Nadendla Manohar: కుంభకోణాలకు నిలయంగా రైతు భరోసా కేంద్రాలు: నాదెండ్ల మనోహర్
రైతు భరోసా కేంద్రాలను వైకాపా ప్రభుత్వం కుంభకోణాలకు నిలయంగా మార్చిందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) ఆరోపించారు.
మంగళగిరి: రైతు భరోసా కేంద్రాలను వైకాపా ప్రభుత్వం కుంభకోణాలకు నిలయంగా మార్చిందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) ఆరోపించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 వేల రైతు భరోసా కేంద్రాలను నిర్మించాలని నిర్ణయించిందన్నారు. వీటి నిర్మాణానికి జాతీయ ఉపాధి హామీ పథకం కింద కేంద్రం నుంచి రూ.2,300 కోట్లు నిధులు తీసుకొచ్చిందన్నారు.
కానీ, గడిచిన ఐదేళ్లలో రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలకు కేవలం రూ.156 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని నాదెండ్ల తెలిపారు. చాలా కేంద్రాలను అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారని అన్నారు. వీటికి గత ఏడాది నుంచి అద్దెలు కూడా చెల్లించకుండా భవన యజమానులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు. కేవలం దళారులకు లబ్ధి చేకూర్చేందుకు మాత్రమే వీటిని ఏర్పాటు చేశారని విమర్శలు గుప్పించారు. తుపానుల సమయంలో రైతులను ఆదుకోవాల్సిన భరోసా కేంద్రాలు చేతులెత్తేయడంతో ఇబ్బందులు పడుతున్నారని మనోహర్ చెప్పారు. ఈ కేంద్రాలలో రైతులకు ఎక్కువ ధరకు ఎరువులు, విత్తనాలు అమ్ముతున్నారని ఆయన ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రేపు తీన్మార్ మల్లన్న నామినేషన్
తన గెలుపు కోసం యువజన కాంగ్రెస్ సంపూర్ణ సహకారం అందించాలని ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కోరారు. -
నేడు మండలి ‘పట్టభద్రుల’ నోటిఫికేషన్
తెలంగాణ శాసనమండలిలో పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ జారీ చేయనుంది.