Nara Lokesh: శనివారం నుంచి లోకేశ్‌ పాదయాత్ర .. ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు

మిగ్‌జాం తుపాను కారణంగా యువగళం పాదయాత్రకు విరామం ప్రకటించిన తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ శనివారం నుంచి తిరిగి ప్రారంభించనున్నారు.

Updated : 08 Dec 2023 22:45 IST

కాకినాడ: మిగ్‌జాం తుపాను కారణంగా యువగళం పాదయాత్రకు విరామం ప్రకటించిన తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ శనివారం నుంచి తిరిగి ప్రారంభించనున్నారు. నారా లోకేశ్‌ శుక్రవారం రాత్రి కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మంలడం శీలంవారిపాకల చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు తెదేపా శ్రేణులు ఘన స్వాగతం పలికారు. శీలంవారిపాకలు జంక్షన్‌ నుంచి 217వ రోజు పాదయాత్ర ప్రారంభంకానుంది.. పాదయాత్ర తుని అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది. ఈ సందర్భంగా కాకినాడ సెజ్‌ బాధిత రైతులతో లోకేశ్‌ సమావేశం కానున్నారు. పెరుమాళ్లపురం దివీస్‌ ఫ్యాక్టరీ వద్ద స్థానికులతో, ఒంటిమామిడి కొత్తపాకల వద్ద ఆక్వారైతులతో సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం ఒంటిమామిడి వద్ద విడిది కేంద్రంలో బస చేయనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని