్.. వైష్ణవీ చైతన్య ఏమన్నారంటే?
-
ఇండియా కూటమి విషయంలో దీదీ వ్యాఖ్యలు నమ్మలేం: అధీర్ రంజన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
లైంగిక వేధింపుల కేసు.. డీఎంహెచ్వో అరెస్టు
-
ఆషికా ‘ఐస్ క్రీమ్ స్టోరీ’.. శ్రద్ధాదాస్ విహార యాత్ర
-
తెలంగాణలో ఏసీబీకి చిక్కిన ముగ్గురు అధికారులు