YSRCP: ‘ప్రతిపక్ష అభ్యర్థులను పశువుల్లా కొన్నాం’
‘మీ నాయకులు ఎన్నికల్లో పోటీ చేయకుండా సంతలో పశువులను కొన్నట్టు మేము కొన్నాం.
నంద్యాల పురపాలక వైస్ఛైర్మన్ వివాదాస్పద వ్యాఖ్యలు
నంద్యాల పురపాలకం, న్యూస్టుడే: ‘మీ నాయకులు ఎన్నికల్లో పోటీ చేయకుండా సంతలో పశువులను కొన్నట్టు మేము కొన్నాం. 2021 మార్చిలో జరిగిన పురపాలక ఎన్నికల్లో మేము, మా ఎమ్మెల్యే (శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి), మా పెద్దాయన (మాజీ మంత్రి శిల్పా మోహన్రెడ్డి) కలిసి 12 మంది తెదేపా అభ్యర్థులకు డబ్బులిచ్చి కొని ఏకగ్రీవంగా ఎన్నికయ్యాం. అయినాసరే మీరు.. మీ పార్టీ ఏమీ చేయలేకపోయారు. మీకు ఏమాత్రం అభిమానం లేదు. మాట్లాడేందుకు అర్హత లేదు’ అని నంద్యాల పురపాలక సంఘం వైస్ఛైర్మన్, 28వ వార్డు కౌన్సిలర్ పాంషావలి కౌన్సిల్ సమావేశంలో వ్యాఖ్యానించడం దుమారం రేపింది. నంద్యాల పురపాలక కార్యాలయంలో శుక్రవారం ఛైర్పర్సన్ మాబున్నిసా అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. ఎజెండాలోని అంశాలు ఆమోదించాక తెదేపా ఫ్లోర్లీడర్, 34వ వార్డు కౌన్సిలర్ మహబూబ్వలి మాట్లాడుతూ.. పురపాలక ఆస్తులను పరిరక్షించాలని కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చారు. ఆ సమయంలో వైస్ఛైర్మన్ పాంషావలి ప్రతిపక్ష సభ్యులను దుర్భాషలాడారు. డబ్బులిచ్చి ప్రతిపక్ష అభ్యర్థులను కొన్నామని కౌన్సిల్ సాక్షిగా ప్రకటించడం ద్వారా వైస్ఛైర్మన్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని పలువురు ప్రజాసంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. ఏకగ్రీవమైన వార్డుల్లో ఉపఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం రేవంత్ నేతృత్వంలో గ్యారంటీలను అమలు చేస్తాం: సోనియాగాంధీ
తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. -
సిక్కింలో ఎస్కేఎం, అరుణాచల్లో భాజపా హవా
Assembly Elections: సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన కౌంటింగ్లో సిక్కింలో ఎస్కేఎం, అరుణాచల్లో భాజపా ముందంజలో కొనసాగుతున్నాయి. -
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో భారాస విజయం!
మహబూబ్నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో భారాస విజయం సాధించింది. -
ఎవరూ చావు నోట్లో తల పెట్టి రాష్ట్రం తేలేదు
తెలంగాణ ఏర్పాటులో సోనియా గాంధీ గొప్పతనాన్ని అసెంబ్లీ మొదటి ప్రసంగంలో కేసీఆరే చెప్పారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చి పదేళ్లు పూర్తయిందని, రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోందని చెప్పారు. -
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం
మహబూబ్నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. -
చంద్రబాబు రాకపోయినా వచ్చినట్లు తప్పుడు కథనం.. తెదేపా ఫిర్యాదు
మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో శుక్రవారం జరిగిన ప్రధాన కౌంటింగ్ ఏజెంట్ల సమావేశానికి తెదేపా అధినేత చంద్రబాబు హాజరు కాకపోయినా, హాజరైనట్లు ‘సాక్షి’లో తప్పుడు కథనం ప్రచురించడంపై ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. -
తెదేపా ఏజెంటు వాహనానికి నిప్పు
వైఎస్సార్ జిల్లా కడప నగరంలోని శంకరాపురంలో తెదేపా ఏజెంట్ సిగిలి ప్రసాద్రెడ్డి ద్విచక్రవాహనానికి శుక్రవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. -
కూటమికే పీఠం!
అరాచకం... అభివృద్ధి మధ్య పోరుగా... రాజకీయంగా అత్యంత ఉత్కంఠ, ఉద్విగ్నత రేకెత్తించిన ఆంధ్రావని ఎన్నికల్లో తెదేపా-భాజపా-జనసేన ఎన్డీయే కూటమినే విజయం వరించబోతోందని ఎగ్జిట్పోల్స్ తేల్చాయి. -
ఆర్వోను బెదిరించినా చెవిరెడ్డిపై చర్యల్లేవు
ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు అత్యంత పవర్ఫుల్..! వారిని బెదిరించడం, అంతుచూస్తామనడం తీవ్రమైన నేరం..! ఆర్వోను ఒక అభ్యర్థి బెదిరిస్తే వెంటనే కేసు పెట్టి, అరెస్టు చేయాలి. -
పిన్నెల్లితో ప్రాణహాని.. హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వండి
మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ జరుగుతున్న సమయంలో ఈవీఎంను ధ్వంసం చేసిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అడ్డుకున్నందుకు తనపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని, ఈ నేపథ్యంలో ఆయన్నుంచి తనకు ప్రాణహాని ఉన్నందున హైకోర్టు ఆయనకు ఇచ్చిన ముందస్తు బెయిల్ రద్దుచేసి తనకు రక్షణ కల్పించాలని తెదేపా బూత్ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు సుప్రీంకోర్టుకు విన్నవించారు. -
విజయవాడ విమానాశ్రయంలో చంద్రబాబుకు ఘన స్వాగతం
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం తెదేపా కార్యకర్తలు చంద్రబాబునాయుడికి ఘనంగా స్వాగతం పలికారు. -
మంగళగిరిలో భారీ మద్యం డంప్
గుంటూరు జిల్లా మంగళగిరిలో వైకాపా నాయకుడి ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన మద్యాన్ని భారీ పరిమాణంలో సెబ్ అధికారులు శనివారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. -
సీఎస్ భూదోపిడీపై సీబీఐతో విచారణ చేయించాలి: వర్ల
విశాఖలో రూ.2 వేల కోట్ల విలువ చేసే పేదల భూముల దోపిడీ కుట్రలో కీలకపాత్రదారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి, ఆయన కుమారుడేనని..ఈ వ్యవహారాన్ని సీబీఐతో విచారణ చేయించాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. -
సంక్షిప్త వార్తలు (3)
ఎగ్జిట్పోల్స్ కూటమికి అనుకూలంగా రావడంతో తెదేపా ప్రధాన కార్యాలయంలో శనివారం రాత్రి కార్యకర్తలు మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. -
తెలంగాణలో మళ్లీ చీకట్లు మొదలు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దురదృష్టవశాత్తూ తెలంగాణలో మళ్లీ చీకట్లు మొదలయ్యాయి. కరెంట్ కోతలు నిత్యకృత్యమయ్యాయి అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. -
భారాస ఆధ్వర్యంలో అమరులకు నివాళి
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని భారాస ఆధ్వర్యంలో అమరులకు నివాళిగా కొవ్వొత్తులతో శనివారం భారీ ఊరేగింపు నిర్వహించారు. అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించిన అనంతరం భారీ ఊరేగింపు ప్రారంభమైంది. -
వాస్తవ ఫలితాలు ఎంతో భిన్నంగా ఉంటాయి
సార్వత్రిక ఎన్నికలపై ఎగ్జిట్పోల్స్ ఏం చెబుతున్నా వాస్తవ ఫలితాలు ఎంతో భిన్నంగా ఉంటాయని కాంగ్రెస్ పేర్కొంది. ‘జూన్ 4న నిష్క్రమించడం ఖాయమైన వ్యక్తి ఈ ఎగ్జిట్ పోల్స్ను సృష్టించారు. మానసికంగా ఆటాడుకునేందుకు ఇలా చేశారు. -
మాకు రికార్డుస్థాయి మద్దతు
ఓటర్లతో మమేకం కావడంలో అవకాశవాద ఇండియా కూటమి విఫలమైందని, వాటి తిరోగామి రాజకీయాలకు తిరస్కరణ ఎదురైందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్రజలు ఎన్డీయే కూటమికి రికార్డు స్థాయిలో మద్దతుగా నిలిచారని పేర్కొన్నారు. -
పూర్తయిన సార్వత్రిక సమరం
సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది. దాదాపు రెండున్నర నెలలుగా దేశవ్యాప్తంగా నెలకొన్న సందడికి తెరపడింది. ఓట్ల లెక్కింపుపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. హ్యాట్రిక్ కోసం ఆరాటపడుతున్న ఎన్డీయే విజయం సాధిస్తుందా, మిత్రపక్షాలతో కలిసి ఇండియా కూటమి గెలుస్తుందా అనేది ఈ నెల 4న తేలనుంది. -
ఇండియా కూటమికి 295కు పైగా సీట్లు ఖాయం
సార్వత్రిక ఎన్నికల్లో విపక్ష ఇండియా కూటమి 295కు పైగా ఎంపీ స్థానాలను గెల్చుకుని కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ధీమా వ్యక్తం చేశారు. దిల్లీలోని ఖర్గే నివాసంలో కూటమి నేతలు శనివారం సమావేశమయ్యారు. -
ఓటరే అసలైన విజేత.. ఎన్నికల సంఘం
సార్వత్రిక సమరాన్ని విజయవంతం చేశారంటూ ఓటర్లకు కేంద్ర ఎన్నికల సంఘం సవినయంగా కృతజ్ఞతలు తెలిపింది. అనేక సవాళ్లు, సందేహాలను అధిగమించి వారంతా స్పందించడంపై ఒక ప్రకటన విడుదల చేసింది. ఓటరే అసలైన విజేత అని అభివర్ణించింది.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ ప్రజలు బానిసత్వాన్ని భరించరు: ఆవిర్భావ వేడుకల్లో సీఎం రేవంత్
-
ఆధునిక భారతం కళ్లారా చూసిన మరో స్వాతంత్ర్య పోరాటమది: కేటీఆర్
-
సీఎం రేవంత్ నేతృత్వంలో గ్యారంటీలను అమలు చేస్తాం: సోనియాగాంధీ
-
డ్రాగన్ ఘనత.. జాబిల్లి ఆవలివైపు ల్యాండ్ అయిన చాంగే-6..!
-
సిక్కింలో ఎస్కేఎం, అరుణాచల్లో భాజపా హవా
-
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో భారాస విజయం!