Nara Lokesh: మంగళగిరిలో కన్‌స్ట్రక్షన్‌ అకాడమీ ఏర్పాటు చేస్తాం: నారా లోకేశ్‌

బైక్‌ మెకానిక్‌లు, ఇసుక ముఠా కార్మికులతో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ భేటీ అయ్యారు.

Published : 07 Apr 2024 15:38 IST

అమరావతి: చిర్రావూరు, పాతూరు, గుండిమెడ, పెదకొండూరు, గొడవర్రు గ్రామాలకు చెందిన బైక్‌ మెకానిక్‌లు, ఇసుక ముఠా కార్మికులతో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ భేటీ అయ్యారు. పాత ఇసుక విధానంతో నిర్మాణరంగానికి గత వైభవం తీసుకొస్తామన్నారు. నిర్మాణ కార్మికులకు మెరుగైన శిక్షణ కోసం మంగళగిరిలో కన్‌స్ట్రక్షన్‌ అకాడమీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. బైక్‌మెకానిక్‌లకు అధునాతన వాహనాలపై శిక్షణ అందిస్తామన్నారు.

జగన్‌ పాలనలో మొదటి బాధితులు భవన నిర్మాణ కార్మికులేనన్నారు. పనుల్లేక వందలాది మంది కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని దుయ్యబట్టారు. గతంలో కార్మిక బోర్డు ద్వారా వివిధ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామన్నారు. వైకాపా ప్రభుత్వంలో కార్మిక బోర్డు నిధులు రూ.2,500 కోట్లు పక్కదారి పట్టించారని విమర్శించారు. అధికారంలోకి వచ్చాక కార్మిక సంక్షేమ బోర్డును ప్రక్షాళన చేయడంతో పాటు చంద్రన్న బీమా పథకం, పనిముట్లు అందజేస్తామని లోకేశ్‌ భరోసా ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని