KishanReddy: దేశ ప్రతిష్ఠను పెంచిన మోదీనే మళ్లీ ప్రధాని కావాలి: కిషన్‌రెడ్డి

దేశ భవిష్యత్‌ నరేంద్ర మోదీని మరోసారి గెలిపించుకోవాలని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కోరారు.

Updated : 27 Feb 2024 16:28 IST

హైదరాబాద్‌: దేశ భవిష్యత్‌ కోసం ప్రధానిగా నరేంద్ర మోదీని మరోసారి గెలిపించుకోవాలని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కోరారు. గోషామహల్‌ జుమ్మారత్‌ బజార్‌లో నిర్వహించిన విజయ సంకల్ప యాత్రలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో 5 క్లస్టర్లుగా 17 నియోజకవర్గాల్లో 5.5 వేల కి.మీ మేర ఈ యాత్రలు జరుగుతున్నాయని చెప్పారు. 

‘‘భాజపాకు 2014లో 278 సీట్లు వస్తే.. 2019లో 302 సీట్లు వచ్చాయి. ఈ సారి 375 సీట్లు రావాలి. దేశ ప్రజలందరి మనసులో మోదీనే ప్రధాని అవ్వాలని ఉంది. కాంగ్రెస్‌ పాలనలో రూ. 12 లక్షల కోట్ల అవినీతి జరిగింది. ఇప్పుడు ఒక్క రూపాయి అవినీతి లేకుండా మోదీ పాలన సాగిస్తున్నారు. 500 ఏళ్ల కల అయోధ్య రామాలయాన్ని నిర్మించి.. మాట నిలబెట్టుకున్నాం. ఇది మోదీ వల్లే సాధ్యమైంది. ప్రపంచంలో మన దేశ ప్రతిష్ఠను ఆయన మరింత పెంచారు. అలాంటి నాయకుడు మళ్లీ ప్రధాని కావాలి. అందుకు తెలంగాణలో 17 ఎంపీ స్థానాల్లో గెలిపించాలి. ఎంఐఎం పార్టీ ప్రజాస్వామ్యానికి, అభివృద్ధికి వ్యతిరేకంగా పని చేస్తుంది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో కలుస్తుంది. అసదుద్దీన్‌ను పార్లమెంట్‌కు వెళ్లకుండా అడ్డుకోవాలంటే.. హైదరాబాద్‌ నుంచి భాజపాను గెలిపించాలి’’ అని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని