Kishan Reddy: మాయమాటలతో ప్రజలను భారాస తప్పుదోవ పట్టించింది: కిషన్‌రెడ్డి

అభివృద్ధి పేరుతో భారాస ప్రభుత్వం పేద ప్రజలను నిర్లక్ష్యం చేసిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు.

Published : 03 Feb 2024 14:27 IST

హైదరాబాద్‌: అభివృద్ధి పేరుతో భారాస ప్రభుత్వం పేద ప్రజలను నిర్లక్ష్యం చేసిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. మాయ మాటలతో ప్రజలను తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ ప్రభుత్వమైనా మాయమాటలు చెప్పకుండా ప్రజలకు సేవ చేయాలని కోరారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలోని బోరబండ మధురానగర్ డివిజన్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే బస్తీలు అభివృద్ధికి నోచుకోలేదన్నారు. పేదలను ఆదుకునేందుకు భాజపా మాత్రమేనని చెప్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని