BJP: ఐదు క్లస్టర్స్లో భాజపా విజయ సంకల్ప యాత్ర: కిషన్రెడ్డి
భాజపా విజయ సంకల్ప యాత్రలు ఫిబ్రవరి 20 నుంచి మార్చి 2 వరకు నిర్వహిస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి వెల్లడించారు.
హైదరాబాద్: భాజపా విజయ సంకల్ప యాత్రలు ఫిబ్రవరి 20 నుంచి మార్చి 2 వరకు నిర్వహిస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి వెల్లడించారు. నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జనసందేశ్ డిజిటల్ ఎడిషన్ను ప్రారంభించిన ఆయన.. విజయ సంకల్ప యాత్ర పాటలు, గోడ పత్రికలు, కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ యాత్రను ఐదు క్లస్టర్స్లలో నిర్వహిస్తున్నామన్నారు.
భైంసాలోని సరస్వతి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం కొమురంభీమ్ యాత్రను అస్సాం సీఎం హిమంతవిశ్వ శర్మ ప్రారంభిస్తారని, ఈ యాత్ర ఆదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గాల్లో 1,056 కి.మీ మేర జరుగుతుందని కిషన్రెడ్డి తెలిపారు. రాజరాజేశ్వరీ యాత్ర తాండూరులో ప్రారంభిస్తామన్నారు. భాగ్యలక్ష్మీ యాత్రను గోవా సీఎం ప్రమోద్ సావంత్ ప్రారంభిస్తారని, భువనగిరి నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర.. సికింద్రాబాద్, హైదరాబాద్, మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జరుగుతుందని వివరించారు.
కాకతీయ భద్రాద్రి యాత్ర.. సమ్మక్క-సారలమ్మ మేడారం జాతర వల్ల ఆలస్యంగా ప్రారంభమవుతుందని తెలిపారు. కృష్ణమ్మ విజయ సంకల్ప యాత్ర మక్తల్లోని కృష్ణ గ్రామం నుంచి ప్రారంభమై మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నల్గొండ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో నిర్వహిస్తామని, దీనిని కేంద్రమంత్రి పురుషోత్తం రుపాలా ప్రారంభిస్తారని చెప్పారు. యాత్రలన్నీ పూర్తిగా రోడ్షో తరహాలోనే ఉంటాయన్నారు. కాంగ్రెస్, భారాస రెండూ అవినీతి పార్టీలేనని, ప్రజలను ఏ విధంగా దోచుకున్నాయో ఈ యాత్రల్లో వివరిస్తామని తెలిపారు. లోక్సభ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ మార్చి మొదటి వారంలో వచ్చే అవకాశముందని కిషన్రెడ్డి చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రేపు తీన్మార్ మల్లన్న నామినేషన్
తన గెలుపు కోసం యువజన కాంగ్రెస్ సంపూర్ణ సహకారం అందించాలని ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కోరారు. -
నేడు మండలి ‘పట్టభద్రుల’ నోటిఫికేషన్
తెలంగాణ శాసనమండలిలో పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ జారీ చేయనుంది.
తాజా వార్తలు (Latest News)
-
మృత్యువుతో గెలిచి.. పదిలో మెరిసి
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?