రెండోరోజు 367 నామినేషన్లు దాఖలు
రాష్ట్రంలో లోక్సభ స్థానాలకు 53, శాసనసభ స్థానాలకు 314 నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా శుక్రవారం ప్రకటన విడుదల చేశారు.
ఈనాడు డిజిటల్, అమరావతి: రాష్ట్రంలో లోక్సభ స్థానాలకు 53, శాసనసభ స్థానాలకు 314 నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. శుక్రవారం నామినేషన్ సమర్పించిన వారిలో తెదేపా అధినేత చంద్రబాబు తరఫున ఆయన సతీమణి భువనేశ్వరి (కుప్పం), మంత్రి బొత్స సత్యనారాయణ (వైకాపా, చీపురుపల్లి) తదితరులు ఉన్నారు. విజయనగరం ఎంపీ అభ్యర్థిగా తెదేపా నుంచి కలిశెట్టి అప్పలనాయుడు నామినేషన్ వేశారు. అరకు పార్లమెంటరీ స్థానానికి వైకాపా అభ్యర్థిని తనూజారాణి తరఫున ఆమె ప్రతినిధులు నామినేషన్ వేశారు. సాలూరు నుంచి ఉపముఖ్యమంత్రి రాజన్నదొర (వైకాపా) నామినేషన్ దాఖలు చేశారు. నెల్లూరు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కె.రాజు నామినేషన్ అందించారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో మంత్రి ఉష శ్రీచరణ్ (వైకాపా), హిందూపురంలో నందమూరి బాలకృష్ణ (తెదేపా) నామినేషన్ వేశారు. కడప లోక్సభ స్థానానికి వైఎస్ అవినాష్రెడ్డి (వైకాపా) నామినేషన్ సమర్పించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రేపు తీన్మార్ మల్లన్న నామినేషన్
తన గెలుపు కోసం యువజన కాంగ్రెస్ సంపూర్ణ సహకారం అందించాలని ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కోరారు. -
నేడు మండలి ‘పట్టభద్రుల’ నోటిఫికేషన్
తెలంగాణ శాసనమండలిలో పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ జారీ చేయనుంది.
తాజా వార్తలు (Latest News)
-
మృత్యువుతో గెలిచి.. పదిలో మెరిసి
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?