Congress: హైదరాబాద్‌ చేరుకున్న కాంగ్రెస్‌ అగ్రనేతలు

సీడబ్ల్యూసీ సమావేశాల్లో పాల్గొనేందుకు కాంగ్రెస్‌ కీలక నేతలంతా హైదరాబాద్‌కు చేరుకున్నారు.

Updated : 16 Sep 2023 14:38 IST

హైదరాబాద్‌: సీడబ్ల్యూసీ (CWC) సమావేశాల్లో పాల్గొనేందుకు కాంగ్రెస్‌ కీలక నేతలంతా హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. దిల్లీ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి వచ్చిన పార్టీ అధినేత్రి సోనియా గాంధీ (Sonia Gandhi), రాహుల్‌ గాంధీ సహా ముఖ్య నేతలను రాష్ట్ర నాయకత్వం స్వాగతం పలికింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ ఇన్‌ఛార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. కాంగ్రెస్‌ అగ్రనేతలంతా రెండ్రోజుల పాటు హైదారాబాద్‌లోనే ఉండనున్నారు.

సీడబ్ల్యూసీ సమావేశాలకు వస్తున్న నేతలకు తెలంగాణ కళారూపాలతో స్వాగతం పలికారు. కళాకారులతో ఎమ్మెల్యే సీతక్క నృత్యం చేశారు. మరోవైపు సమావేశాల్లో పాల్గొనేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ భగేల్‌, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌, ఉపముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌, పార్టీ సీనియర్‌ నేతలు చిదంబరం, వీరప్ప మొయిలీ తదితరులు ఇప్పటికే తాజ్‌ హోటల్‌కు చేరుకున్నారు. హోటల్‌ తాజ్‌ కృష్ణలో రెండ్రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని