BJP: ప్రధాని కార్యక్రమాలకు కేసీఆర్ దూరంగా ఉండటం సరికాదు: లక్ష్మణ్
ఏపీ, తమిళనాడులో పార్టీలకు అతీతంగా ప్రధాని మోదీ పర్యటనను ఆహ్వానిస్తుంటే తెలంగాణలో మాత్రం తెరాస నేతలు స్వాగతించడం లేదని భాజపా ఎంపీ, సీనియర్ నేత లక్ష్మణ్ ఆరోపించారు.
హైదరాబాద్: ఏపీ, తమిళనాడులో పార్టీలకు అతీతంగా ప్రధాని మోదీ పర్యటనను ఆహ్వానిస్తుంటే తెలంగాణలో మాత్రం తెరాస నేతలు స్వాగతించడం లేదని భాజపా ఎంపీ, సీనియర్ నేత లక్ష్మణ్ ఆరోపించారు. ప్రధాని పాల్గొనే అధికారిక కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ దూరంగా ఉంటున్నారని.. ఇది సబబు కాదన్నారు. రాజకీయాలు, అభివృద్ధికి మధ్య వ్యత్యాసాలను సీఎం గుర్తించడం లేదని ఆక్షేపించారు. నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో లక్ష్మణ్ మాట్లాడారు.
రాజకీయాలకు అతీతంగా ప్రధాని పాల్గొనే కార్యక్రమానికి కేసీఆర్ హాజరవ్వాలని లక్ష్మణ్ కోరారు. దగ్గరుండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయమని మోదీని అడగాల్సిందిపోయి కార్యక్రమాలకు రాకుండా ఉండటం సరికాదని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో భాజపాయేతర ప్రభుత్వాలు ఉన్నా మోదీ అభివృద్ధి పనులను చేపడుతున్నారని.. ఆయన పర్యటనను అడ్డుకుంటామని కొంతమంది పేర్కొనడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్లో చేరిన మాజీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి
భారాస నేత, మాజీమంత్రి ఇంద్రకరణ్రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వాములు: సీఎం రేవంత్రెడ్డి
ప్రజా పాలనలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవ స్ఫూర్తి అన్ని రంగాలకు విస్తరిస్తోందని, కార్మికులకు సముచిత గౌరవం లభిస్తోందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. -
మ్యానిఫెస్టోలో కార్మిక సంక్షేమానికి పెద్దపీట: తెదేపా అధినేత చంద్రబాబు
శ్రమ దోపిడీని ఎదిరించి శ్రమ శక్తి గెలుపొందిన మహోజ్వల చారిత్రాత్మక దినం మేడే అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘విస్తారా’కు వడగండ్ల దెబ్బ.. విమానం అత్యవసర ల్యాండింగ్
-
కీర్తి సురేశ్తో ‘ఉప్పు కప్పురంబు’.. సుహాస్ రియాక్షన్ ఏంటంటే?
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
కాంగ్రెస్లో చేరిన మాజీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి
-
ఆఫ్లైన్లోనే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష: టీఎస్పీఎస్సీ